Pages

16/06/2024

అంతరిక్ష పోటీ లో దూసుకుపోతున్న చైనా (Translation)

చైనాకు చెందిన చాంగ్-ఇ 6 ప్రోబ్ చందమామకి అవతల వైపు జూన్ 2 న లాండ్ అయింది.  అక్కడినుండి ఎనాలసిస్ కోసమని భూమికి సాంపిల్స్ కూడా తెస్తుంది.  చైనాకి చెందిన ఒక అంతరిక్ష వాణిజ్య సంస్థ, మే 29 న సముద్రం నుంచి తన రెండవ లాంచ్ చేసింది.  ఇది 2024 వ సంవత్సరంలో చైనా యొక్క 25 వ ఆర్బిటల్ మిషన్. చైనా ప్రధాన స్పేస్ contractor చెప్పిన దాని ప్రకారం వాళ్ళు 2024 సంవత్సరంలో 100 లాంచు లు చేద్దామని లక్ష్యం పెట్టుకున్నారంట. మే 2024 సరికి చైనా కి చెందిన, "ఫంక్షనల్ గా ఉపయోగంలో ఉన్న" 600 సాటిలైట్లు, ఇప్పటికే  భూ కక్ష్య లో ఉన్నాయి.  చైనా మిలిటరీ ఈ స్పేస్ మిషన్ ల కు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. జనవరి 2024 కల్లా చైనా కి 359 నిఘా సాటిలైట్లు ఉన్నాయి. అవి 2018 లో ఉన్నవాటికి మూడు రెట్లు ఎక్కువ.  చైనా "లాంగ్ మార్చ్" రాకెట్లు ప్రపంచంలో కెల్ల శక్తివంతమైన రాకెట్లలో కొన్ని.  లాంగ్ మార్చ్ 5 (CZ-5) అయితే 25000 కిలోల పే లోడ్ ని భూ నిమ్న కక్ష్యలోకీ (Low Earth Orbit) , 14000 కిలోల పేలోడ్ ని జియోస్టేషనరీ (భూ స్థిర కక్ష్య) ట్రాన్స్ఫర్ ఆర్బిట్ లోకి మోసుకుపోగలదు.  

ఇలా వేల టన్నుల పేలోడ్ ని ఇకపై ఇలా స్పేస్ కి తరలించేందుకని చైనా తన దగ్గరున్న అన్ని రాకెట్లనీ 2035 కల్లా పూర్తిగా "రీయూసబుల్ రాకెట్లు" గా మార్చేయాలని కూడా అనుకుంటుంది. అలా దాని లక్ష్యం ప్రకారం 80 టన్నుల LEO వేరియంట్ పూర్తిగా రీయూసబుల్ రాకెట్ 2040 కల్లా ఉపయోగం లోకి వస్తుంది. ఒక్క మీటర్ ఆక్యురసీ తో ప్రస్తుతం మనం విస్తారంగా ఉపయోగిస్తున్న  జీపీఎస్ (GPS) ని మించిన  సామర్ధ్యంతో పనిచేయబోయే బైడూ వ్యవస్థ ని చైనా అభివృద్ధి చేస్తూంది. ఇప్పుడు మనకి భూమిపై అందుబాటులో ఉన్న 5G  ఇంటర్నెట్ ని,  సాటిలైట్ ఇంటర్నెట్ తో ముడివేసి ఈ బైడూ నేవిగేషన్ సిస్టం పనిచెయ్యబోతుంది.  ఇప్పటికే ఇరవై ఇద్దరు చైనీయులు స్పేస్ కు ప్రయాణం కట్టారు. 2030 కల్లా చైనీస్ ఆస్ట్రోనాట్లతో స్పేస్ వాక్ చేయించేద్దామని అనుకుంటున్నారు.  ఇంకా మనుషుల క్రూతో చందమామ మీదకి అడుగుపెట్టాలని  కూడా ప్లాన్స్ ఉన్నాయి. మార్స్ మీదికీ మూన్ మీదికీ వెళ్ళేందుకు వాళ్ళకు టైం టేబుల్ కూడా తయారయింది. Queqiao & Tiandu  సాటిలైట్లతో కలిపి చందమామ కి సందేశాలను రిలే చేస్తూ చందమామ లో దూర దూర ప్రాంతాలకు కనెక్టివిటీ కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.  రష్యా, చైనా లు షేరింగ్ లో ఒక న్యూక్లియర్ రియాక్టర్ చందమామ మీద 2035 కలా నిర్మించేసేయాలని అనుకుంటున్నారు - అదీ, మానవరహితంగా!   చైనా కి భూ కక్ష్యల్లోనే ఉండే సోలార్ పవర్ ప్లాంట్ లని నిర్మించేయాలని కూడా ప్లాన్స్ ఉన్నాయి. 

కొన్ని ఆర్ పీ ఓ (RPO - Rendezvous and Proximity Operations) లని కూడా నిర్వహించేస్తున్నారు. ముఖ్యంగా జీ ఈ ఓ (GEO geostationary belt) బెల్ట్ కి దగ్గరగా వెళ్ళడం, పరిశీలించి రావడం లాంటివి.  2022 లో చైనీస్ సాటిలైట్ ఒకటి, తనకి అడ్డొచ్చిన ఒక మృత సాటిలైట్ ని తీస్కెళ్ళి, 300 కిలో మీటర్ల అవతల సాటిలైట్ల స్మశానం (graveyard) లోకి విసిరేసి రావడం గమనించారు. అంటే అలాంటి కేపబిలిటీ - సామర్ధ్యం అప్పటికే వాళ్ళకుందన్నమాట. తనకు కావాలంటే శత్రువు కి చెందిన సాటిలైట్ ని తొలగించే లేదా నిరుపయోగంగా చెయ్యగలిగే సామర్ధ్యం అన్నమాట. అదే విధంగా తనకు కోపం కలిగించే సాటిలైట్లను కక్ష్యలనుండి తొలగించేసేందుకు అణ్వాయుధాలని కూడా వాడాలని (ఏంటీ సేటిలైట్ కెపాసిటీ & cyber electronic warfare) చైనా అనుకోవచ్చు. ఈ ప్రమాదాలను ప్రపంచం  గ్రహించుకోవాలి.  రష్యా కూడా ఇలా న్యూక్లియర్ స్పేస్ వెపన్స్ ని అభివృద్ధి చెయ్యడానికి ప్రయత్నిస్తుంది. ఇవి సృష్టించే మేసివ్ ఎనర్జీ వేవ్స్  సాటిలైట్లను మట్టుపెట్టొచ్చు.  చైనా స్పేస్ ఆధారిత ఎసాట్ (ASAT- Anti-Satellite)  వ్యవస్థ మీద కూడా పరిశోధనలు చేస్తుంది. ఇవి చైనా శత్రుదేశాలు ఆలోచించాలిన విషయాలు.  

షిజియాన్-17 (Shijian-17) అక్టోబర్ 2021 లో ప్రయోగించారు కదా. అది చైనాకు చెందిన మొదటి రోబోటిక్ ఆర్మ్ ఉన్న సాటిలైట్. దీనికి జియోస్టేషనరీ ఆర్బిట్ లో ఉన్న వస్తువులతో చిన్న సైజు కుస్తీ చేసే సామర్ధ్యం ఉంది. షియాన్ -12 (Shiyan-12)  కి అయితే,  రెండు అనుబంధ ఇన్స్పెక్టర్ సాటిలైట్స్ ఉన్నాయి. అవి అమెరికన్ ఇన్స్పెక్టర్ సాటిలైట్లు వస్తే, తప్పించుకునేందుకు దానికి సహకరిస్తాయి.  అంటే, అంతరిక్షం లో పోరాటం చేసే సామర్ధ్యం ఉన్నట్టేగా! TJS -3 అయితే ఒక ఉప-ఉపగ్రహాన్ని కూడా జేబులో పెట్టుకుని వెళ్తుంది. ఆ ఉప-ఉపగ్రహానికి "హెచ్చరించే, సిగ్నళ్ళని దొంగతనంగా వినే, ఏమార్చే" సామర్ధ్యాలుంటాయి. అంటే, సైబర్ ఎలక్ట్రానిక్ ఆపరేషన్స్ లో ఉపయోగపడే సిగ్నల్ స్పూఫింగ్ కు పాల్పడగలదు.  ఇలా  చైనీస్ ప్రైవేటు స్పేస్ కంపెనీల సామర్ధ్యం, వాటి ప్రయత్నాలనీ పక్కనపెడితే, చైనా ప్రభుత్వ రంగ అంతరిక్ష్య సంస్థ  CASC, రెండు పెద్ద వ్యాసార్ధం ఉన్న రీయూసబుల్ రాకెట్లని ప్రయోగాత్మకంగా టెస్ట్ చేసేద్దామనుకుంటుంది.  నాలుగూ, అయిదూ మీటర్ల వ్యాసార్హ్దం ఉన్న 'లాంగ్ మార్చ్ 10' రాకెట్లను 2025 లోనూ, 2026 లోనూ ప్రయోగిస్తారు. ఇలా మళ్ళీ మళ్ళీ ఉపయోగించగలిగే రాకెట్లను స్పేస్ ఎక్స్ (SpaceX) తరహాలో తయారుచేసేసుకునే సామర్ధ్యం చైనాకు దక్కుతుంది.  ఇంకా అదే విధంగా మళ్ళీ మళ్ళీ ఉపయోగించగలిగే స్పేస్ షటిళ్ళని కూడా తయారుచెయ్యాలనుకుంటుంది.  ఇవి ఆయుధాలను, శక్తివంతమైన మైక్రోవేవ్ ఆయుధాలను, లేదా లేసర్ ఆయుధాలను, అంతరిక్ష్యంలో ప్రయోగించేందుకు వేదికలుగా ఉపయోగపడతాయి.

చైనా ఈ సంవత్సరం స్టార్ లింక్ (Starlink) తరహా ఇంటర్నెట్ సాటిలైట్ల పుంజాన్ని (Constellation) భూనిమ్న కక్ష్య లో (లియో Low Earth Orbit) లో ప్రవేశపెట్టేందుకు  సన్నాహాలు చేస్తుంది. ఇందులో 26000 సేటిలైట్లుంటాయి. ఇవి భూగోళాన్నంతటినీ కవర్ చేస్తాయి. వీటిని ప్రభుత్వానికి సంబంధించిన కంపెనీలు నడిపిస్తాయి.  అలాగే 2024 మొదటి సగం నుండీ 2029 దాకా 1300 సాటిలైట్లని  China Satellite Network ప్రవేశపెట్టబోతుంది.  ఇలా చైనా మొదటి సాటిలైట్ నెట్వర్క్, అంతరిక్షంలో అమెరికా అధికారానికి 2035 కల్లా చెక్ పెట్టగలదు. దీనికి 6G సామర్ధ్యం వాడుకుంటుంది. కంపెనీలు తక్కువ ఖర్చులో అంతరిక్షానికి రవాణా సాటిలైట్లని నడపబోతున్నాయి.  కొన్ని చంద్రుడి మీద లాండ్ అవడానికీ, మరీ ఆశమోతు కంపెనీలు అక్కడ కాలనీలు నిర్మించడానికీ అవకాశాలను వెతుకుతున్నాయి.  కొన్ని చంద్రుడి మీదికి టూరిజం కూడా మొదలుపెట్టాలనుకుంటున్నాయి. ఇప్పటిదాకా చైనా అంతరిక్ష రంగం, అమెరికా, రష్యాలు సాధించిన మైలు రాళ్ళనే చేరింది సరే. కానీ ఇప్పుడు అది కొత్త లక్ష్యాలను పెట్టుకుంటోంది. (Setting new standards!)   చైనా ఏరోస్పేస్ ఇండస్ట్రీ ఇప్పటికే చాలా వ్యూహాత్మకంగా అభివృద్ధి చెందుతున్న రంగంగా  పేరు తెచ్చుకుంది. ఓషనోగ్రఫీ, సమాచార నెట్వర్క్ లు, లైఫ్ సైన్సెస్ మరియు అణు శాస్త్రంలో కూడా మంచి అభివృద్ధి సాధించింది ఈ దేశం.  అది ఇకపై స్పేస్ లాంచులు, సేవల్నీ ఒక వాణిజ్యంగా అభివృద్ధి చెయ్యాలనుకుంటోంది.  అధ్యక్షుడు Xi   చైనా, అమెరికాలమధ్య వాణిజ్య ప్రతిష్ఠంబన వల్ల అస్సలు ఇకపై నష్టపోకూడదు అనుకుంటున్నాడు. అంతరిక్షపు పోటీ లో 80 శాతం ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఎందుకు ప్రోత్సహించారంటే, ఈ అంతరిక్ష రంగంలో ప్రతీదీ 2025 కల్లా స్వదేశంలోనే అందుబాటులోకి తేవాలనే. ప్రతీ పార్టూ స్వదేశంలో దొరికేయాలని కూడా. 

 

చైనా ప్రతి స్థానిక ప్రభుత్వం కిందనూ ఒక స్పేస్ డెవలెప్మెంట్ జోన్ (మన సెజ్ లాగా) తీసుకురాబోతుంది. దీనివల్ల స్పేస్ ఇండస్ట్రీకి చెందిన ప్రతీదీ స్థానికంగానే తయారు చేసేందుకు, సప్లై చైన్ దెబ్బతినకుండా ఉండేందుకూ వీలవుతుంది.  Xi అధికారంలో ఉన్నంతవరకూ  చైనా లో అంతరిక్ష రంగానికి చాలా ప్రాముఖ్యత దొరుకుతుంది.  అలా కొన్ని కీలక ఏరోస్పేస్ ప్రాజెక్ట్ లలో ముందండడం ద్వారా అమెరికా పై పైచేయి సాధించగలం అని అధ్యక్షుడి ఆశ.  అలా China ని భూతల స్వర్గం గా 2050 కల్లా మార్చాలని వాళ్ళ లక్ష్యం.  ఇటు మన దేశం స్పేస్ టెక్నాలజీలో చాలా అంశాలలో నైపుణ్యం సాధించినా, చైనా బెదిరింపులకి సరిపడా విజ్ఞానం మనకి ఇప్పటికీ లేనట్టే. అలా అని ఇండియా చైనాతో పోటీ పడాలని కాదు గానీ మన సొంత ఆర్ధిక, రక్షణ అవసరాలకైనా మనం మనల్ని ఇంకా ముందుకు తోసుకుపోవాల్సిన అవసరం ఉంది. చైనాకి ఇప్పటికే పూర్తిగా పనిచేసే సాటిలైట్ ఆధారిత navigation సిస్టం ఉంది. మన రీజినల్ జీ.పీ.ఎస్ NavlC, ఇంకా నత్తనడకల్లోనే ఉంది.

 హిమాలయాల మీదా, ఉత్తర హిందూ మహాసముద్రం పైనన్నూ చైనా కున్న స్పష్టమైన అంతరిక్ష దృష్టికి  సాటిలేదు. ఇదే పరిస్థితుల్లో మన దేశంలో ఉన్న(అంతరిక్ష ఆధారిత) సమాచార వేగం ఎంత తక్కువగా ఉందంటే, యుద్ధ సమయాల్లో మనకి అది ఏమాత్రం సరిపోదు. మనకి మరిన్ని సాటిలైట్లు కావాలి. అప్పటిదాకా మనం విదేశీ సాటిలైట్లమీద ఆధారపడాల్సిందే.  మన రక్షణరంగం ఇంకా బోల్డన్ని సాటిలైట్లని ఇవ్వమని ప్రభుత్వాన్ని అడగాలి. ప్రభుత్వం కూడా ఈరంగానికి ఎక్కువ నిధులు కేటాయించాలి. సురక్షిత సాటిలైట్ ఆధారిత కమ్యూనికేషన్ లో చైనా ఇప్పటికే చాలా అభివృద్ధి సాధించింది. మనకన్నా అంతరిక్ష సంపదలపై దాడులు చేయగలిగే సామర్ధ్యం, బోల్డన్ని ఏంటీ సాటిలైట్ ఆయుధాలూ ఉన్నాయి. అంతరిక్షమే అంతిమ సరిహద్దు.  భారత దేశం ప్రస్తుతం మంచి పొజిషన్ లోనే ఉన్నా ఇంకా చెయ్యాల్సింది చాలా వరకు  మిగిలిపోయే ఉంది.   

***

Original : China 'Races Ahead' of mentor Russia, outpaces NASA as Xi Jinping goes all out to win space race, EurAsian Times, 09 Jun 2024, OPED by Air Marshal Anil Chopra (Retd)

 

 




 


14/04/2024

UN Peace Operations - Maj Gen (Dr) AK Bardalai (Retd)

గడిచిన రెండేళ్ళూ,  ఐక్యరాజ్యసమితి కి  కష్టకాలం. ప్రపంచాన్ని కుదిపేసి వదిలిన  మహమ్మారి తగ్గుముఖం పట్టగానే యుక్రెయిన్ మీద రష్యా 22 ఫిబ్రవరి 2022 న దాడి కి నిర్ణయం తీసుకుంది. ఆయుద్ధం ఇప్పటికీ కొనసాగుతూనే వుంది.  ప్రపంచం ఎన్ని ఆక్రందనలు చేసినా పట్టించుకున్న నాధుడు లేడు. ఈ లోపు ఆఫ్రికా లో ఐక్యరాజ్యసమితికి చెందిన మాలీ మిషన్ (UN Multidimensional Integrated Stabilization Mission in Mali - MINUSMA)  ను దేశం వదిలి వెళ్ళాల్సిందిగా మాలి కోరింది. కాంగో కూడా ఏడాది చివర్లోగా మెల్లగా తప్పుకోవాల్సింది గా  చెప్పేసింది. (UN Organization Stabilization Mission in the Democratic Republic of the Congo (MONUSCO).  

ఇది చాలదన్నట్టు 7 అక్టోబర్ 2023 న హమాస్ ఇజ్రాయిల్ మీద దాడి చేసింది. ఇజ్రాయిల్ ఎదురుదాడి ఎలాగూ ఒకరు ఆపగలిగేవిధంగా లేదిప్పుడు. ఈ పరిస్థితుల్లో ఐక్యరాజ్యసమితికి చెందిన మూడు శాంతి  స్థాపక మిషన్ లు  ఇరుకున పడ్డాయి. అవి  UNTSO, UNDOF, UNIFIL. ఇవన్నీ పాలస్తీనా శాంతి ప్రక్రియ మీద ఆధారపడినవే. పాలస్తీనా లో పరిమిత యుద్ధం ఇప్పటికయితే ఆగేటట్టు కనిపించడం లేదు.  అసలు ఈ యుద్ధాలలో, మారుతున్న ప్రపంచ రాజకీయాలలో, గాజా లో అంతూ పొంతూ లేకుండా సాగుతున్న ఈ పరిమిత యుద్ధం ఎన్నాళ్ళు పరిమితంగా ఉండగలుగుతుందో, పూర్తిస్థాయి యుద్ధంగా మారకుండా ఉండడానికి  ఐక్యరాజ్య సమితి, Israel లో ప్రస్తుతం పనిచేస్తున్న  దాని అనుబంధ సంస్థలు United Nations Truce Supervision  Organization (UNTSO), UNDOF (United Nations Disengagement Observer Force), UNIFIL (United Nations Interim Force in Lebanon (UNIFIL), అసలు ఏమి చేస్తున్నాయో తెలుసుకుందాం.  సమితి నిర్దేశించిన ఆపరేషన్లు ఎలా ఈ పెద్ద పెద్ద పోరాటాలలో  అసలు ఎలా పనికొస్తున్నాయో / పనికి రాకుండా పోతున్నాయో కూడా ఓ సారి ఆలోచించాలి.  

మిడిల్ ఈస్ట్ రాజకీయాలలో పాలస్తీనా సమస్య ఈ మూడు మిషన్ లనూ  కలుపుతుంది. అసలు ఈ మూడు సంస్థలూ ఎలా ఏర్పడ్డాయో, వాటి చరిత్ర, పాలస్తీనా తో వాటి అనుబంధమూ ఏమిటో మొదట చూద్దాము. 

UNTSO (United Nations Truce Supervision  Organization) : 

29 మే 1948 అరబ్ - ఇజ్రాయిల్ యుద్ధానంతరం ఇజ్రాయిల్, తన ఇరుగు దేశాలయిన ఈజిప్ట్, జోర్డన్, లెబనాన్, సిరియా లతో మధ్యవర్తిత్వం నెరిపేందుకు ఏర్పడిన సంస్థ ఇది.  పాలస్తీనా భూభాగంలో "ఇజ్రాయిల్"  ఏర్పడుతున్నట్టు బ్రిటన్ 11 మే 1948 న ప్రకటించగానే ఈ "అరబ్ - ఇజ్రాయిల్  యుద్ధం",  పాలస్తీనా కి మద్దతుగా  మొదలయింది. ఈ యుద్ధం ఐక్యరాజ్యసమితి military observers జోక్యంతో ముగిసింది. అలా UNTSO మొట్టమొదటి శాంతి స్థాపక బృందంగా 29 మే 1948 న ఏర్పడింది.  ఇజ్రాయిల్ తో నాలుగు పొరుగు దేశాలూ కొట్టుకుని చచ్చిపోకుండా శాంతి కోసం జరిగిన ఒప్పందాలని సరిగ్గా అమలు జరిగేలా చూసే బాధ్యత UNTSO  పైన పడింది. అయితే 1978 లో UNTSO పరిశీలకులు రెండు గ్రూపులు గా ఏర్పడ్డారు. Observer Group Golan (OGG), Observer Group Lebanon (OGL).  ఈ గ్రూపులన్నీ సమన్వయంతో పనిచేస్తూ వస్తున్నాయి. ఈ పీస్ కీపింగ్ మిషన్ లలో భారత సైన్యం చాలా ఏళ్ళుగా మిలిటరీ, నాన్ మిలిటరీ భాగస్వామ్యం కలిగి ఉంది. ముఖ్యంగా సిరియా, ఇజ్రాయెల్ సరిహద్దుల్లో గోలన్ హైట్స్ వద్ద నేపాల్, భారత్ సైన్యాలు వంతుల వారీగా పరిశీలకులుగా పనిచేస్తున్నాయి.  


UNDOF (United Nations Disengagement Observer Force)  :

ఇది కూడా పాలస్తీనా భౌగోళిక నైసర్గిక రాజకీయాల పరిణామాలతో ముడిపడిన అంశాలను ఆధారంగా చేసుకుని మొదలయిన సంస్థ. గాజా పై ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ దాడుల కు ప్రతీకారంగా 1956 లో పాలస్తీనా ఫిదాయీన్ దాడులు జరిగాయి. వీటి అనంతరం ఇజ్రాయిల్, ఈజిప్ట్ బంధాలు తీవ్రంగా చెడిన తరవాత,  ఈజిప్ట్ సూయెజ్ కెనాల్ లో ఇజ్రాయిల్ కదలికల్ని కట్టడి చేసింది. ఈ కట్టడి టిరాన్ స్ట్రైట్ లో కూడా తీవ్రతరం చేసింది. ఇది సూయెజ్ కాలువ సమస్యని అంతర్జాతీయ సమస్య గా మార్చింది. బ్రిటన్, ఫ్రాన్స్ రహస్యంగా సూయెజ్ కాలువ ను తమ స్వాధీనంలోకి తీసుకోవాలనే ఒప్పందానికి వచ్చాయి. 29 అక్టోబర్ 1956 న ఇజ్రాయెల్ ఈజిప్ట్ సరిహద్దుల్ని దాటొచ్చి ఈజిప్ట్ పై దాడి మొదలుపెట్టింది. దానికి మద్దతుగా 31 అక్టోబర్ న ఉత్తరాన్నుంచి బ్రిటన్, ఫ్రాన్స్ లు ఈజిప్ట్ ని చుట్టుముట్టాయి. ఈ పరిణామాల అనంతరం United Nations Emergency Force ని ఏర్పాటు చేసారు.  

ఇదిలా వుండగా ఈజిప్ట్ ఇజ్రాయిల్ పై సూయెజ్ కాలువ పొడుగునా తిరుగుదాడులు మొదలు పెట్టింది. అటు సిరియా సేనలు  1973 అక్టోబర్ 6 న గోలన్ పర్వతశ్రేణుల పై ఇజ్రాయిల్ పోస్ట్ లపై దాడులు  మొదలు పెట్టాయి. ఈ యుద్ధం ముగిసాక, సిరియా, ఇజ్రాయిల్ ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం మే 1974 లో జరిగింది. దీని అమలును పర్వవేక్షించేందుకు UNDOF ఏర్పడింది.అయితే దీనిలో  సైనికుల బృందాలుంటాయి. వీటి పాత్ర,  ఆయుధాలని Self-Defence కు  ఉపయోగించడానికే పరిమితం.  


UNIFIL (United Nations Interim Force in Lebanon (UNIFIL) : 

ఇది మూడో శాంతి స్థాపక మిషన్. ఇది ఇజ్రాయిల్, లెబనాన్ ల మధ్య ఘర్షణలను తగ్గించేందుకు ఏర్పడింది. ఇది కూడా పాలస్తీనా కు లెబనాన్ మద్దతు ఇవ్వడం వల్ల ఏర్పడిందే. ఇజ్రాయిల్ స్థాపన ప్రకటన వెలువడ్డాక, అప్పటి దాకా పాలస్తీనా భూభాగం లొ ఉండిన "యూదులు కాని ప్రజలనందరిని"  వెస్ట్ బాంక్, గాజాలకు నెట్టేసారు.  ఈ ఉదంతం కారణాన  వేలాది పాలస్తీనియన్లు లెబనాన్ కు శరణార్ధులై పారిపోయారు. లెబనాన్ లో సివిల్ వార్ తరవాత PLO (Palestine Liberation Organization) దక్షిణ లెబనాన్ లో  బలం పుంజుకుని ఇజ్రాయిల్ మీదికి దాడులు మొదలు పెట్టింది. ఇజ్రాయిల్ తిరగబడి లెబనాన్ ని స్వాధీనం చేసుకునేందుకు మార్చ్ 1978 లో ప్రయత్నించింది. అప్పుడే ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుని, యుద్ధాన్ని ఆపి, దక్షిణ లెబనాన్ లో UNIFIL  ను స్థాపించింది.  అయినాసరే ఇజ్రాయిల్ 5 జూన్ 1982 న ఇంకోసారి,  హిజబొల్లా ఎత్తుకెళ్ళిన తన సైనికులను విడిపించేందుకని లెబనాన్ పై దాడి చేసి ముఖ్యంగా బీరూట్, దక్షిణ లెబనాన్ లలో PLO టార్గెట్ లను నాశనం చేసింది. ఇక్కడ అతి పెద్ద యుద్ధం జూలై 2006 న మొదలై 34 రోజుల పాటు సాగింది. 

ఇప్పటికీ దశాబ్దం పాటు యుద్ధం లాంటిదేదీ జరగక పోయినా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF), హిజబొల్లా ల మధ్య శతృత్వం బాగానే బలపడింది.  లెబనాన్ ఆర్ధికంగా చిక్కిపోయినా సరే పెరిగిన హిజబొల్లా ఆధునికీకరణ, దాని కొత్త ఆయుధ సాంకేతిక సంపత్తి, ఇజ్రాయెల్ ను  బాగా ఇరుకున పెట్టే విషయం.  హిజబొల్లా విజయం అంతా లెబనాన్ ప్రభుత్వానికీ, లెబనాన్ ప్రజానీకానికీ కేవలం తను మాత్రమే ఇజ్రాయిల్ దాడుల్నిండీ లెబనాన్ ని రక్షించగలదు అనే భావనను కలిగించడం పైనే ఆధారపడి ఉంది.  పాలస్తీనా కు మద్దతు ఇవ్వడం హిజబొల్లా ఉనికికి కీలకం కాబట్టి పాలస్తీనా ని ఘోరంగా అణిచేయడానిని నియంత్రించగల సత్తా హిజబొల్లాకు ఎంతోకొంత ఉందని ఇజ్రాయిల్ కు గుర్తుంటుంది. .  

ఈ మూడు సంస్థలూ ప్రస్తుతం గాజాకు మాత్రం పరిమితమైన యుద్ధం నాలుగువైపులా విస్తరించకుండా ఇకపై  ఎలా ప్రభావితం చేయగలవో చూడాలి. 

GAZA WAR : 

UNTSO, UNDOF, UNIFIL లు పాలస్తీనా సమస్య ఆధారంగా ఏర్పడినవే కాబట్టి, పాలస్టీన్ లో జరిగే ఘటనల ప్రభావం ఈ సంస్థల మీద ఖచ్చితంగా ఉంటంది.  గాజాలో పరిణామాల నేపధ్యంలో మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న అనిశ్చితి నుండీ లాభపడాలని చూసే దేశాలూ బాగానే ఉన్నాయి. యుద్ధం నుండీ గడించాలని చూసే వాళ్ళు దానికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ మద్దతు ఇస్తారు.  గాజా మండిపోతుంటే ఆ మంటలలో చలికాచుకునే దేశాలున్నాయి. కాబట్టి ఈ యుద్ధానికి, మారణహోమానికీ మద్దతూ ఎక్కువగానే ఉంది. ఈ సమస్యకి  పరిష్కారం  దౌత్య పరంగా చిక్కాల్సిందే.  ఈ రెండు దేశాల మధ్యా ఇంత విపరీతమైన తరతరాలనాటి చారిత్రక శతృత్వం ఉన్నప్పుడు, ప్రతీకారేచ్చతో ఇరు వర్గాలూ ఊగిపోతున్నప్పుడు ఈ యుద్ధం శాంతియుతంగా ముగుస్తుందనుకోవడం అసాధ్యం.  కాకపోతే, ఈ యుద్ధం పెద్దదవడం, పాల్గొనబోయే దేశాలు ఎక్కువవడం, అగ్రరాజ్యం కూడా యుద్ధంలో ప్రత్యక్షంగా చేరాల్సి రావడం లాంటివి జరగడం, ప్రపంచానికి మంచిది కాదు.   

అయితే ప్రణాళిక ప్రకారం జరిగే 2006 నాటి లెబనాన్ యుద్ధం, 2023 అక్టోబర్ హమాస్ దాడులు, వంటి Political గా ప్రేరేపింపబడిన దాడులను ఆపడం సాధ్యం కాదు.  Wimmen and Wood for Crisis Group పరిశీలన ప్రకారం, లెబనాన్ గానీ,  UNIFIL గానీ హిజబొల్లా ని నియంత్రించగలిగే స్థితిలో లేవు. అయితే ఇలాంటి పరిమిత స్థాయి యుద్ధాలలో సూత్రధారులు ఇతర శక్తుల్ని కూడా పాల్గొనేలా రెచ్చగొట్టే విధానాలకు దిగుతున్నప్పుడు వివిధ లౌక్య విధానాల ద్వారా వాటిని ఆపడం అవసరం. ఈ పనులు చెయ్యడానికి UNTSO, UNDOF, UNIFIL లు పనికొస్తాయి. అయితే, సరిహద్దుల్లో ఈ సంస్థలు  ఉన్న ప్రాంతాల పరిసరాల్లో దాడులకు దిగడం, బ్లూ లైన్ లలో పౌరులు సైతం నిరసన ప్రదర్శనలు చెయ్యడం రెచ్చగొట్టే విధానాల కిందికే వస్తాయి.   ఇవి సులువుగా పరిస్థితులు దిగజారడానికి కారణం కావచ్చు.  గాజా మద్దతు దారుల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. నిజానికి ఈ మద్దతుదారు దేశాలు పాలస్తీనా లో విపరీతమైపోతున్న మారణహోమాన్ని ఆపేందుకు తమ ప్రయత్నాలు తాము చేస్తాయి. ప్రతీకాత్మక దాడులని అయినాసరే చేస్తాయి. 

యుద్ధవాతావరణం, దాడుల పరిస్థితులు,  శాంతి స్థాపక సంస్థల పనులను తీవ్రంగా దెబ్బతీస్తాయి. For eg, హమాస్ దాడుల అనంతరం UNDOF   పరిశీలకులను ఇజ్రాయెల్ ఎటూ కదలనివ్వలేదు.  ఒకవేళ ఈ ఉద్యోగులు క్షేత్ర స్తాయి లో జరిగేది తెలుసుకోవాలన్నా కూడా విచక్షణారహిత దాడులు వారి జీవితాల్ని కూడా ప్రమాదంలో పెడుతున్నాయి.  అయినప్పటికీ UN ఇజ్రాయిల్ లో చాలా మటుకు ఉద్రిక్తతల్ని నివారించిది. 

ఉదాహరణకు ఇజ్రాయెల్ లో "డ్రూజ్ కమ్యూనిటీ" ది ఒక ప్రత్యేక స్థానం. వీళ్ళు అరబ్బులే అయినా తమను తాము పాలస్తీనియన్లు అనుకోరు. వీరి విధేయత యూదుల వైపు ఉంటుంది. సిరియా, ఇజ్రాయెల్ సరిహద్దుల్లో ఇరువైపులా వీళ్ళు ఉంటారు. హమాస్ దాడుల అనంతరం, సిరియా వైపు ఉన్న డ్రూజ్ లు అందరూ ఇజ్రాయెల్ కు మద్దతు ప్రకటించారు. వాళ్ళ ఆవేశాలు ఎంత పెల్లుబికాయంటే, సిరియాలో తామున్న ప్రాంతం ఇజ్రాయెలైస్ చేయాలనుకున్నారు కూడా. ఇది సిరియా కు ప్రమాదకరం కాబట్టి,   UNDOF ఈ స్థానిక ఉద్రిక్తతని తగ్గించడంలో కీలక పాత్ర పోషించాల్సి వచ్చింది.  డ్రూజ్ ల పై దాడులు జరుగుతాయన్న భయాలనూ UNDOF చూసుకుంది వీటి వల్ల ఇంకో పెద్ద ప్రమాదం తప్పినట్లైంది. 

UNIFIL విషయానికొస్తే దక్షిణ లెబనాన్ లో సరిహద్దు గ్రామాల్ని ఖాళీ చేయించాల్సి వచ్చింది. ఈ ప్రాంతాల్లో హిజబొల్లా, IDF లు విపరీతంగా కాల్పులు, Shelling జరుపుకున్నాయి. ఇక్కడ కూడా UNIFIL బోల్డన్ని సమావేశాలు జరిపి కాల్పుల్ని ఆపించింది.  యుద్ధం లో జరిగిన బోల్డన్ని అన్యాయాల్నీ, హత్యల్నీ విచారించేందుకు ఈ బృందాలకు చోటు చిక్కట్లేదు. కీలకమైన సహాయక బృందాలే దాడుల్లో దుర్మరణాలు చెందుతున్నప్పుడు, జవాబుదారీతనం లోపించిన సైన్యాల ఉద్రిక్తతల మధ్య హిజబొల్లా నూ, IDF  నూ శాంతపరిచి ఆ ప్రాంతాలలో యుద్ధాన్ని ఆపడం చిన్న విజయం ఏమీ కాదు. అయితే ప్రస్తుతం లెబనాన్, ఇజ్రాయిల్ ల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరినా సరే అవి రెండూ పూర్తిస్థాయి యుద్ధం చేయడానికి మాత్రం ఇష్టపడడం లేదు. హమాస్ ని నిర్మూలించేసేందుకని కంకణం కట్టుకున్న ఇజ్రాయిల్ హిజబొల్లా చేతుల్లో పడి తన దృష్టిని మళ్ళించుకోవాలనుకోవట్లేదు.  

అటు ఉత్తరాన సిరియా లో UNDOF ద్వారా కూడా హిజబొల్లా ని వెనక్కు తగ్గమని చెప్పించే ప్రయత్నం జరిగింది.  ఇదే సమయంలో  సిరియా సరిహద్దుల్లో  UNDOF లోని పరిశీలకులుగా  పెద్ద యెత్తున ఉన్న ఫ్రాన్స్ దళాలు  కూడా, ఇజ్రాయెల్ యుద్ధం సిరియా సరిహద్దులకు విస్తరించకుండా ఆపేందుకు ఒక కారణం. తన స్నేహితులైన ఫ్రాన్స్ సైనికుల ప్రాణాలకు హాని కలిగించి, అంతర్జాతీయంగా తన స్థానాన్ని బలహీనపరుచుకోవడం ఇజ్రాయిల్ కు మంచిది కాదు. కాబట్టి నెతన్యాహూ యుద్ధోన్మత్తత కు ధీటు గా,   సరిహద్దుల్లో వివిధ స్నేహపూర్వక దేశాల సైనికులతో నిండిన  UN దళాలు వారి భూభాగాలలో physically ఉండడం వల్ల యుద్ధం మొత్తం గాజా కే పరిమితం అయింది. ఇజ్రాయెల్ వ్యతిరేక సరిహద్దు దేశాల ఉద్వేగమైన బదుళ్ళను UN సంస్థలు పరోక్షంగా నియంత్రించిన కారణంగా ఇజ్రాయెల్ యుద్ధ విస్తరణ రెండు సరిహద్దులలో ఈ విధంగా  నిలువరించడం జరిగింది.    అతిశయోక్తి అనుకోకపోతే,  ఒకరకంగా ఈ యుద్ధం ఓ మోస్తరు ప్రపంచ యుద్ధం కాకపోవడానికి, UNDOF, UNIFIL, UNTSO ల Lobbying, బాక్గ్రౌండ్ వర్క్  తప్పకుండా పనికొచ్చింది. 


ఇది పెద్దస్థాయి యుద్ధం కాకపోవడానికి లెబనాన్, ఇజ్రాయిల్, సిరియా ల సందిగ్ధత తో పాటు   "ఇది ఈ రీజియన్ కు మంచిది కాదన్న భావన"  కూడా కారణం.    ప్రస్తుతం గాజా యుద్ధం విషయం లో  అమెరికా తప్ప ఇజ్రాయెల్ కు ప్రపంచ దేశాల మద్దతు పెద్దగా ఏమీ లేదు. గోలన్ పర్వత శ్రేణుల్లో సిరియా సరిహద్దులకు సమీపంలోకి రష్యా సేనలు చేరడం  ఇజ్రాయెల్  సిరియాను గట్టిగా వ్యతిరేకించే సాహసం చేయకపోవడానికి ఇంకో ప్రధాన  కారణం. అంటే ఉదాహరణ కు UNDOFకు ట్రూప్స్ ని ఇచ్చే ఫ్రెండ్లీ దేశాలు (TCC -Troop Contributing Countries) ను ఇబ్బంది పెడితే, వారిపై దాడులకు దిగితే  అంతర్జాతీయంగా ఏకాకై పోవడం తప్పదు. ముఖ్యంగా ఆ UN Peace Keeping సైనికుల మాతృదేశాలు బలవంతమైన  రాజ్యాలైతే మరీనూ. దీన్ని బట్టి శాంతి స్థాపక బృందాలు యుద్ధాల్ని ప్రభావితం చేయగలవన్నది స్పష్టం అయింది. 

హిజబొల్లా కూడా నోరు మూసుకోవడానికి చాలా వరకూ UNIFIL ప్రెసెన్స్ కారణం. హమాస్ డెప్యూటీ నాయకుడు 'సలె అల్ అరౌరీ' ని గానీ సీనియర్ హిజబొల్లా కమాండర్ 'విసం హసన్ అల్ తవీ' ని గానీ  లెబనాన్ భూభాగం మీద డ్రోన్ తో దాడి చేసి ఇజ్రాయెల్, చంపినపుడు హిజబొల్లా ప్రతీకార దాడులకు చప్పున దిగలేకపోవడానికి కారణం  UNIFIL Contingent కు ఏమైనా హాని (collateral damage) జరుగుతుందేమో అన్న భయం తోనే.  

లెబనాన్ లోని అతిపెద్ద పాలస్తీనా శరణార్ధుల శిబిరం "అయిన్ అల్ హిల్వే" నుండి తయారయిన చిన్న చిన్న చిల్లర సాయుధ మూకలు ఎడా పెడా ఇజ్రాయెల్ లోకి రాకెట్ దాడులు చేయడం, దానికి హిజబొల్లా రక్షణ, శిక్షణ, హమాస్ సహకారం ఎప్పటుంచో ఉన్నవే. వాటిని పూర్తిగా నిలువరించడం సాధ్యం కాకపోయినా ఈ అంతర్జాతీయ సంస్థల కారణంగా చిన్న చిన్న ఉద్రిక్తతలు చినికి చినికి గాలివాన లా మారకుండా మాత్రం చాలా కాలం పాటు ఆగాయి.  అలా అని వీటి పాత్ర ని కొండంతలుగా చేసి కీర్తించక పోయినా ప్రస్తుతం ప్రపంచ శాంతి కల్ల అనీ, ఐక్యరాజ్యసమితి అసలు ఎందుకు ఉందని వెల్లువెత్తుతున్న ప్రశ్నల మధ్య మారుతున్న ప్రపంచ రాజకీయాలలో ఐక్యరాజ్య సమితి ఉపయోగం ఎంతమాత్రం కొట్టిపారేయాల్సింది కాదని చెప్పుకోవచ్చు.  


ఇకపై ఏమి జరగనుంది ? 


ఇప్పటి దాకా, అతివాద ప్రభుత్వం పదవిలో ఉన్నందున ఇజ్రాయెల్ దాడుల ప్రకోపం ఎక్కువ ఉంది, (ఇజ్రాయెల్ ది పైచేయి గా ఉంది అనట్లేదు) ఈ రోజుకీ హిజబొల్లా  కన్నా ఇజ్రాయిలే ఎక్కువ దూకుడు గా ఉంది. నిజానికి హమాస్ పని ముగిసినట్టే. అయినా కూడా ప్రజాభిప్రాయం మాత్రం ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగానే ఉంది.  ఎది ఏమైనా ఇప్పుడు దౌత్యం అంతా కాల్పుల విరమణ, యుద్ధం ఆగడం చుట్టూ తిరుగుతున్నందున హమాస్ కూ, ఇజ్రాయెల్ కూ, సమాన భాగస్వామ్యం ఉన్న ఒప్పందం ఒకటి తీసుకురావాలి. దీనిని అమలు చేయడానికి ఐక్యరాజ్య సమితి లాబీయింగ్ చాలా అవసరం. తెగేదాకా లాగడం ఇజ్రాయిల్ కూ, హమాస్ కూ ఇద్దరికీ మంచిది కాదు.  ఇజ్రాయెల్ కు మద్దతుగా ఒక అగ్రరాజ్యం, వ్యతిరేకంగా ఇంకొక అగ్రరాజ్యం ఒకదానికొకటి ఎదురుగా నిల్చున్నాయి. ఒక వేళ ఏదో ఒక ఒప్పందానికొచ్చి కాల్పుల విరమణ జరిగినా కూడా, ఉద్రిక్తతల డిగ్రీల కారణంగా ఎప్పటికైనా పూర్తి స్థాయి యుద్ధం ఏక్షణానైనా మొదలవ్వొచ్చు. కాబట్టి ఇరువర్గాల్నీ ఆపాల్సిన అవసరం ప్రపంచానికుంది. 

అయితే పీస్ కీపర్ కి ఉండే అవరోధాల్ని కూడా పట్టించుకుంటే, వీళ్ళలో తక్కువ ఆయుధాలు కలిగిన వారు, హెవీగా ఆయుధాలు కలిగిన వారు, ఆయుధాలు లేని పరిశీలకులు, ఎక్కువ రోజులు ఫీల్డ్ లో ఉండాల్సినవాళ్ళు, ప్రమాదం అంచుల్లో, అనిశ్చితి లో తీవ్ర మానసిక ఒత్తిడి కి లోనయ్యే వాళ్ళు, ఒక డైరెక్షన్ లేక కేవలం దౌత్యం, నిలువరింపు కార్యక్రమాలకు, నిస్సహాయంగా, రాజకీయాలకు ప్రత్యక్ష సాక్షులుగా ఉండాల్సి రావడం - ఇవన్నీ కూడా మారాల్సిన విషయాలు. యుక్రయిన్ విషయం లో UN ఏమీ పెద్దగా చెయ్యలేకపోయింది. UN సంస్థల్లోని ఉన్నతాధికారులు తమ తమ స్వదేశాల పొసిషన్ కు కూడా రాయబారులు. ప్రపంచ శాంతి, సౌభ్రాతృత్వాలకు ప్రతీకలు. స్థానిక లాబీయింగ్ లో కూడా ఒకోసారి కీలక పాత్ర పోషిస్తారు.  కాబట్టి సరైన పీస్ కీపర్ ని నిష్పాక్షికంగా  మెరిట్ ప్రకారం, అందరికీ ఆమోదయోగ్యంగా ఎంచుకోవడం కూడా పెద్ద సవాలే.   

గాజా యుద్ధం ప్రాంతీయంగా ఉన్నంత సేపు మనం అందరం క్షేమంగా ఉన్నట్టు.  ఎర్ర సముద్రపు వాణిజ్య మార్గాల్లోకి కూడా యుద్ధం విస్తరించింది. కానీ అది ఇంకా ఎక్కువగా ఇతర ప్రాంతాల్లోకి చిందడం అస్సలు క్షేమం కాదు.   ఈ యుద్ధం ఇతర ప్రాంతాలకు విస్తరించిందో అది ఎంత పెద్దదవుతుందో ఊహించలేము. కాబట్టి ప్రస్తుతానికి  పరిస్థితుల్ని దేవుడికి వదిలేయకుండా UN ని  acknowledge చేయడం, దానిని మరింత బలోపేతం చేయడం, మనం చేయాల్సిన పని. 

Free Translation of the Article : "Role of UN Peace Operations : An Actor of Stability in the Middle East", by  Maj Gen (Dr) AK Bardalai (Retd), UN Journal 2024.

No permissions taken. 

***

31/03/2024

పియా మోరా బాలక్ హం తరుణీగే - Mythili Poem by Mahakavi Vidyapati

 పియా మోరా బాలక్ హం తరుణీగే 

పియా మోరా బాలక్ హం తరుణీగే - 

కౌనె తప్ చుక్లో బెల్గౌన్ జననిగె


పహిరెలెల్ సఖి దక్షినక్ చీర్

పియా కె దెఖయిత్ మొరా దఘద్ శరీర్

పియా కె దెఖాయిత్ మోరా దఘద్ శరీర్

పీయా లెలె గోద్ కె చలాయి బజార్

హతియా కె లోగ్ పూచె కె లగె తొహర్

హతియ కె లోగ్ పూచె కె లగె తొహర్


నహీ మొరా దేవర్ కి నహి చోట్ భాయి

పూరబ్ లిఖాల్ చల్ బలము హమార్

పూరబ్ లిఖాల్ చల్ బలం హమార్

బత్ రె బతొహియ కె తహున్ మొర భై

హమరో సమద్ నైహార్ లెనై జాయ్

హమరో సమద్ నైహార్ లెనై జై


కహీ హున బబ కె క్నీయి ధెను గే

దూదవ పియ కె పొసత్ జమయి

దొదవ పియ కె పొసత్ జమయి

భనహి విద్యపతి సునహున్ బ్రిజ్ నారి

ధీరజ్ ధైరహున్ మిలత్ మురారి

ధీరజ్ దూఇరహున్ మిలత్ మురారి


పియా మోర బాలక్ హుం తరుణీగె

కౌనె తప్ చూకలొన్ భెలావూన్ జననీ గె

- Maithili Poem by Mahakavi Vidyapati 


నా భర్త బాలుడు (చిన్న పిల్లవాడు), నేనేమో యవ్వనం లో ఉన్న తరుణిని

నేను చేసిన పాపమేమో గానీ, నా భర్త బాలకుడు. 


సఖీ, ఏ దక్షిణ దేశపు చీరనో కట్టుకుని  అతన్ని చూసే సరికీ నా దేహం దగ్ధమౌతుంది. అతన్ని పట్టుకుని బజారు కు వెళ్దామన్నా, ప్రజలు అతను నీకేమౌతాడని అడుగుతున్నారే!


ఇతను నా మరిదీ కాదు, నా చిన్న తమ్ముడూ కాదు. విధి వశాన ఇతను నాకు భర్త అవుతాడు. పాంధుడా,  మాటవరసకైనా నువ్వు  నువ్వు నాకు సోదరుడివవుతావా ? నా కన్నవారి దగ్గరికి తీసుకుపోతావా ? 


నా తండ్రి తో చెప్పు ! నాకు ఓ   (బాగా పాలిచ్చే కామ) ధేనువు జాతి ఆవును కొనివ్వమని !  నీ అల్లుడిని సాకేందుకు నా దగ్గర ఏదీ లేదు కనీసం అతను ఆ పాలు తాగి పెద్దవాడవుతాడు. అని చెప్పు !!    స్త్రీ జనమంతా విద్యాపతి మాటలు వినండి . ఓర్పు తో వేచినవారికి మురారి (Lord Krishna)  తప్పకుండా దొరుకుతాడు. నేనేమి పాపం చేసానో గానీ నా భర్త ఒక బాలకుడు. 

***

ఇది ఒక 15 వ శతాబ్దపు స్త్రీ ల పరిస్థితి గురించి కవి చెప్పిన పదం. ఆ నాటి స్త్రీ లకు కనీస స్వతంత్రం, స్వేచ్చా లేకపోవడం, ఆర్ధిక సామాజిక వెనకబాటుతనం, ఎవరో వచ్చి ఉద్ధరిస్తే తప్ప బాగుపడని జీవితాలవడం,  నిస్సహాయత తో జీవితాన్ని గడపాల్సి రావడం గురించి మైథిలీ లో రాసిన పదం. ఈ పాట లో స్త్రీ బాలుడ్ని ఎందుకు పెళ్ళాడవలసి వస్తుందో అనిపిస్తుంది గానీ నిజానికి ఇది పెళ్ళి చేసుకోగానే పెళ్ళాం ని బానిసలా, టూత్ బ్రష్ మీద పేస్ట్ కూడా వేసిచ్చే పనిమనిషి లా చూసే భర్తత్వం గురించి చేసిన వ్యంగ్య వ్యాఖ్యానం.  


ఉత్తర భారతం లో భార్య భర్తకి తువాలందించడం, స్నానమయాక బట్టలు అందించడం, పాదాలకు చెప్పులందియటం వంటివి సాధారణంగా ఉంటాయి. భార్య కి అండగా ఉండాల్సిన భర్త ఇలా పనికిమాలిన వాడు, బద్ధకిష్టి గా ఉండటం ఆమె ప్రాణానికి ఎంత బరువో చెప్పే పాట ఇది.   

ఆమె తల్లితండ్రులు, అతనికి కట్టబెట్టి ఆమె బరువును వదిలించుకున్నారనీ తెలుస్తుంది.    కానీ ఆడపిల్లల్ని (ఏదో ఒక లా పెళ్ళి చేసి) వదిలించుకోవడం ఆనాటి సామాజిక పరిస్థితి. కట్నాలు, ఆస్తులు, లాంచనాలు వగైరా కారణాల వల్ల, ఆడపిల్లలని పుడుతూనే చంపేసే విధానాలు మామూలయిపోయిన దేశం లోది ఈ పాట. 

పెళ్ళాలు సేవికల్లా మొగుళ్ళని సాకుతూంటే, వారు పురుషాధిక్యత తో చేస్తున్న ఈ శ్రమ దోపిడీ దురాచారాలని కవులు, కధకులు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకొచ్చి, చైతన్యం తీసుకురావాలి. అప్పుడే ప్రజలలో కాస్తయినా మార్పు వస్తుంది.  అయితే ఈనాటికీ స్త్రీల పరిస్థితి పెద్దగా మారలేదు.  మంచి చదువులూ, ఉద్యోగాలూ, హొదాలూ కూడా ఆడపిల్లల ఆదాయాన్ని, బయటి సమాజం లోనూ, తమ ఇళ్ళ లోకి వాళ్ళు తీసుకొచ్చే వాల్యూ ని, తక్కువగానే చూస్తూ, ఇంకా మొగుడిని, ఇంటినీ చూసుకునే బాధ్యత ఆమెదే అని నిర్వచించడం ఇలాంటిదే. పైగా పురుషులు man child లలా తమ తమ పంతాలతో, పనికిమాలిన పటాటోపాలతో ప్రవర్తించటం వల్ల, వారు కూడా భార్యపాలిటకి ఎప్పటికీ ఎదగని పిల్లాడిలా చంకెక్కి కూర్చుని, భార్య కే గుదుబండగా మారటం గురించినది ఈ పాట.  పిల్లలతో తగినంతగా గడపలేని వర్కింగ్ వుమెన్ గిల్ట్ కూడా ఈ కండిషనింగ్ లోనిదే. 

***

https://www.facebook.com/share/r/18UXbknGk7/

Reference : https://deoshankarnavin.blogspot.com/2015/01/1.html?m=1

Mahakavi Vidyapati 

Thanks to Mrs Swathi Pantula Garu, for introducing this song.