Showing posts with label మనలో మన మాట. Show all posts
Showing posts with label మనలో మన మాట. Show all posts
02/07/2011
పెద్ద్ధ వంతెన !
అందరికీ తెలిసే వుంటుందీ బ్రిడ్జ్ ! ప్రపంచం లోనే పొడవైన వంతెన ఇది. అదీ సముద్రంపై కట్టేరు. అంతా బానే వుంది గానీ మొత్తం నాలుగేళ్ళలో కట్టేసేరంట. నాకిక్కడ కొన్ని డౌట్లు.
1) చైనా లో కావడం వల్ల దీన్ని నాలుగేళ్ళలోనే నిర్మించారా ?
2) సముద్రం లో కావడం వల్ల అటూ ఇటూ స్థలం ఖాళీ చెయ్యించడం, కూల్చిన దుకాణాలకి డబ్బు ఇవ్వడం, కొన్ని ప్రాంతాల వాళ్ళుఒప్పుకోకపోవడాలూ లాంటివి లేకపోవడం వల్ల తక్కువ టైం లో నిర్మించగలిగారా ?
3) ఏదైనా దివ్య శక్తి చైనా కి సాయం చేస్తోందా ? అలాంటి శక్తి ని మన ఎన్ టీ ఆరూ, అల్లూ లు మందేశానికి తీసుకురావొచ్చుగా.
07/04/2011
The Nonsense i.e., అవినీతి!!
వాటీస్ దిస్ నాన్సెన్స్ ! అందరికీ సడన్ గా ఏమొచ్చింది ? ఎవర్ని చూస్తే వాళ్ళే అవినీతి పై పోరాటం చేసేస్తున్నారు. ఇదో పెద్ద ఫాషన్ అయిపోయింది ! అవినీతి అంటే ఏమిటి ? 'అవినీతి' అన్న మాటలోనే 'నీతి' వుంది. ఇంత కన్నా నీతి ఎక్కడ దొరుకుతుంది ? బాబా రాందేవ్ అడావుడి గా అవినీతి పై వాగ్బాణాలు సంధించేస్తుంటే - కాషాయ వస్త్రాలని ప్రిఫరబుల్ క్వాలిఫికేషన్ గా పరిగణించే భా.జ.పా కూడా ఝడుసుకుంటూంది. అన్నా హజారే కి సడన్ గా ఏమొచ్చింది ? జంతర్ మంతర్ కాడికి రోజూ ఎంత మంది ఫారినర్స్ వస్తారు ? ఇదంతా చూసి ఏమనుకోవాలి ? జనం తామర తంపెర లా వస్తున్నారంట. ఎంత ట్రాఫిక్ జాం ? ఎంత ఇబ్బంది ?
ఎంత వరకూ సక్సస్ అవుతుందో ఈ కొత్త పోరాటం ? ఎవరో స్విస్ బాంకు లో డబ్బుల్దాచేరంట - అవన్నీ ఇండియా తీసుకు రావాలంట. కొంచెం అయినా సెన్స్ ఉందా ? మన సిస్టం అలాంటిది. ఆ తెచ్చిన డబ్బంతా ప్రజా సంక్షేమం కోసం ఖర్చు పెడుతుండగా, మరింత సొమ్ము ఉత్పత్తి అయ్యి, మళ్ళీ బ్యాంక్ బాకీలకెళిపోతుంది అని తెలుసుకోరు ! ఎందుకంత అర్ధం లేని డిమాండింగులు ? ఎవరి సొమ్ము? ఏమి సొమ్ము ? అంతా మాయ !
మన దేశంలో 'అవినీతి ఈజ్ అ వే ఆఫ్ లైఫ్'. ఆ మాత్రం అర్ధం కాపోతే ఎలా ? అవినీతి అంటే ఏంటి ? కేవలం ద్రవ్యార్జనే అవినీతా ? అలా అయితే కట్నం తీసుకోవడం అవినీతే ! మరి మన ఆస్థి కి కేవలం తాళి కట్టినందుకంచెప్పి ఒక పిల్లొచ్చి ఊరికే వారసురాలు అయిపోవట్లా ?! ఈ సంపాదనాస్థి లో కొంచెం అన్నా పెట్టుబడి ఆ పిల్ల పెట్టొద్దూ ? అది అవినీతెలా అయింది ? రాందేవ్ బాబా కి బుర్ర లేదు ! ముక్కు మూస్కొని ప్రాణాయామం చేస్కోకుండా, ద్రవ్యార్జన అంటూ రాజకీయాల్లోకి వస్తానంటాడు. తన యోగా బిజినెస్సు బోరు కొట్టి వుండొచ్చు. అవినీతి వ్యతిరేకత ఎంత ఫేషన్ కాపోతే ఆ ధైర్యం ?
నిజంగా జనానికి చిత్త శుద్ధే ఉంటే, అందరూ పన్నులు సరిగ్గా కట్టి, (చిల్లర కొట్లో కూడా బిల్లు అడిగి), ఎక్కడా ఫార్మాలిటీస్ అన్న మాట రానీయకూడదు. ప్రభుత్వ వ్యవస్థల్లో అవినీతి చీమలు పుట్టలు పెట్టాయి సరే ! మరి ప్రైవేటు సంస్థల్లో ఈ 'ఫార్మాలిటీ' పద్దులు లేవా ఏంటీ ? లక్ష్య సాధన కోసం ఎవరి బాధ వాళ్ళు పడతారు. దానికి అవినీతి అని పేరు పెట్టడం అన్యాయం.
టీ.ఆర్.పీ కోసం వార్తా చానెళ్ళు అశ్లీల కధనాలను పదే పదే ప్రసారం చేస్తాయి. వార్తా పత్రికలు భళా భళీ అంటూ అధికార పార్టీ లకు భట్రాజీయం వెలగబెడతాయి (ప్రజల ఖర్చుతో) ! ఒక ప్రముఖ సినీ సెలెబ్రిటీ ఇంకో సినీ సెలెబ్రిటీ తో టాక్ షో నిర్వహిస్తారు. పాపులారిటీ కొసం poor things, ఏదైనా చేస్తారు. ఈ పాట్లన్నీ కోటి (కూటి) కోసమే కదా ! కోటి కి తక్కువున్నయా భూముల రేట్లు ? ఇళ్ళు ఎంత ఖరీదున్నాయి ? పిల్లల్ని రేప్పొద్దున్న, ఐ.బీ.ఎం లోనో, బిజీజిస్ స్కూల్లోనో, ఐ.ఐ.పీ.ఎం లో చేర్చాలంటే సంవత్సరానికి ఎన్ని లక్షలు కట్టాలి ? ముందు చూపు కనపర్చకపోతే, రేప్పొద్దున్న పిల్లలకు ఏమిస్తాం అన్న ఆలోచన అందర్నీ (దేశాన్ని) నడిపిస్తుంది !
రిటయిరయ్యాకా పెన్షన్ తో ఇంటద్దె కట్టడం ఎంత పెద్ద సర్కస్ ? అందుకే ఇప్పుడు ఇల్లుండాల! పిలకాయలక్కూడా ! వచ్చే యేడు బియ్యం బులియన్ ఎంతకి పెరుగుతుందో, వెచ్చాల కోసం జీతం లో ఎంత శాతం ఖర్చుపెట్టాలో ?! కూరగాయలసలు డబ్బిచ్చినా దొరుకుతయో లేదో ! అన్నిటికీ ఈ లోకం లో డబ్బు కావాలి. ఈ 20 వ శతాబ్దంలో 'ఇంకా..' డబ్బు కావాలి. మున్ముందు 'ఇంకా', 'ఇంకా' కావాలి. దానికి జనాభా అంతా సమిష్టి గా 'అవినీతి' మరియూ, 'నీతి' మార్గాల్లో రైలు పట్టాల్లా.. సమాంతర రేఖల పై ప్రయాణం చేస్తుంటే, ఒక వైపు పట్టాల్ని కూలదోస్తామంటున్న్నరు. వాటెబౌట్ ఫ్యూచర్ ? రేప్పొద్దున్న దేశం ఎలా నడుస్తుంది ? అసలు అవినీతి తగ్గాలంటే - జనాభా తగ్గాలి, రేట్లు తగ్గాలి ! ఇదంతా అయ్యే పనేనా ?
రికార్డు కుంభకోణాల్తో యూ.పీ.యే.. ఇంక దిగిపోవచ్చని పత్రికలు చెప్తున్నాయి. మరి మళ్ళీ గెలవాలంతే, ఓటర్లకు నజరానాలివ్వాలంటే, ఎలక్షన్ రోజు తాగించి, విందులు చెయ్యాలంతే, చిన్నా చితకా పేట నాయకులకు సూట్కేసులిచ్చి వోట్లు కొనాలంటే, కుల వర్గ ప్రాంత మత బేధాల పరంగా ప్రతీ వారిలోనూ అభద్రత కలిగించి, విడదీసి, మళ్ళీ అభయాలిచ్చి, వోటాట గెలవాలంటే, ఏ సర్కారు కైనా అవినీతి అవసరం. ఓటమ్ముకునే వోటరు అవినీతి వ్యతిరేక పోరాటానికి తగడు. అయితే, జన చైతన్యం మెల్లిగానూ మహోధ్రుతంగానూ రావడం - మెచ్చుకోదగ్గదే ! పోయిన సంవత్సరం ఎన్నికల్లో - ఈ 'హక్కుల ప్రచారం' వల్ల ప్రభావితం చెంది, జీవంలో మొదటి సారి, ఎండలో రొప్పుతూ, రోజుతూ, క్యూ లో నించుని ఓటు వేసినవారెందరో ! (ఓటు హక్కు వినియోగం) మరి 'అన్నా హజారే' ఇంకో హజారు బార్లు ప్రధానికి ఉత్తరం రాసినా తీరట్లేదని చెప్పి, అన్నం మాని కూర్చున్నడంట. ఇలాంటి పాపులర్ పబ్లిక్ ఫిగర్ - బాలీవుడ్ స్టైల్లో రంగంలోకి దిగితే, నాటకీయత రక్తి కట్టి - చట్టం వచ్చి, అదెప్పుడో టెర్రరిస్టు దాడి లో చచ్చిపోవాల్సిన పార్లమెంటేరియన్లందరూ - తీహారు జైల్లో సర్దుకుంటారని 'భావి భారతం' ఆశిస్తోంది. ఇదేమైనా వాల్డ్ కప్పా - అత్భుతాలు జరిగిపోవడానికి ? దేశం పరువుని (అంటూ ఒకటుంటే) బయటికీడ్చడం తప్ప ! మన లో రిచ్ పీపుల్ పెరుగుతున్నారు. వాళ్ళు ఏటికేటికీ మరీ రిచ్ అవుతూ వస్తున్నారు. అవేవో జాబితాలకెక్కుతున్నారు ! దేశానికీ పేరు తెస్తున్నారు. మరి పూర్ పీపుల్ ఏటికేటికీ మరింత పూర్ అవుతున్నరంటారు. గ్లాసు లో సగం నీళ్ళు పోసి 'గ్లాస్ ఈజ్ హాఫ్ ఫుల్' అనడం ఎపుడు నేర్చుకుంటారో !
BTW .. If u still feel that its 'ok' to support Anna Hazaare, click here. :D Go ahead.
ఎంత వరకూ సక్సస్ అవుతుందో ఈ కొత్త పోరాటం ? ఎవరో స్విస్ బాంకు లో డబ్బుల్దాచేరంట - అవన్నీ ఇండియా తీసుకు రావాలంట. కొంచెం అయినా సెన్స్ ఉందా ? మన సిస్టం అలాంటిది. ఆ తెచ్చిన డబ్బంతా ప్రజా సంక్షేమం కోసం ఖర్చు పెడుతుండగా, మరింత సొమ్ము ఉత్పత్తి అయ్యి, మళ్ళీ బ్యాంక్ బాకీలకెళిపోతుంది అని తెలుసుకోరు ! ఎందుకంత అర్ధం లేని డిమాండింగులు ? ఎవరి సొమ్ము? ఏమి సొమ్ము ? అంతా మాయ !
మన దేశంలో 'అవినీతి ఈజ్ అ వే ఆఫ్ లైఫ్'. ఆ మాత్రం అర్ధం కాపోతే ఎలా ? అవినీతి అంటే ఏంటి ? కేవలం ద్రవ్యార్జనే అవినీతా ? అలా అయితే కట్నం తీసుకోవడం అవినీతే ! మరి మన ఆస్థి కి కేవలం తాళి కట్టినందుకంచెప్పి ఒక పిల్లొచ్చి ఊరికే వారసురాలు అయిపోవట్లా ?! ఈ సంపాదనాస్థి లో కొంచెం అన్నా పెట్టుబడి ఆ పిల్ల పెట్టొద్దూ ? అది అవినీతెలా అయింది ? రాందేవ్ బాబా కి బుర్ర లేదు ! ముక్కు మూస్కొని ప్రాణాయామం చేస్కోకుండా, ద్రవ్యార్జన అంటూ రాజకీయాల్లోకి వస్తానంటాడు. తన యోగా బిజినెస్సు బోరు కొట్టి వుండొచ్చు. అవినీతి వ్యతిరేకత ఎంత ఫేషన్ కాపోతే ఆ ధైర్యం ?
నిజంగా జనానికి చిత్త శుద్ధే ఉంటే, అందరూ పన్నులు సరిగ్గా కట్టి, (చిల్లర కొట్లో కూడా బిల్లు అడిగి), ఎక్కడా ఫార్మాలిటీస్ అన్న మాట రానీయకూడదు. ప్రభుత్వ వ్యవస్థల్లో అవినీతి చీమలు పుట్టలు పెట్టాయి సరే ! మరి ప్రైవేటు సంస్థల్లో ఈ 'ఫార్మాలిటీ' పద్దులు లేవా ఏంటీ ? లక్ష్య సాధన కోసం ఎవరి బాధ వాళ్ళు పడతారు. దానికి అవినీతి అని పేరు పెట్టడం అన్యాయం.
టీ.ఆర్.పీ కోసం వార్తా చానెళ్ళు అశ్లీల కధనాలను పదే పదే ప్రసారం చేస్తాయి. వార్తా పత్రికలు భళా భళీ అంటూ అధికార పార్టీ లకు భట్రాజీయం వెలగబెడతాయి (ప్రజల ఖర్చుతో) ! ఒక ప్రముఖ సినీ సెలెబ్రిటీ ఇంకో సినీ సెలెబ్రిటీ తో టాక్ షో నిర్వహిస్తారు. పాపులారిటీ కొసం poor things, ఏదైనా చేస్తారు. ఈ పాట్లన్నీ కోటి (కూటి) కోసమే కదా ! కోటి కి తక్కువున్నయా భూముల రేట్లు ? ఇళ్ళు ఎంత ఖరీదున్నాయి ? పిల్లల్ని రేప్పొద్దున్న, ఐ.బీ.ఎం లోనో, బిజీజిస్ స్కూల్లోనో, ఐ.ఐ.పీ.ఎం లో చేర్చాలంటే సంవత్సరానికి ఎన్ని లక్షలు కట్టాలి ? ముందు చూపు కనపర్చకపోతే, రేప్పొద్దున్న పిల్లలకు ఏమిస్తాం అన్న ఆలోచన అందర్నీ (దేశాన్ని) నడిపిస్తుంది !
రిటయిరయ్యాకా పెన్షన్ తో ఇంటద్దె కట్టడం ఎంత పెద్ద సర్కస్ ? అందుకే ఇప్పుడు ఇల్లుండాల! పిలకాయలక్కూడా ! వచ్చే యేడు బియ్యం బులియన్ ఎంతకి పెరుగుతుందో, వెచ్చాల కోసం జీతం లో ఎంత శాతం ఖర్చుపెట్టాలో ?! కూరగాయలసలు డబ్బిచ్చినా దొరుకుతయో లేదో ! అన్నిటికీ ఈ లోకం లో డబ్బు కావాలి. ఈ 20 వ శతాబ్దంలో 'ఇంకా..' డబ్బు కావాలి. మున్ముందు 'ఇంకా', 'ఇంకా' కావాలి. దానికి జనాభా అంతా సమిష్టి గా 'అవినీతి' మరియూ, 'నీతి' మార్గాల్లో రైలు పట్టాల్లా.. సమాంతర రేఖల పై ప్రయాణం చేస్తుంటే, ఒక వైపు పట్టాల్ని కూలదోస్తామంటున్న్నరు. వాటెబౌట్ ఫ్యూచర్ ? రేప్పొద్దున్న దేశం ఎలా నడుస్తుంది ? అసలు అవినీతి తగ్గాలంటే - జనాభా తగ్గాలి, రేట్లు తగ్గాలి ! ఇదంతా అయ్యే పనేనా ?
రికార్డు కుంభకోణాల్తో యూ.పీ.యే.. ఇంక దిగిపోవచ్చని పత్రికలు చెప్తున్నాయి. మరి మళ్ళీ గెలవాలంతే, ఓటర్లకు నజరానాలివ్వాలంటే, ఎలక్షన్ రోజు తాగించి, విందులు చెయ్యాలంతే, చిన్నా చితకా పేట నాయకులకు సూట్కేసులిచ్చి వోట్లు కొనాలంటే, కుల వర్గ ప్రాంత మత బేధాల పరంగా ప్రతీ వారిలోనూ అభద్రత కలిగించి, విడదీసి, మళ్ళీ అభయాలిచ్చి, వోటాట గెలవాలంటే, ఏ సర్కారు కైనా అవినీతి అవసరం. ఓటమ్ముకునే వోటరు అవినీతి వ్యతిరేక పోరాటానికి తగడు. అయితే, జన చైతన్యం మెల్లిగానూ మహోధ్రుతంగానూ రావడం - మెచ్చుకోదగ్గదే ! పోయిన సంవత్సరం ఎన్నికల్లో - ఈ 'హక్కుల ప్రచారం' వల్ల ప్రభావితం చెంది, జీవంలో మొదటి సారి, ఎండలో రొప్పుతూ, రోజుతూ, క్యూ లో నించుని ఓటు వేసినవారెందరో ! (ఓటు హక్కు వినియోగం) మరి 'అన్నా హజారే' ఇంకో హజారు బార్లు ప్రధానికి ఉత్తరం రాసినా తీరట్లేదని చెప్పి, అన్నం మాని కూర్చున్నడంట. ఇలాంటి పాపులర్ పబ్లిక్ ఫిగర్ - బాలీవుడ్ స్టైల్లో రంగంలోకి దిగితే, నాటకీయత రక్తి కట్టి - చట్టం వచ్చి, అదెప్పుడో టెర్రరిస్టు దాడి లో చచ్చిపోవాల్సిన పార్లమెంటేరియన్లందరూ - తీహారు జైల్లో సర్దుకుంటారని 'భావి భారతం' ఆశిస్తోంది. ఇదేమైనా వాల్డ్ కప్పా - అత్భుతాలు జరిగిపోవడానికి ? దేశం పరువుని (అంటూ ఒకటుంటే) బయటికీడ్చడం తప్ప ! మన లో రిచ్ పీపుల్ పెరుగుతున్నారు. వాళ్ళు ఏటికేటికీ మరీ రిచ్ అవుతూ వస్తున్నారు. అవేవో జాబితాలకెక్కుతున్నారు ! దేశానికీ పేరు తెస్తున్నారు. మరి పూర్ పీపుల్ ఏటికేటికీ మరింత పూర్ అవుతున్నరంటారు. గ్లాసు లో సగం నీళ్ళు పోసి 'గ్లాస్ ఈజ్ హాఫ్ ఫుల్' అనడం ఎపుడు నేర్చుకుంటారో !
BTW .. If u still feel that its 'ok' to support Anna Hazaare, click here. :D Go ahead.
31/03/2011
సింపుల్ కబుర్లు
చాలా రోజులయింది బ్లాగు దుమ్ము దులిపి. నిన్న ఇండియా గెలిచాకా ఏదో రాసాను. పోస్ట్ చెయ్యకముందే నిద్రపోవాల్సొచ్చింది. ఈ రోజు మేలుకుని ఉండి బ్లాగులు చదివి, నన్ను నేను ఉత్తేజపరచుకుని, ఏదో ఒకటి రాయాలని నిర్ణయించుకున్నాను. తొందరపడి ఏదో ఒకటి రాసేయకుండా, ఆలోచించుకుని, ఏమి రాస్తే బావుంటుందా అని ఆలోచించుకునే లోగా బోల్డన్ని అవాంతరాలు రావడం వల్ల, చాల్రోజులుగా రాయలేకపోయాను. దీనివల్ల ప్రజలంతా సుఖ సంతోషాలతో హేపీ గా వుండటం అస్సలు బాలేదు. అందుకే చేతికొచ్చింది (గుర్తొచ్చినట్టు) రాస్తాను.
ఇంతకీ మొన్నో రోజు హీరో మా ఇంట్లో ఎర్థ్ అవర్ అని ఒకటి జరిపారు. ఆ మర్నాడు హైద్ లో చాలా మందీ, ఢిలీ లో, ఇంకా మిగతా దేశం లో - చాలా మంది ఈ దీపాలార్పు గంట ని పాటించారని తెలిసింది. ఇంతకీ మా ఇంటి గంట లో, టైముకి వంటింట్లో తప్పా, అన్ని గదుల్లోనూ దీపాలార్పబడ్డాయి. పిల్లకి బువ్వెట్టాలి - ఇది ఏం టైం ? అన్నా కూడా వినకుండా ! టీవీ మూసేసి, రేడియో తియ్యడమూ, బుల్లెమ్మ ట్యూనర్ని చీల్చి చెండాడుతూండడం వల్ల - ఒక పాట, ఒక మాటా వినిపించి దాన్ని కూడా ఆర్పడం జరిగింది. కొంచెం సేపటికి అందరికీ అదే టైంకి ఏదో కావాల్సి రావడం, లైట్లు వెయ్యడం, ఉక్క పోసి ఫాన్లు వెయ్యడం, దోమల భయానికి ఆల్ ఔట్ వెయ్యడం జరిగాయి. ఇంతా చేసి ఇంటి గుమ్మాన పెద్ద ట్యూబు వెలుగుతూనే వుంది. ఆపీ వేసీ - లైట్లకి విసుగొచ్చింది. మొత్తానికి ఎర్త్ అవర్ మా ఇంట్లో ఫ్లాప్ అయింది. శ్రీజ కి ఫన్నీ గా అనిపించి ఉండాలి.
ఆ సంబడం గడిచాకా.. ఈ మధ్యే పారడైస్ సెంటర్లో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రకటన నన్ను ఆకర్షించింది. ఒబేసిటీ కి శాశ్వత పరిష్కారంట ! మా ఇంటి కాడ ఫుల్లు దా ట్రాఫిక్కు జోన్ లో పెట్టిన ఇంకో సూపర్ స్పెషాల్టీ కూడా అదే అంటూంది. ట్రాఫిక్ అక్కడ అతుక్కుపోయి మన బండి ఖచ్చితంగా ఇరుక్కునే చోట ఫాట్ ని తగ్గిస్తాం అంటూ ఆకర్షణీయమైన ప్రకటన. ఎన్ని లక్షలు కక్కమంటారో గానీ మైకం లాంటిదీ కొంచెం మోహం లాంటివీ కలిగిస్తున్నాయి ఈ ప్రకటనలు. ఎప్పుడైనా - ఒక వేళ - అలా అయితే - కాష్ - అంటూ నిట్టూర్పులు వినిపిస్తున్నాయి ! సక్సస్ కి షార్ట్ కట్టులు లేవు. హార్డ్ వర్క్ కి ఆల్టర్నేటివ్ లు లేవు. ఇవన్నీ తెలుసు - కానీ, ఆరోగ్య వ్యాపారం లో ఇదో కొత్త ట్రెండ్ ! నిజంగా సొల్యూషన్ దొరుకుతుందా ? అని రెపరెపలాడే ఆశ ! చూడాలి !
ఈ మధ్య బ్లాగరు వాడు నోటు పెట్టి చూడమన్న బ్లాగులు చూస్తూండడం వల్ల భలే ఫన్నీ ఫోటో బ్లాగులు నన్ను ఆకర్షించాయి. నన్ను చాలా విషయాలు ఆకర్షిస్తూ వుంటాయి. నేను అయస్కాంతం. వాటిల్లో ఫన్నీ సైన్స్ (నవ్వించే సైన్ బోర్డులు) కొన్ని. వీట్లో డైరెక్షన్ చూపించే బోర్డులు మరీ నవ్వించేవి గా ఉన్నాయి. నేను హైద్ వచ్చిన కొత్తలో నగర పాలక సంస్థ వారి పబ్లిక్ టాయిలెట్లు (కాదు) ఎక్కడున్నాయో చూపించే సైన్ బోర్డులు ఆకర్షించేవి. చిన్న బోర్డు మీద 'Toilets - 10 mins away' అని చూసి భలే నవ్వొచేది. అంత దాకా ఓపిక పట్టండి అని ఆ బోర్డులు బ్రతిమలాడుతున్నట్టుంటాయి. ఇప్పటికీ ఉన్నాయి.
వచ్చే సంవత్సరం (తెలుగూ న్యూ ఇయర్) లో నా ఫేట్ అస్సలు బాలేదు. రాజపూజ్యం 'నిల్', అవమాణం 'జాస్తీ' గా ఉండబోతుందంట. పోన్లే - నాకలవాటే గా అనుకున్నానా - డబ్బుల్స్ కూడా నిల్లేనంట. ఇక్కడే ఐ హర్ట్ ! కానీ ఈ కఠోర నిజాన్ని ఇంకో కంపెనీ పంచాంగంలో క్రాస్ వెరిఫై చేసుకోవాలి. మా హీరోదీ నాదీ ఒకటే రాశి కాబట్టి ఏది అఘోరించినా ఇద్దరికీ ఖర్మ ఒకలానే కాల్తుంది. ఇక్కడా ఐయాం హర్ట్. ఇద్దరిదీ వేరే వేరే రాశి అయితే,ఇలాంటి క్లిష్ఠ సమయాల్లో ఇద్దరి ఖర్మా బాలన్స్ అవుతుంది కదా ! ఆ సౌకర్యం లేదు మాకు. చూడాలి ! మరీ విసుగేసి - జాతకం ప్రిడిక్షను ఈ సంవత్సరానికి మాకు కన్వీనియెంటు గా లేప్పోతే ఇంక వెధవ ప్రిడిక్షన్ లని నమ్మకూడదంతే !
అన్నమయ్య జయంతి - 'శ్రీనివాసం' లో ఏదో ఒకటి చేసి సెలెబ్రేట్ చేసుకుందామనుకున్నాను. కుదర్లేదు. అందరి Birthays లాగే, అన్ని సార్ల లాగానే గుర్తుంచుకోవాల్సింది మర్చిపోయాను. వయసు తో పాటూ మతిమరుపూ పెరిగిపోతుంది. ఈ మధ్య చాలా విషయాలు మర్చిపోతున్నాను. నా సిగ్నేచర్ ఏంటంటే - చిన్నప్పట్నించీ, నా పుట్టిన్రోజూ, మా చెల్లెలి పుట్టిన్రోజూ తప్ప (తను మర్చిపోనివ్వదు, పైగా సంక్రాంతి రోజు పుట్టింది) ఇంకెవ్వరి పుట్టిన్రోజూ గుర్తుండదు. ఇప్పుడు నా కడుపున పుట్టింది గనుక శ్రీజది గుర్తుంటుంది. పెళ్ళి రోజులయితే ఇంక చెప్పక్కర్లేదు. నా పెళ్ళి రోజు కూడా లైట్ గానే తీసుకుంటున్నా. ఆ రోజు ఎవరైనా విష్ చేసినా, మొహమాటంగానే వుంటుంది. ఇది ఎందుకిలా అవుతుందో తెలీదు. నా లో బిగ్గెస్ట్ మైనస్ ఇదే ! అయితే మతిమరుపు నన్ను మింగేయకుండా చూసుకోవాలని, ఒక నోట్ బుక్ లో అన్నీ రాసుకోవడం మొదలుపెట్టాను.
ఇంక చాలు ఈ కబుర్లు. నాకు కొంచెం హాపీ గా వుంది. ఇంటి నుంచీ పచ్చళ్ళు వచ్చాయి. ఆకుపచ్చ పుచ్చకాయలు కూడా అక్కడక్కడా దొరుకుతున్నాయి. సమ్మర్ ని అనుభవించడం మొదలు పెట్టాను. మంచం పక్కనే కిటికీ లోంచీ, ఆకాశం, చుక్కలూ, మబ్బులూ, చంద్రుడూ, నాకు గార్డ్ ఆఫ్ ఆనర్ ఇస్తున్నారో ! ఇంక నిద్రపోతా !
ఇంతకీ మొన్నో రోజు హీరో మా ఇంట్లో ఎర్థ్ అవర్ అని ఒకటి జరిపారు. ఆ మర్నాడు హైద్ లో చాలా మందీ, ఢిలీ లో, ఇంకా మిగతా దేశం లో - చాలా మంది ఈ దీపాలార్పు గంట ని పాటించారని తెలిసింది. ఇంతకీ మా ఇంటి గంట లో, టైముకి వంటింట్లో తప్పా, అన్ని గదుల్లోనూ దీపాలార్పబడ్డాయి. పిల్లకి బువ్వెట్టాలి - ఇది ఏం టైం ? అన్నా కూడా వినకుండా ! టీవీ మూసేసి, రేడియో తియ్యడమూ, బుల్లెమ్మ ట్యూనర్ని చీల్చి చెండాడుతూండడం వల్ల - ఒక పాట, ఒక మాటా వినిపించి దాన్ని కూడా ఆర్పడం జరిగింది. కొంచెం సేపటికి అందరికీ అదే టైంకి ఏదో కావాల్సి రావడం, లైట్లు వెయ్యడం, ఉక్క పోసి ఫాన్లు వెయ్యడం, దోమల భయానికి ఆల్ ఔట్ వెయ్యడం జరిగాయి. ఇంతా చేసి ఇంటి గుమ్మాన పెద్ద ట్యూబు వెలుగుతూనే వుంది. ఆపీ వేసీ - లైట్లకి విసుగొచ్చింది. మొత్తానికి ఎర్త్ అవర్ మా ఇంట్లో ఫ్లాప్ అయింది. శ్రీజ కి ఫన్నీ గా అనిపించి ఉండాలి.
ఆ సంబడం గడిచాకా.. ఈ మధ్యే పారడైస్ సెంటర్లో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రకటన నన్ను ఆకర్షించింది. ఒబేసిటీ కి శాశ్వత పరిష్కారంట ! మా ఇంటి కాడ ఫుల్లు దా ట్రాఫిక్కు జోన్ లో పెట్టిన ఇంకో సూపర్ స్పెషాల్టీ కూడా అదే అంటూంది. ట్రాఫిక్ అక్కడ అతుక్కుపోయి మన బండి ఖచ్చితంగా ఇరుక్కునే చోట ఫాట్ ని తగ్గిస్తాం అంటూ ఆకర్షణీయమైన ప్రకటన. ఎన్ని లక్షలు కక్కమంటారో గానీ మైకం లాంటిదీ కొంచెం మోహం లాంటివీ కలిగిస్తున్నాయి ఈ ప్రకటనలు. ఎప్పుడైనా - ఒక వేళ - అలా అయితే - కాష్ - అంటూ నిట్టూర్పులు వినిపిస్తున్నాయి ! సక్సస్ కి షార్ట్ కట్టులు లేవు. హార్డ్ వర్క్ కి ఆల్టర్నేటివ్ లు లేవు. ఇవన్నీ తెలుసు - కానీ, ఆరోగ్య వ్యాపారం లో ఇదో కొత్త ట్రెండ్ ! నిజంగా సొల్యూషన్ దొరుకుతుందా ? అని రెపరెపలాడే ఆశ ! చూడాలి !
ఈ మధ్య బ్లాగరు వాడు నోటు పెట్టి చూడమన్న బ్లాగులు చూస్తూండడం వల్ల భలే ఫన్నీ ఫోటో బ్లాగులు నన్ను ఆకర్షించాయి. నన్ను చాలా విషయాలు ఆకర్షిస్తూ వుంటాయి. నేను అయస్కాంతం. వాటిల్లో ఫన్నీ సైన్స్ (నవ్వించే సైన్ బోర్డులు) కొన్ని. వీట్లో డైరెక్షన్ చూపించే బోర్డులు మరీ నవ్వించేవి గా ఉన్నాయి. నేను హైద్ వచ్చిన కొత్తలో నగర పాలక సంస్థ వారి పబ్లిక్ టాయిలెట్లు (కాదు) ఎక్కడున్నాయో చూపించే సైన్ బోర్డులు ఆకర్షించేవి. చిన్న బోర్డు మీద 'Toilets - 10 mins away' అని చూసి భలే నవ్వొచేది. అంత దాకా ఓపిక పట్టండి అని ఆ బోర్డులు బ్రతిమలాడుతున్నట్టుంటాయి. ఇప్పటికీ ఉన్నాయి.
వచ్చే సంవత్సరం (తెలుగూ న్యూ ఇయర్) లో నా ఫేట్ అస్సలు బాలేదు. రాజపూజ్యం 'నిల్', అవమాణం 'జాస్తీ' గా ఉండబోతుందంట. పోన్లే - నాకలవాటే గా అనుకున్నానా - డబ్బుల్స్ కూడా నిల్లేనంట. ఇక్కడే ఐ హర్ట్ ! కానీ ఈ కఠోర నిజాన్ని ఇంకో కంపెనీ పంచాంగంలో క్రాస్ వెరిఫై చేసుకోవాలి. మా హీరోదీ నాదీ ఒకటే రాశి కాబట్టి ఏది అఘోరించినా ఇద్దరికీ ఖర్మ ఒకలానే కాల్తుంది. ఇక్కడా ఐయాం హర్ట్. ఇద్దరిదీ వేరే వేరే రాశి అయితే,ఇలాంటి క్లిష్ఠ సమయాల్లో ఇద్దరి ఖర్మా బాలన్స్ అవుతుంది కదా ! ఆ సౌకర్యం లేదు మాకు. చూడాలి ! మరీ విసుగేసి - జాతకం ప్రిడిక్షను ఈ సంవత్సరానికి మాకు కన్వీనియెంటు గా లేప్పోతే ఇంక వెధవ ప్రిడిక్షన్ లని నమ్మకూడదంతే !
అన్నమయ్య జయంతి - 'శ్రీనివాసం' లో ఏదో ఒకటి చేసి సెలెబ్రేట్ చేసుకుందామనుకున్నాను. కుదర్లేదు. అందరి Birthays లాగే, అన్ని సార్ల లాగానే గుర్తుంచుకోవాల్సింది మర్చిపోయాను. వయసు తో పాటూ మతిమరుపూ పెరిగిపోతుంది. ఈ మధ్య చాలా విషయాలు మర్చిపోతున్నాను. నా సిగ్నేచర్ ఏంటంటే - చిన్నప్పట్నించీ, నా పుట్టిన్రోజూ, మా చెల్లెలి పుట్టిన్రోజూ తప్ప (తను మర్చిపోనివ్వదు, పైగా సంక్రాంతి రోజు పుట్టింది) ఇంకెవ్వరి పుట్టిన్రోజూ గుర్తుండదు. ఇప్పుడు నా కడుపున పుట్టింది గనుక శ్రీజది గుర్తుంటుంది. పెళ్ళి రోజులయితే ఇంక చెప్పక్కర్లేదు. నా పెళ్ళి రోజు కూడా లైట్ గానే తీసుకుంటున్నా. ఆ రోజు ఎవరైనా విష్ చేసినా, మొహమాటంగానే వుంటుంది. ఇది ఎందుకిలా అవుతుందో తెలీదు. నా లో బిగ్గెస్ట్ మైనస్ ఇదే ! అయితే మతిమరుపు నన్ను మింగేయకుండా చూసుకోవాలని, ఒక నోట్ బుక్ లో అన్నీ రాసుకోవడం మొదలుపెట్టాను.
ఇంక చాలు ఈ కబుర్లు. నాకు కొంచెం హాపీ గా వుంది. ఇంటి నుంచీ పచ్చళ్ళు వచ్చాయి. ఆకుపచ్చ పుచ్చకాయలు కూడా అక్కడక్కడా దొరుకుతున్నాయి. సమ్మర్ ని అనుభవించడం మొదలు పెట్టాను. మంచం పక్కనే కిటికీ లోంచీ, ఆకాశం, చుక్కలూ, మబ్బులూ, చంద్రుడూ, నాకు గార్డ్ ఆఫ్ ఆనర్ ఇస్తున్నారో ! ఇంక నిద్రపోతా !
26/07/2010
జ్ఞాపకాల గజిబిజి
1) మార్క్ ట్వైన్ రాసిన 'ప్రిన్స్ ఎండ్ ద పాపర్' - అయితే ఇంగ్లీషు ఒరిజినల్ గానీ లేదా మన నండూరి వారి 'రాజు - పేద' అనే తెలుగు అనువాదం గానీ చాలా మంది పెద్ద పిల్లకాయల దగ్గర వుండొచ్చు. ఇదే సబ్జెక్టుతో అప్పుడెప్పుడో, మా టీవీ లో ఒక సినిమా చూసాను. బహుశా ఆ సినిమా పేరు కూడా రాజు-పేద నే అనుకుంటాను. ఇందులో బీద అబ్బాయి (టాం కాంటీ) తండ్రి (జాన్ కాంటీ) పాత్ర లో నూనుగు మీసాల 'ఎన్ టీ ఆర్' నటించారు. 'ఎన్ టీ ఆర్' ని ఇలా నెగటివ్ పాత్ర లో చూసి ఆశ్చర్య పోయానపుడు. బహుశా ఆయన కెరీర్ మొదట్లో చేసిన సినిమా అయి ఉండొచ్చు. దురదృష్టవశాత్తూ ఆ రోజు కేబుల్ వాళ్ళకు పోయిందో, మాకు పోయిందో గానీ కరెంటు పోయి సినిమా చూడ్డం జరగలేదు. ఆ సినిమా ఏమిటి ? మళ్ళీ చూడాలంటే ఎలా ? ఆ సినిమా మళ్ళా ఎప్పుడూ టీ.వీ.లో ప్రసారం అయినట్టు లేదు. ఏమి సాధనం ?
2) మంగళంపల్లి బాలమురళీ కృష్ణ, శ్రీమతి వేదవతీ ప్రభాకర్, శ్రీమతి చాయాదేవి పాడిన ఒక మాంచ్హి భజన వుంది. టీ.టీ.డీ వాళ్ళు ఎప్పుడో నా చిన్నప్పుడు విడుదల చేసిన, పేరు మర్చిపోయిన ఒకానొక కేసెట్లో మా ఇంట్లో ఉండేది. ఆ కేసెట్టు అరగ్గొట్టాకా, టేపు పాడయ్యి, మిగతా కేసెట్ల సంత లో కలిసిపోయాకా, మళ్ళా ఆ భజన దొరకనేలేదంటే నమ్మండి.
ఆ భజన మొదటి లైన్లు
''కమలా వల్లభ - గోవింద మాంపాహి
కళ్యాణ కృష్ణా - గోవిందా
యశోదబాలా - గోవింద మాంపాహి
కళ్యాణ కృష్ణా - గోవిందా
భక్త మనోహర - గోవింద మాంపాహి
కళ్యాణ కృష్ణా - గోవిందా ''
ఇలా మూడు చరణాల లాంటివి - ఇంటర్నెట్టు వచ్చాకా వెతుకుతూనే వున్నాను. ఎక్కడో ఏ మహానుభావులో దాచి ఉంచి వుంటారుగా అని ! నా బావి పరిధుల్లో ఈ పని కాలేదు. ఎప్పటికైనా ఈ భజనను ఎలా అయినా సంపాదించి వినాలని చాలా ఆశ పడుతున్నాను.
అందుకే నా humble request ఏంటంటే : పై రెండు ప్రశ్నలకీ సమాధానం తెలిసిన స్నేహితులు దయచేసి నన్ను గైడ్ చెయ్యగలరు !
2) మంగళంపల్లి బాలమురళీ కృష్ణ, శ్రీమతి వేదవతీ ప్రభాకర్, శ్రీమతి చాయాదేవి పాడిన ఒక మాంచ్హి భజన వుంది. టీ.టీ.డీ వాళ్ళు ఎప్పుడో నా చిన్నప్పుడు విడుదల చేసిన, పేరు మర్చిపోయిన ఒకానొక కేసెట్లో మా ఇంట్లో ఉండేది. ఆ కేసెట్టు అరగ్గొట్టాకా, టేపు పాడయ్యి, మిగతా కేసెట్ల సంత లో కలిసిపోయాకా, మళ్ళా ఆ భజన దొరకనేలేదంటే నమ్మండి.
ఆ భజన మొదటి లైన్లు
''కమలా వల్లభ - గోవింద మాంపాహి
కళ్యాణ కృష్ణా - గోవిందా
యశోదబాలా - గోవింద మాంపాహి
కళ్యాణ కృష్ణా - గోవిందా
భక్త మనోహర - గోవింద మాంపాహి
కళ్యాణ కృష్ణా - గోవిందా ''
ఇలా మూడు చరణాల లాంటివి - ఇంటర్నెట్టు వచ్చాకా వెతుకుతూనే వున్నాను. ఎక్కడో ఏ మహానుభావులో దాచి ఉంచి వుంటారుగా అని ! నా బావి పరిధుల్లో ఈ పని కాలేదు. ఎప్పటికైనా ఈ భజనను ఎలా అయినా సంపాదించి వినాలని చాలా ఆశ పడుతున్నాను.
అందుకే నా humble request ఏంటంటే : పై రెండు ప్రశ్నలకీ సమాధానం తెలిసిన స్నేహితులు దయచేసి నన్ను గైడ్ చెయ్యగలరు !
02/03/2010
డియర్ చీఫ్ జస్టిస్
మన ఇంత పెద్ద భారద్దేశం లో, ధర్మం ఒకప్పుడు నాలుగుపాదాలా నడిచేదంట. ఇపుడు కాలం మారింది. కలి మహిమ ! ఎంత ప్రజారాజ్యమైనా జనం ప్రభువుల పదఘట్టనల మధ్య చిత్తుకాయితాల్లా నలుగుతున్నారు. పుర్రెకో బుద్ధి అన్నట్టు, ప్రస్తుతం మనకో న్యాయం, ఊరందరికీ ఇంకో న్యాయం అమల్లోకి తెచ్చేం.
పుణ్యక్షేత్రాల్లో తీర్ధ ప్రజ, మామూలు గుళ్ళలో కూడా తొక్కిడి, టెలివిజన్లో భక్తి - బాబాలూ, అమ్మలూ - ఇవన్నీ చూసి, మాలతీ చందూర్ ని ఎవరో అడిగారు ; ప్రజల్లో దైవభక్తి ఇంతగా ఎందుకు పెరిగిందీ ? అని. ఆవిడ నిష్కర్షగా చెప్పింది - ప్రజల్లో పెరిగింది భక్తి కాదు - పాప భీతి అని. పాపభీతి సంగతేమో గాని, నేరాలు వివిధ క్షేత్రాల్లో, పరిధుల్లో - ఆయా రేట్లలో పెరుగుతూనే ఉన్నాయి.
మనకో న్యాయ వ్యవస్థ ఏడిచింది గానీ మొదట్నుంచీ ప్రజలకి కోర్టులంటేనే ఏవో పడని పాట్లు గుర్తొస్తాయి. కోర్టులో కేసులు తరతరాలుగా పేరుకు పోవడం, న్యాయం దొరకడం ఆలీశెం అయిపోవడం వల్లనా కోర్టు - గాడిదా సామెతలు పుట్టాయి. తడిసి మోపెడయ్యే వ్యాజ్య ఖర్చులు తలుచుకుని, కేసు గెలిచినవాడు ఇంటికెళ్ళి, గెలవని వాడు కోర్టు బయటా ఏడుస్తారని జోకులు పుట్టాయి.
ఇలా న్యాయం దుర్భరమైపోతే ప్రజలకి దొరికేది, మిగిలేది - అన్యాయమే. కానీ అన్యాయాన్ని ఎదిరించే దమ్మున్న, నిబద్ధత ఉన్న మనిషొకడు నిర్ణయాత్మక, క్రియాశీలక పదవి లో ఉంటే ? రాజకీయాలకు అతీతంగా, అదరక బెదరక - అవినీతితో కుళ్ళిన న్యాయ వ్యవస్థ కి వన్నెను తీసుకొచ్చిన జడ్జి ఒకరు ఉంటే ?
సరిగ్గా ఇలాంటి లక్షణాలున్న నిజంగానే గౌరవనీయులైన ప్రధాన న్యాయ మూర్తి అజయ్ ప్రకాష్, గత అక్టోబర్ లో పదవీ విరమణ చేశారు. పత్రికలలో ఆయన మీద కురిసిన ప్రశంసలు చదివి చాలా ఆశ్చర్య పోయి ఈ మనిషిని గురించి ఇంకొంచెం ఎక్కువ తెలుసుకుందామని ప్రయత్నం చెయ్య బుద్ధయింది. అజయ్ ప్రకాష్ షా సుదీర్ఘ కెరియర్ లో మచ్చుకి కొన్ని మెచ్చు తునకలు :
గోధ్రా అల్లర్ల అనంతరం, గుజరాత్ ప్రభుత్వం - దూరదర్శన్ లో ప్రసారం కానివ్వకుండా అడ్డుకున్న టెర్రరిజం, అయోధ్య ల పై తీసిన డాక్యుమెంటరీలు 'ఇన్ మెమొరీ ఆఫ్ ఫ్రెండ్శ్ & 'రాం కే నాం' లను ప్రసారం చెయ్యాల్సిందిగా గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించడం. ఫ్రీడం ఆఫ్ స్పీచ్ - భారత పౌరుడుకి ఉన్న ప్రాధమిక హక్కు అని ప్రభుత్వానికి గుర్తు చేసారు ఈ న్యాయ మూర్తి.
విదేశాల్లో వికలాంగులను, వారికున్న సదుపాయాలను, పౌర జీవితం, నాగరికతా, వికలాంగుల కోసం పబ్లిక్ ప్లేసులను ప్రత్యేక సదుపాయాలతో సౌకర్య వంతంగా తీర్చిదిద్దడం చూసిన వారికి, మన దేశంలో వికలాంగులు పడే బాధలు చూస్తే ఎలా అనిపిస్తుంది ? మన దేశంలో ఇలాంటి వారికి మనం కల్పించే సౌకర్యాలు తక్కువ. బస్సు ల్లో, రైళ్ళలో, పని చేసే చోట్లలో - మానసిక అవకరం ఉన్నవాళ్ళకి, శారీరక వైకల్యం ఉన్నవాళ్ళకీ, రోజువారీ జీవితమే ఒక కార్గిల్ యుద్ధంలా తయారు చేసి పెట్టేం మనం. మరి వాళ్ళకి ఉన్న హక్కుల్ని ఎవరు గౌరవిస్తారు ? జస్టిస్ అజయ్ ప్రకాష్ మాత్రం ఆ పని చేశారు. ఎన్నో తీర్పుల్లో రవాణా సంస్థలనీ, ప్రభుత్వాల్నీ వికాలాంగుల హక్కుల కోసం కదిలించారు. లొంగని వాళ్ళని లొంగేలా చేసారు. ఈ ఒక్క వ్యక్తి, మానసిక అస్వస్థులు ఎదుర్కొనే వివక్ష ని కూడా ప్రపంచం దృష్టికి తీసుకొచ్చారు. అంతవరకూ మంచి ఆరోగ్యంతో ఉన్న ఉద్యోగులు, ఏ కారణం గానైనా మానసిక అస్వస్థత కు గురి అయితే, ఇలాంటి వారిని వృత్తి ఉద్యోగాల నుండీ బలవంతంగా నిర్మూలించడం, వారి వారి పెన్షన్ బెనిఫిట్లను నొక్కి పెట్టడాన్ని నిరసించి, చట్ట భద్రత కలిపించారు.
మహారాష్ట్ర లో మహాబలేశ్వర్, పంచ్ ఘని లను - ఆయా బీచ్ లనూ - అభివృద్ధి పేరిట వినాశనం చెయడాన్ని తన తీర్పులతో అడ్డుకున్నారు. ఆయా ప్రదేశాల 'ఇకో సిస్టం' ని భగ్న పరిచే ప్రయత్నాలు ఏవయినా తన దృష్టికి వస్తే వొదిలిపెట్టలేదు. హిందూ వివాహ చట్టం ప్రకారం - మొదటి భార్య బ్రతికుండగా, ఆ భర్త రెండో పెళ్ళి చేసుకుంటే, రెండో భార్యకు ఏ హక్కులూ ఉండవు. కానీ ఈ అంశాన్ని అడ్డంగా పెట్టుకుని భర్త విహీన అయిన రెండో భార్యని సమాజం ఎన్నో రకాలుగా వేధించడాన్ని ఈయన ప్రతిష్ఠాత్మకమైన తీర్పుల ద్వారానే నివారించగలిగారు. భారత విమాన యాన సంస్థ 58 సంవత్సరాల వయసు దాటిన మహిళా హొస్టెస్ లను బలవంతంగా రిటైర్ చేయించబోయినపుడూ ఈ అజయహస్తమే ఈ వయో, లింగ వివక్ష కు వ్యతిరేకంగా మహిళా ఏర్ హోస్టెస్ లు రిటైర్మెంట్ వయసు వరకూ పని చేయవచ్చని తీర్పిచ్చి ఆదుకుంది. విమాన యాన సంస్థ మొదట తన పనితీరు మెరుగు పరుచుకొని ప్రైవేటు రంగానికి దీటుగా నిలబడాలిగానీ ఏర్ హోస్టెస్ లను వొదిలించుకుని కాదని హితవు చెప్పింది ఈయన నాయకత్వం వహించిన బెంచ్.
అజయ్ ప్రకాష్ ఇచ్చిన ఎన్నో బెంచ్ మార్క్ తీర్పుల్లో - ప్రస్తుతం ఢిల్లీ హై కోర్టు చీఫ్ జస్టిస్ గా కామన్ వెల్త్ క్రీడల నిర్వహణకు సిద్ధం అవుతున్న ఢిల్లీ లో బిచ్చగాళ్ళను వారి వారి స్వ రాష్ట్రానికి పంపిచడాన్ని కోర్టు తప్పు పట్టడం తాజాది. ఢిల్లీ ఎవరి సొంతం.. బిచ్చగాళ్ళనయినా సరే పొమ్మనడానికి ఢిల్లీ ప్రభుత్వానికి అధికారం ఎవరిచ్చారు ? అనే భావన ని, ఎన్నో ఎన్.జీ.వో. ల మనోకాంక్షలని నిలబెట్టిందీ తీర్పు. అయితే, ఇపుడు అజయ్ పదవీ విరమణ చెయడంతో పరిస్థితి తారుమారు అయింది. ఎముకలు కొరికే నిర్దాక్షిణ్యమైన ఢిల్లీ శీతోష్ణ స్థితి ఏటా కొన్ని వందల మందిని పొట్టన పెట్టుకుంటోంది. ఇది కేవలం రాత్రి ఉండటానికి చోటు లేక పోవడం వల్లనే. చలి కాలంలో రాత్రి పూట రోడ్డు మీద నిద్రించే, ఇల్లు లేని కొన్ని వేల మంది అభాగ్యులకు ఎముకలు కొరికే చలి లో ప్రాణం నిలుపుకోవడానికి తినడానికీ (వొంట్లో వేడిని నిలుపుకోవడానికి), కప్పుకోవడానికీ ఏదయినా కావాలి. తిండి మాట దేవుడెరుగు. రాత్రికి 40 రూపాయల అద్దెకి కుక్కి మంచాన్నీ, కప్పుకునేందుకు రజాయినీ ఈ పేదలకి అందించే వాణిజ్యం కూడా అమలులో ఉందిక్కడ. కూటికి గతి లేక పోయినా, చలికి బ్రతికి బట్టకట్టేందుకు రాత్రికి 40 రూపాయల ఖర్చు కోసం తిండి కూడా తినకుండా పేదలు కటకటలాడుతున్నారు. వారిలో పిల్లలు, ముసలి వారు, వెనుకబడిన ప్రాంతాలనుంచీ పొట్టకూటికి నగరం చేరిన రిక్షా పుల్లర్లు, రక రకాల కూలి పనులు చేసుకునే వారు. వీళ్ళలో ఎందరో చలికాలం నిర్దాక్షిణ్యమైన చావు ని ఎదుర్కొంటున్నారు. కనీసం శీతాకాలం లోనైనా షెల్టర్లు నిర్మించి ఇవ్వమని ఆదేశించిన ఘన హృదయం జస్టిస్ అజయ్ ది.
లెక్కలేనన్ని ఎన్విరాన్ మెంట్ ఇష్యూస్, టెక్నాలజీ అంశాలూ - పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్లూ - ప్రభుత్వ విధాన నిర్ణయాలూ - ఇలా ఎన్నో ప్రజోపయోగ తీర్పులతో ఎందరి జీవితాలనో తాకిన జస్టిస్ అజయ్ ప్రకాష్ లాయర్ల కుటుంబం నుంచీ వచ్చారు.
మన దేశంలో చాలా మందికి రుచించని 'గే' ల చట్టబద్ధతని, హోమో సెక్సువల్ ల హక్కులనూ - జస్టిస్ అజయ్ తీర్పే కల్పించింది.
జస్టిస్ అజయ్ ప్రకాష్ పదవీ విరమణ అనంతరం జాతీయ ప్రింట్ మీడియా ఆయన పనితీరుని ప్రత్యేకంగా శ్లాఘించింది. సాహసం, నిబద్ధతా, నిజాయితీ, మూర్తీభవించిన ఇలాంటి జడ్జి - జస్టిస్ దినకరన్ లాంటి కేసుల వల్ల దెబ్బతిన్న ఇండియన్ జ్యూడీషియల్ సర్వీసుల ప్రతిష్టని పెంచడానికి కావాలి. రాబోయే కాలంలో జస్టిస్ అజయ్ ప్రకాష్ ని ఏదో ఒక కమిటీ కి పెద్దగా చూడవచ్చేమో మనం.
సో.. ఎందరో మహానుభావులు. ఒక్కొక్కరికీ వందనాలు.
పుణ్యక్షేత్రాల్లో తీర్ధ ప్రజ, మామూలు గుళ్ళలో కూడా తొక్కిడి, టెలివిజన్లో భక్తి - బాబాలూ, అమ్మలూ - ఇవన్నీ చూసి, మాలతీ చందూర్ ని ఎవరో అడిగారు ; ప్రజల్లో దైవభక్తి ఇంతగా ఎందుకు పెరిగిందీ ? అని. ఆవిడ నిష్కర్షగా చెప్పింది - ప్రజల్లో పెరిగింది భక్తి కాదు - పాప భీతి అని. పాపభీతి సంగతేమో గాని, నేరాలు వివిధ క్షేత్రాల్లో, పరిధుల్లో - ఆయా రేట్లలో పెరుగుతూనే ఉన్నాయి.
మనకో న్యాయ వ్యవస్థ ఏడిచింది గానీ మొదట్నుంచీ ప్రజలకి కోర్టులంటేనే ఏవో పడని పాట్లు గుర్తొస్తాయి. కోర్టులో కేసులు తరతరాలుగా పేరుకు పోవడం, న్యాయం దొరకడం ఆలీశెం అయిపోవడం వల్లనా కోర్టు - గాడిదా సామెతలు పుట్టాయి. తడిసి మోపెడయ్యే వ్యాజ్య ఖర్చులు తలుచుకుని, కేసు గెలిచినవాడు ఇంటికెళ్ళి, గెలవని వాడు కోర్టు బయటా ఏడుస్తారని జోకులు పుట్టాయి.
ఇలా న్యాయం దుర్భరమైపోతే ప్రజలకి దొరికేది, మిగిలేది - అన్యాయమే. కానీ అన్యాయాన్ని ఎదిరించే దమ్మున్న, నిబద్ధత ఉన్న మనిషొకడు నిర్ణయాత్మక, క్రియాశీలక పదవి లో ఉంటే ? రాజకీయాలకు అతీతంగా, అదరక బెదరక - అవినీతితో కుళ్ళిన న్యాయ వ్యవస్థ కి వన్నెను తీసుకొచ్చిన జడ్జి ఒకరు ఉంటే ?
సరిగ్గా ఇలాంటి లక్షణాలున్న నిజంగానే గౌరవనీయులైన ప్రధాన న్యాయ మూర్తి అజయ్ ప్రకాష్, గత అక్టోబర్ లో పదవీ విరమణ చేశారు. పత్రికలలో ఆయన మీద కురిసిన ప్రశంసలు చదివి చాలా ఆశ్చర్య పోయి ఈ మనిషిని గురించి ఇంకొంచెం ఎక్కువ తెలుసుకుందామని ప్రయత్నం చెయ్య బుద్ధయింది. అజయ్ ప్రకాష్ షా సుదీర్ఘ కెరియర్ లో మచ్చుకి కొన్ని మెచ్చు తునకలు :
గోధ్రా అల్లర్ల అనంతరం, గుజరాత్ ప్రభుత్వం - దూరదర్శన్ లో ప్రసారం కానివ్వకుండా అడ్డుకున్న టెర్రరిజం, అయోధ్య ల పై తీసిన డాక్యుమెంటరీలు 'ఇన్ మెమొరీ ఆఫ్ ఫ్రెండ్శ్ & 'రాం కే నాం' లను ప్రసారం చెయ్యాల్సిందిగా గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించడం. ఫ్రీడం ఆఫ్ స్పీచ్ - భారత పౌరుడుకి ఉన్న ప్రాధమిక హక్కు అని ప్రభుత్వానికి గుర్తు చేసారు ఈ న్యాయ మూర్తి.
విదేశాల్లో వికలాంగులను, వారికున్న సదుపాయాలను, పౌర జీవితం, నాగరికతా, వికలాంగుల కోసం పబ్లిక్ ప్లేసులను ప్రత్యేక సదుపాయాలతో సౌకర్య వంతంగా తీర్చిదిద్దడం చూసిన వారికి, మన దేశంలో వికలాంగులు పడే బాధలు చూస్తే ఎలా అనిపిస్తుంది ? మన దేశంలో ఇలాంటి వారికి మనం కల్పించే సౌకర్యాలు తక్కువ. బస్సు ల్లో, రైళ్ళలో, పని చేసే చోట్లలో - మానసిక అవకరం ఉన్నవాళ్ళకి, శారీరక వైకల్యం ఉన్నవాళ్ళకీ, రోజువారీ జీవితమే ఒక కార్గిల్ యుద్ధంలా తయారు చేసి పెట్టేం మనం. మరి వాళ్ళకి ఉన్న హక్కుల్ని ఎవరు గౌరవిస్తారు ? జస్టిస్ అజయ్ ప్రకాష్ మాత్రం ఆ పని చేశారు. ఎన్నో తీర్పుల్లో రవాణా సంస్థలనీ, ప్రభుత్వాల్నీ వికాలాంగుల హక్కుల కోసం కదిలించారు. లొంగని వాళ్ళని లొంగేలా చేసారు. ఈ ఒక్క వ్యక్తి, మానసిక అస్వస్థులు ఎదుర్కొనే వివక్ష ని కూడా ప్రపంచం దృష్టికి తీసుకొచ్చారు. అంతవరకూ మంచి ఆరోగ్యంతో ఉన్న ఉద్యోగులు, ఏ కారణం గానైనా మానసిక అస్వస్థత కు గురి అయితే, ఇలాంటి వారిని వృత్తి ఉద్యోగాల నుండీ బలవంతంగా నిర్మూలించడం, వారి వారి పెన్షన్ బెనిఫిట్లను నొక్కి పెట్టడాన్ని నిరసించి, చట్ట భద్రత కలిపించారు.
మహారాష్ట్ర లో మహాబలేశ్వర్, పంచ్ ఘని లను - ఆయా బీచ్ లనూ - అభివృద్ధి పేరిట వినాశనం చెయడాన్ని తన తీర్పులతో అడ్డుకున్నారు. ఆయా ప్రదేశాల 'ఇకో సిస్టం' ని భగ్న పరిచే ప్రయత్నాలు ఏవయినా తన దృష్టికి వస్తే వొదిలిపెట్టలేదు. హిందూ వివాహ చట్టం ప్రకారం - మొదటి భార్య బ్రతికుండగా, ఆ భర్త రెండో పెళ్ళి చేసుకుంటే, రెండో భార్యకు ఏ హక్కులూ ఉండవు. కానీ ఈ అంశాన్ని అడ్డంగా పెట్టుకుని భర్త విహీన అయిన రెండో భార్యని సమాజం ఎన్నో రకాలుగా వేధించడాన్ని ఈయన ప్రతిష్ఠాత్మకమైన తీర్పుల ద్వారానే నివారించగలిగారు. భారత విమాన యాన సంస్థ 58 సంవత్సరాల వయసు దాటిన మహిళా హొస్టెస్ లను బలవంతంగా రిటైర్ చేయించబోయినపుడూ ఈ అజయహస్తమే ఈ వయో, లింగ వివక్ష కు వ్యతిరేకంగా మహిళా ఏర్ హోస్టెస్ లు రిటైర్మెంట్ వయసు వరకూ పని చేయవచ్చని తీర్పిచ్చి ఆదుకుంది. విమాన యాన సంస్థ మొదట తన పనితీరు మెరుగు పరుచుకొని ప్రైవేటు రంగానికి దీటుగా నిలబడాలిగానీ ఏర్ హోస్టెస్ లను వొదిలించుకుని కాదని హితవు చెప్పింది ఈయన నాయకత్వం వహించిన బెంచ్.
అజయ్ ప్రకాష్ ఇచ్చిన ఎన్నో బెంచ్ మార్క్ తీర్పుల్లో - ప్రస్తుతం ఢిల్లీ హై కోర్టు చీఫ్ జస్టిస్ గా కామన్ వెల్త్ క్రీడల నిర్వహణకు సిద్ధం అవుతున్న ఢిల్లీ లో బిచ్చగాళ్ళను వారి వారి స్వ రాష్ట్రానికి పంపిచడాన్ని కోర్టు తప్పు పట్టడం తాజాది. ఢిల్లీ ఎవరి సొంతం.. బిచ్చగాళ్ళనయినా సరే పొమ్మనడానికి ఢిల్లీ ప్రభుత్వానికి అధికారం ఎవరిచ్చారు ? అనే భావన ని, ఎన్నో ఎన్.జీ.వో. ల మనోకాంక్షలని నిలబెట్టిందీ తీర్పు. అయితే, ఇపుడు అజయ్ పదవీ విరమణ చెయడంతో పరిస్థితి తారుమారు అయింది. ఎముకలు కొరికే నిర్దాక్షిణ్యమైన ఢిల్లీ శీతోష్ణ స్థితి ఏటా కొన్ని వందల మందిని పొట్టన పెట్టుకుంటోంది. ఇది కేవలం రాత్రి ఉండటానికి చోటు లేక పోవడం వల్లనే. చలి కాలంలో రాత్రి పూట రోడ్డు మీద నిద్రించే, ఇల్లు లేని కొన్ని వేల మంది అభాగ్యులకు ఎముకలు కొరికే చలి లో ప్రాణం నిలుపుకోవడానికి తినడానికీ (వొంట్లో వేడిని నిలుపుకోవడానికి), కప్పుకోవడానికీ ఏదయినా కావాలి. తిండి మాట దేవుడెరుగు. రాత్రికి 40 రూపాయల అద్దెకి కుక్కి మంచాన్నీ, కప్పుకునేందుకు రజాయినీ ఈ పేదలకి అందించే వాణిజ్యం కూడా అమలులో ఉందిక్కడ. కూటికి గతి లేక పోయినా, చలికి బ్రతికి బట్టకట్టేందుకు రాత్రికి 40 రూపాయల ఖర్చు కోసం తిండి కూడా తినకుండా పేదలు కటకటలాడుతున్నారు. వారిలో పిల్లలు, ముసలి వారు, వెనుకబడిన ప్రాంతాలనుంచీ పొట్టకూటికి నగరం చేరిన రిక్షా పుల్లర్లు, రక రకాల కూలి పనులు చేసుకునే వారు. వీళ్ళలో ఎందరో చలికాలం నిర్దాక్షిణ్యమైన చావు ని ఎదుర్కొంటున్నారు. కనీసం శీతాకాలం లోనైనా షెల్టర్లు నిర్మించి ఇవ్వమని ఆదేశించిన ఘన హృదయం జస్టిస్ అజయ్ ది.
లెక్కలేనన్ని ఎన్విరాన్ మెంట్ ఇష్యూస్, టెక్నాలజీ అంశాలూ - పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్లూ - ప్రభుత్వ విధాన నిర్ణయాలూ - ఇలా ఎన్నో ప్రజోపయోగ తీర్పులతో ఎందరి జీవితాలనో తాకిన జస్టిస్ అజయ్ ప్రకాష్ లాయర్ల కుటుంబం నుంచీ వచ్చారు.
మన దేశంలో చాలా మందికి రుచించని 'గే' ల చట్టబద్ధతని, హోమో సెక్సువల్ ల హక్కులనూ - జస్టిస్ అజయ్ తీర్పే కల్పించింది.
జస్టిస్ అజయ్ ప్రకాష్ పదవీ విరమణ అనంతరం జాతీయ ప్రింట్ మీడియా ఆయన పనితీరుని ప్రత్యేకంగా శ్లాఘించింది. సాహసం, నిబద్ధతా, నిజాయితీ, మూర్తీభవించిన ఇలాంటి జడ్జి - జస్టిస్ దినకరన్ లాంటి కేసుల వల్ల దెబ్బతిన్న ఇండియన్ జ్యూడీషియల్ సర్వీసుల ప్రతిష్టని పెంచడానికి కావాలి. రాబోయే కాలంలో జస్టిస్ అజయ్ ప్రకాష్ ని ఏదో ఒక కమిటీ కి పెద్దగా చూడవచ్చేమో మనం.
సో.. ఎందరో మహానుభావులు. ఒక్కొక్కరికీ వందనాలు.
Subscribe to:
Comments (Atom)