Showing posts with label Politics. Show all posts
Showing posts with label Politics. Show all posts
12/09/2019
Women in Terrorism Case of the LTTE by Tamara Herath - 5
ప్రతి ముగ్గురు పురుషులకీ ఒక స్త్రీ అనే నిష్పత్తిలో ఎల్.టీ.టీ.ఈ లో మహిళా సభ్యులు ఉండేవారు. వారిలో నాయకత్వ స్థాయిలో చాలా తక్కువమందే ఉన్నా, ప్రభాకరన్ తో వారికున్న రక్త సంబంధానికన్నా అతీతమైన బంధం, "అన్నా" అని వరుసతో పిలిచే గౌరవం, పరమ విధేయత, చెప్పుకోదగ్గవి. అసలంత చరిష్మా ని ప్రభాకరన్ ఎలా ఏర్పరచుకున్నాడు ? స్త్రీలకీ, వారి సమానత్వానికీ, పురుషులతో పోటీ పడి పనిచేసే వారి తెగింపుకీ, విశ్వాసానికీ అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన సంస్థ గా ఎల్.టీ.టీ.ఈ. ని రూపుదిద్దటం ద్వారానే.
తాము ఆ దేశంలో మైనారిటీలయి ఉండి, ప్రత్యేక ఈలం పోరాటం చేయడం లో ఉన్న చాలెంజ్ లను బేరీజు వేసుకున్న ఈ సంస్థ మొదటి నుండీ, స్త్రీ సమానత్వానికి తగిన ప్రాధాన్యతని ఇస్తూ వచ్చింది. వారు విధేయత తో సంస్థ లక్ష్యాలకోసం పని చేసేరు తప్ప పెద్దగా నాయకత్వ స్థానాలలో పని చేయలేదు. కానీ మతానికి సంబంధమే లేకుండా కేవలం దేశ సాధన కోసం కృషి చేసిన దళం కాబట్టి ఇక్కడ అసమానత కి తావు లేకుండా, నిజానికి మహిళల కి లైంగిక మానసిక వేధింపులు ఎదురవకుండా వారికి చాలా ప్రాధాన్యాన్నిచ్చి దళాన్ని నడిపించడం జరిగింది.
చెచెన్యా, పాలస్తీనా ల లా (అక్కడ ఆత్మాహుతి దాడి కి పాల్పడిన పురుషుడి కుటుంబానికి నాలుగొందల డాలర్లూ, స్త్రీ కుటుంబానికి రెండొందల డాలర్లూ ప్రతీ నెలా, జీవన భృతి చిక్కేది) స్త్రీ ప్రాణానికి తక్కువ విలువ, పురుషుడి ప్రాణానికి ఎక్కువ విలువా అని నిర్వచించలేదు. కానీ సాధారణ పౌర సమాజంలో స్త్రీ ల లాగా వీరు తాము బలహీనులం కాము అని నిరుపించుకోవడం కోసం ఎన్నో త్యాగాలు చేసారు. పోరాటం ముదిరినపుడు తప్పని సరి గా సాధారణ దుస్తులు ధరించాల్సి వచ్చేది. వారిని ఈ సాయుధ పోరాటంలో కి తీసుకు రావడమే సులువు. వన్ని పరిసరాల్లో ఎన్నోసార్లు ఆత్మ రక్షణ కోసం గూడు చెదిరి పారిపోవాల్సి వచ్చినపుడు, దాడులకు గురయినపుడూ వారు ఎదుర్కొన్న రక్షణ లేని పరిస్థితులకు మహిళలకి ఈ ఈలం పోరాటం ఓ కవచం లా కనిపించడంలో తప్పు లేదు.
పురుషులతో సమానంగా వారు పేలుడు పదార్ధాలు అమర్చి, పేల్చి, లోతుల్లోకి దిగి, అత్యంత సాహసమైన, దుర్లభమైన బావులు తవ్వడం లాంటి పనులు చేసారు. క్లిష్టమైన పనుల్లో స్త్రీ సహాయకురాలిగా, పురుషుడు ప్రధాన పాత్ర గా కాకుండా దానికి భిన్నంగా పని చేసి చూపించారు. వారు బావులు తవ్వినపుడు పురుషులు తట్టలు మోసారు. వారు లాండ్ మైన్ లను అసెంబుల్ చేసారు, అమర్చారు. పేలుడు పదార్ధాలను వాడారు. ఆయుధాలను మోసారు. మైళ్ళ కొద్దీ అడవుల్లో, నగరాల్లో, సైనికులమీద దాడులకు దిగారు. ఆత్మాహుతి దాడుల్లో ఒక్క మారు కూడా వెనుతిరిగి చూడకుండా పాల్గొన్నారు. పోరాటం చివరి రోజుల్లో ట్రక్కుల కొద్దీ శవాలై తేలారు. సముద్రం మధ్యలో శ్రీలంక నేవీ మీద కు దాడికి దిగారు. పురుషుల కన్నా ఎక్కువ సమర్ధవంతంగా పని చేసారు.
తమ జెండర్ సాకు గా చూపించి ఏ పనీ చెయ్యడానికి వెరవలేదు. శక్తికి మించిన పనులే చేసారు. ప్రాణాల్ని తృణప్రాయంగా వదిలారు. అయితే శ్రీలంక ప్రభుత్వం నిర్ధాక్షిణ్యంగా, ఉక్కుపాదంతో నలువైపుల నుండీ చుట్టుముట్టి వేలాదిగా దళ సభ్యుల్ని తుడిచిపెట్టేసినపుడు, పురుషుల కన్నా ఎక్కువ హింసకి లోనై చంపబడ్డారు. పైగా తమని తాము నిరూపించుకోవడానికి పురుషుల కన్నా ఎక్కువే కష్టపడ్డారు. ప్రభాకరన్ విశ్వాసాన్ని కోల్పోకుండా ఉండేందుకు, ఆయన మీద గౌరవంతో ఎన్నో సమస్యలని ఎదుర్కొన్నారు. పోరాటం ముగిసి, నాయకులంతా మరణించాకా, హింసని మర్చిపోయేందుకు శ్రీలంక సమాజం చేసిన ప్రయత్నాలలో ఈ మహిళా తీవ్రవాదులని కూడా స్మృతి పథం లోంచీ అందరూ తుడిచేసారు.
ఈ మహిళా తీవ్రవాదుల గురించి సెప్టెంబరు 11 దాడుల ముందు వరకూ ఎవరూ, ముఖ్యంగా లంక మరియు విదేశీ మీడియా అస్సలు పట్టించుకోనే లేదు. సంఖ్యాపరంగా కూడా, వ్యవస్థాగత అమరిక లోనూ, తక్కిన సంస్థల్లో మహిళా తీవ్రవాదుల కన్నా ఎక్కువ సంఖ్యలో ఎక్కువ ఫలితాలనీ, లక్ష్యాలనీ సాధించినా, వీరికి తగిన గుర్తింపు అప్పటి వరకూ దొరకనే లేదు. 9/11 తరవాత పాశ్చాత్య, లంకీయ మహిళా జర్నలిస్టులు సైతం ఈ మహిళా తీవ్రవాదుల పాత్రపై దృష్టి సారించారు. వీరి ప్రవేశం, దళాల వ్యవస్థా, పనితీరు, ప్రాధాన్యత, ధైర్యం వగైరా అంశాల పై పరిశోధన మొదలైంది.
సింహళ, తమిళ సమాజాలలో సాధారణ మహిళల నుంచీ ఈ తీవ్రవాద మహిళలకు పెద్ద సానుభూతి ఏమీ దక్కలేదు. ఎప్పుడో పాత తరపు స్త్రీలు మాత్రం, కట్టుబాట్లను చేదించి, ఆభరణాలను త్యజించి, ఆయుధాలు ధరించి, పురుషుల దుస్తులు ధరించి, ఏదో లక్ష్యం కోసం పని చేస్తున్న ఈ తీవ్రవాద మహిళలని కాస్త ఆదరంగా చూసినా, అంతకు మించి గుర్తింపు దక్కలేదు.
మే 2009 లో ప్రభాకరన్, అతని ఇద్దరు కొడుకులూ, కూతురూ, భార్యా, విధేయ అనుచరులూ హత్య కావింపబడ్డాక, ఈలం పోరాటం చాలా దారుణ పరిస్థితుల్లో ముగిసింది. అప్పటి నుండీ శ్రీలంక రాజకీయ వాతావరణం, సమాజ వాతావరణం చాలా మారిపోయింది. పోరాటం ముగిసాకా, ఎల్.టీ.టీ.యీ ఏకాకిత్వం ఎక్కువయిపోయింది. సమాజం లో ప్రతి ఒక్కరూ, వీరికి దూరంగా జరిగారు. ఏతావాతా విదేశీ మీడియా, సానుభూతిపరులూ, లంక సైన్యం సాగించిన అక్రమ నిరంకుశ రాక్షస విధానాలనూ, యుద్ధ నేరాలనూ రికార్డు చేసాయి. హిలరీ క్లింటన్ ఈ యుద్ధ నేరాలను గర్హిస్తూ చేసిన చిన్న ప్రకటనలు తప్ప ఎక్కువ పనేమీ జరగలేదు.
ఈలం పోరాటం లో ఈ మహిళల పాత్ర మాత్రం అసామాన్యమైనది. తమ నాయకుడు, అతని భార్యను మాత్రం సాంప్రదాయ కుటుంబ చట్రంలో భద్రంగా ఉంచి, మిగిలిన మహిళలను మాత్రం తీవ్రవాదం లోకి తీసుకొచ్చి, పోరాటంలో వాడుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఎల్.టీ.టీ.ఈ ప్రధానంగా ఆత్మాహుతి దళం. ఇందులో ఒక మాటు ప్రవేశించాక, నిష్క్రమణ మరణం ద్వారానే అని తెలిసీ, తమిళ దేశపు లక్ష్య సాధన కోసం altruistic suicides కి ముందుకొచ్చిన ఈ వేలాది మహిళలు చరిత్ర లో ఓ భాగంగా మిగిలిపోయారు.
ఎల్.టీ.టీ.ఈ లో ఈ మహిళల active role సాధారణ శ్రీలంక /తమిళ సమాజం లో మహిళల సమానత్వ కాంక్ష కూ, వారి రాజకీయ సామాజిక చైతన్యానికీ సూచిక. ఈ మహిళలు, పురుషుల చాటు రెండో తరగతి ప్రజల్లా ఉండి పోకుండా, తమ కు ఎదురైన వ్యక్తిగత, జాతిగత అన్యాయాలను తమకు చాతనయినంత మేరకు ఎదుర్కొన్నారు. అసలు సమాజం కూడా ముప్పయేళ్ళ హింస కు ఎందరో మనుషులనీ కోల్పోయింది. తప్పనిసరి గా లక్షలాది మంది దేశాలు పట్టి పారిపోయారు.
పోరాటం ముగింపు దశలో ఎందరో అమాయక జనం తీవ్రవాదుల, సైనికుక చేతుల్లో చనిపోయారు. రచయిత్రి ఇంటర్యూ చేసిన మహిళా తీవ్రవాదులు మామూలు గృహిణులు, పిల్లలు, యువతులు.. వివిధ వయసుల్లో, వివిధ నైపుణ్యాలతో యుద్ధాన్నీ, హింసనీ దగ్ఫరగా చూసిన వారు. వారికి ఈ ఆయుధాలు, పోరాటం, దళాలలో చిక్కే గౌరవం, నిరాశ గా ఉండిపోకుండా ఏదో చేసామన్న తృప్తి ని ఇవ్వడం గురించి మాట్లాడారు. సమాజం లో మహిళల పట్ల మారాల్సిన దృక్పథం గురించి, తమ తమ అభిప్రాయాలు వ్యక్తపరిచారు.
ఈలం గురించి వివిధ వెబ్ సైట్ లలో, ఎల్.టీ.టీ.ఈ అధికారిక వెబ్ సైట్ల లో జెండర్ బేస్డ్ డాటా కోసం వీలయినంత మేర ప్రయత్నించినట్టు రచయిత్రి చాలా చోట్ల చెప్పడం బావుంది. నిజానికి ఇందరు స్త్రీలు, ఇందరు పురుషులు అని ఎక్కడా సమాచారం దొరకక కుస్తీ పడాల్సొచ్చింది. అయితే ప్రతీ సభ్యుడు, స్త్రీ పురుష బేధం లేకుండా సాధించిన వివిధ విజయాల గురించి వెబ్ సైట్ లు యధాతధంగా ప్రచురించడం ప్రస్తావించారు.
ఏదేమైనా ఈ తమిళ మహిళా పులులు ప్రత్యేకమైన పాత్ర పోషించి, తీవ్ర వా దాని కున్న dimensions ని మార్చేసారనడం లో సందేహం లేదు. 240 పేజీల ఈ రీసెర్చ్ గ్రంధం చదివి ఆ తరవాత ఊరుకోక అందులో కనిపించిన సోర్స్ ల గురించి నెట్ లో వెతికి భీభత్స రణ చరిత్ర ని చదివి, తీవ్రవాదాన్ని అణచడం లో శ్రీలంక గొప్పగా చెప్పుకునే శ్రీలంక మోడల్ మిలటరీ ప్లాన్ గురించి ఆలోచించి ఆశ్చర్యం కలిగింది. మొత్తానికి ఇప్పుడు శ్రీలంక శాంతియుత దేశం. పర్యాటక ప్రాంతం ఈలం తుడిచిపెట్టబడ్డ చరిత్ర. ఈ మహిళల మార్క్ మాత్రం ప్రపంచంలో ఎక్కడో లీలగా ఉండిపోతుంది.
-Finished-
02/08/2019
Women in Terrorism Case of the LTTE by Tamara Herath - 4
మాలతి
21 మే 1991 న తమిళనాడు శ్రీ పెరంబదూర్ లో భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య జరిగింది. ఎల్ టీ టీ ఈ కు చెందిన మహిళా తీవ్రవాది ధను (అసలు పేరు థెన్ మోళి రాజరత్నం) నడుముకు చుట్టుకున్న బెల్టు బాంబు పేల్చి ఆత్మాహుతి దాడికి పాల్పడడంతో రాజీవ్, ధనులతో సహా వారికి చుట్టుపక్కల ఉన్న 16 మంది దుర్మరణం పాలయ్యారు. రాజకీయ కల్లోలం సృష్టించిన ఈ ఘటన ఆ తీవ్రవాద సంస్థ తుడిచిపెట్టబడడానికి, భారత ప్రజల్లో శ్రీలంక తమిళుల పట్ల ఉన్న సానుభూతిని చెరిపేయడానికీ దోహదపడింది. బాలసింగం అన్నట్టు ఇదో దురదృష్టకరమైన సంఘటన. ప్రభాకరన్ వ్యూహాత్మక తప్పిదం. అయితే, ధను తీవ్రవాదంలో మహిళల పాత్ర పట్ల ప్రపంచ దృక్కోణాన్ని మార్చేసింది.
దాడి సఫలం అయిన వెంటనే, వాటి తీవ్ర రాజకీయ పరిణామాలను ఊహించిన ఎల్.టీ.టీ.ఈ. ఈ హత్య వెనుక తమ పాత్ర లేదని వాదించింది. ధను ఐ.పీ.కే.ఎఫ్ చేతిలో అత్యాచార బాధితురాలని, ఆమె వ్యక్తిగతంగా ప్రతీకారం తీర్చుకోవడానికే రాజీవ్ ని చంపిందనీ ప్రకటించింది. ఐ.పీ.కే.ఎఫ్ 1987 - 1990 వరకూ జఫ్నా లో పనిచేసింది. మహిళల శీలం, పవిత్రతా లకు సాధారణంగా సమాజంలో ఓ గౌరవనీయమైన స్థానం ఉంటుంది. రాజ్యం / ఐపీకేఎఫ్ / శ్రీలంక దళాలు, తమిళులను కృంగదీయడానికి సామూహిక హత్యలూ, అత్యాచారాలకు తెగబడ్డాయన్నది నిజం. అలా దాడులకు, తరచూ ఇంటిని / తమ స్వస్థలాలనూ వొదిలి పారిపోవాల్సి రావడం, చెట్లకిందే సమూహాలలో బ్రతుకు జీవుడా ని జీవించడం, కళ్ళముందే అయినవారిని కోల్పోవడం, చాలా మంది మహిళలను ప్రతీకారేచ్చ తో రగిలేటట్టు చేసాయి. ఏ రక్త సంబందమూ ఇవ్వలేని బాంధవ్యాన్ని ఈలం పోరాటం కల్పించింది. వారు ఇలాంటి తీవ్రవాద / ఆత్మాహుతి దాడికి పాల్పడి, వారు తమ పవిత్రత ని తిరిగి పొందవచ్చనీ, చెరచపడ్డ ఆడది, తిరగబడటానికి, చంపడానికీ తుపాకీ చేపట్టడం, తిరుగులేని జవాబు గా భావించడం, ఓ అధికారంగా భావించడం జరిగింది. ఏ యుద్ధంలో అయినా మహిళ ల పట్ల ఘోర అన్యాయాలు జరుగుతాయి. అత్యాచారం వాటిలో మొదటిది. భర్తలనూ, పిల్లలనూ చంపడం, అశక్తురాలను చేయడం మిగతావి. వాటికి ప్రతీకారం తీర్చుకునేందుకు "తమిళ పులులు" వారికి అవకాశం ఇచ్చారు.
రేప్ కు గురయిన స్త్రీ, బయట సమాజంలో అంతగా గౌరవింపబడదు. కానీ తమిళ పులుల సమాజంలో వారికి పురుషులతో సమాన హోదా వుంది. పైగా స్త్రీ సహజ నైజం త్యాగం (సమాజపు చట్రాల ఆలోచనల్లో, స్త్రీ తప్పనిసరిగా త్యాగధనే) కాబట్టి, ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డ మహిళ అయితే ఇంకా గౌరవింపబడేది. హమాస్ లాంటి చాందసవాద ముస్లిం సంస్థల్లో పురుషులతో సమానంగా తీవ్రవాద ఆత్మాహుతి దాడులకు అనుమతించాలని ఉద్యమించిన మహిళలకు ఆ అవకాశం ఇవ్వడానికి మొదట తటపటాయించినా, తిరుగులేని జవాబుదారీతనంతో, ఖచ్చితత్వం తో వారు ఈ దాడులకు దిగడం తో స్త్రీ ల ఉగ్రవాద పాత్రల పట్ల, వారికి కొన్ని కీలక ప్రదేశాల్లో పురుషులకు కూడా దొరకని ప్రవేశావకాశాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం ఎంత లాభదాయకమో హమాస్, ఇస్లామిక్ జిహాద్ వగైరా సంస్థలు వెంటనే గుర్తించాయి.
అందరు మంచి మహిళల లాగే ఈ తీవ్రవాద ముస్లిం మహిళలు కూడా, టార్గెట్ వరకూ ఒక మగ మనిషితో వచ్చారు. ఈ మగ సహచరుడు, బహుశా వీరు దాడి చేస్తారా చెయ్యరా చూడడానికి వచ్చినట్టు కూడా అనుకోవచ్చు. వాళ్ళ కళ్ళు విప్పార్చుకునేలా దాడులు చేసిన మహిళలు, మహిళా తీవ్రవాదానికి ఒక పెద్ద పీట వేయించారు. కాశ్మీర్ లో ఈ మధ్య వరకూ చిన్న పిల్లలు, ముక్కు పచ్చలారని బాలురు, డబ్బులకు రాళ్ళు రువ్వడం ప్రచార మాధ్యమాలలో బాగా చూసాం. ఈ పసివాళ్ళే, ఆర్మీ కాన్వాయి మీద చేతితో క్లిప్ తీసి, విసిరే గ్రనేడ్ లనూ అవలోకగా విసురుతారు. అలా చిన్న చిన్న పసివారు కూడా తీవ్రవాదంలో భాగం కావడం సామాన్యం. శ్రీలంక ఈలం పోరాటంలో వేలాది పిల్లలు, మహిళలూ దళంలో చేరారు. చావు వీరికి, తమ జీవితంలో ఎదురవబోయే ఓ ముప్పు. ఎన్నో పరిణామాల వంటిదే.
అయితే ఆత్మాహుతి దళంలో చేరడం, స్లీపర్లు గా పనిచేయడం, వారి అవసరం పడినపుడు తమ నేతకు తలవంపులు తేకుండా, 100% సఫలత తో దాడికి తెగబడడం, వారు చాలా ఇష్టంగా ఎంచుకునే ప్రక్రియ. మహిళల కైతే, తమ పవిత్రతని తిరిగి పొందేందుకు ఇదో సాధనం.
నిజానికి ఎల్.టీ.టీ.ఈ. దళాలు తప్పనిసరిగా తమ ట్రైనింగ్ ముగిసిన గుర్తుగా మెళ్ళో ఓ కుప్పి / సైనేడ్ బిళ్ళ ను వేసుకునే వారు. గాజు కుప్పె / తావీజు లో పేక్ చేసిన ఆ సైనేడ్, రక్త ప్రవాహంలో చేరిన వెంటనే 5-10 నిముషాల పాటు విపరీతమైన వేదనకు గురి చేసి, మనిషి ప్రాణాన్ని తీస్తుంది. మోతాదు తక్కువ అయితే, మెదడు కోలుకోలేనంతగా దెబ్బ తింటుంది. మిలిటెంట్ విద్యార్ధి ఉద్యమంలో పోలీసులకు పట్టుబడే ముందు శివకుమార్ అనే నాయకుడు సైనేడ్ సేవించి 1974 లో ఆత్మహత్య చేసుకోవడం, ప్రభాకరన్ దృష్టిలో పడింది.
నిజానికి సైనైడ్ మరణం అత్యంత బాధ తో, హృదయవిదారకమైన వేదనతో నిండినది. కానీ పోలీస్ / సైనికుల చేతిలో విపరీతమైన చిత్రవధ, తరవాత తప్పని భయంకరమైన మృత్యువును తప్పించుకునేందుకు సైనైడ్ ను నమ్ముకుంది ఎల్.టీ.టీ.ఈ. కొత్తల్లో ఈ కుప్పె ను కొరికి, నాలుక/పెదవుల మీద అయిన గాయం ద్వారా సైనైడ్ ను తీసుకునేవారు. కానీ గట్టి గా ఉంటూండే కుప్పెను అంత గట్టిగా కొరకడం అన్నిసార్లూ కుదిరేది కాదు. గాయం చిన్నదయినా, మోతాదు తగ్గినా విపరీత పరిణామాలుండేవి.
ఆఖరికి ఈ కుప్పె లో ఆధునిక మార్పులు వచ్చి, సన్నని గాజు కుప్పెలు వాడటం మొదలయింది. భారత దేశాన్నిండీ దీన్ని దిగుమతి చేసుకునే వారు. తీవ్ర గాయాలతో శ్రీలంక దళాలకు చిక్కేసే పరిస్థితుల్లో సైనైడ్ తిని ఆత్మహత్య చేసుకున్న మొదటి మహిళా సభ్యురాలు మాలతి వీర మరణాన్ని, అక్టోబర్ 2009 లో చివరి పోరాటం లో ఓడిపోయే వరకూ ఎల్.టీ.టీ.ఈ. గౌరవిస్తూనే ఉంది. సైనేడ్ మరణాలను చాలా వరకూ హాయైన మరణంగా ప్రచారం చేసేవారు. ఎందుకంటే దొరికిపోయి, తమ తోటివారికి ప్రమాదం గా తయారవకుండా, చనిపోవడమే క్షేమమని భావించేవారు.
ఎల్.టీ.టీ.ఈ, చాలా విషయాల్లో మిగతా తీవ్రవాద దళాల కన్నా స్త్రీ సమానత్వం లో మెరుగు. ఏ నమ్మకాల మీద, బ్రెయిన్ వాషింగ్ మీదనో, తమిళ బాధిత స్త్రీలు దళంలో చేరినపుడు వారికి పురుషులతో సమాన అవకాశాలు కల్పించింది. బెదురు లేని, ఇంటిలాంటి వాతావరణాన్నిచ్చింది. అప్పటి వరకూ సామాన్యంగా జీవించేందుకు పోరాడిన సామాన్య మహిళలు కాస్తా, సమాజం కట్టుబాట్లని వదిలి, పురుషులతో సమానమైన ట్రైనింగ్, ఆయుధాలు, లక్ష్య నిర్దేశ్యాలలో, నాయకత్వ నిర్ణయాలలో భాగం తీసుకోవడం మొదలయింది.
ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ వారి కుటుంబాలకి, ప్రతీ తీవ్రవాద సంస్థా నెలకింత అని స్టైపెండ్ ఇస్తుంది. కానీ హమాస్, ఇస్లామిక్ జిహాద్ లు పురుషుడి కుటుంబానికి ఎక్కువా, మహిళా తీవ్రవాది కుటుంబానికి అందులో సగం ఇచ్చేవారు. ఎందుకంటే, బ్రతికి ఉండుంటే, పురుషుడు తన కుటుంబానికి ఏదో ఓ పని చేసుకుని డబ్బు సంపాయించి ఇచ్చిఏవాడు కనుక. కానీ ఎల్.టీ.టీ.ఈ అలాంటి తేడాలేవీ చూపించలేదు. అయితే ఈ తరహా సొమ్ము ను తమిళ కుటుంబాలు ఎంత చొప్పున అందుకునేవో బయటికి తెలిసేది కాదు. ఒకవేళ వారు దాన్ని నిరాకరించినా, ఈలం సమాజంలో ఆయా కుటుంబాలకు సముచిత గౌరవం దక్కేది.
ప్రతీ 27 నవంబరు నా, వీరుల స్మారక దినం రోజు అన్న ప్రభాకరన్ ఆయా కుటుంబాలను ఉద్దేశించి బరువైన ప్రసంగం చేసేవాడు. ఆత్మాహుతి దాడి చేసుకున్న మొదటి పురుషుడు కేప్టెన్ మిల్లర్ కు ఎంత గౌరవం దక్కిందో, సైనైడ్ తిని ఆత్మహత్య చేసుకున్న మొదటి మహిళగా మాలతి కీ అంతే గౌరవం దక్కింది. వివిధ యుద్దాలలో, ఆత్మాహుతి దాడుల్లో చనిపోయిన ఈలమ్ వీరుల త్యాగాలు ఊరికేనే వృధా కావనీ, పోరాటానికి జవస్త్వాలు కూర్చడానికి ప్రాణాల్నే బలిదానం చేసిన వీర సైనికులమేలు మరవలేనివనీ ప్రభాకరన్ వల్లించడం ఆయా కుటుంబాలను సాంత్వన పరచేవి.
10/04/2019
Women in Terrorism Case of the LTTE by Tamara Herath - 2
Part - 2
సాధారణంగా పురుషాధిక్య సమాజంలో స్తీ కి వుండే వర్త్ లెస్ నెస్.. లేదా విలువ లేకపోవడం తీవ్రవాదంలో కూడా కనిపిస్తుంది. మాస్కో థియేటర్ దాడిలో కేవలం మహిళా ఉగ్రవాదుల శరీరాలకే బాంబు బెల్టులు కట్టి ఉన్నాయి. దీని ద్వారా స్త్రీ విలువ, పురుషుని కన్నా తక్కువే ఉన్నట్టు కనిపిస్తుంది. పైగా ఆయా తీవ్రవాద పోరాటాల్లో ఆత్మాహుతి దాడికి ఎంచుకోబడిన స్త్రీలు, సాధారణంగా విధవలూ, పిల్లలు లేని వారు, పెళ్ళి కాని వారూ.. అలా బాధ్యతలూ, బంధనాలూ లేని వారిలోంచీ వుండేవారు. రాను రాను, పిల్లలున్న తల్లులు కూడా ప్రాణ త్యాగానికి సిద్ధపడటం మొదలయింది.
జనవరి 2002 లో యాసర్ ఆరాఫత్ దృష్టి మగ "షహీద్" ల నుంచీ మళ్ళి మహిళా "షహీదా"ల పైకి, ఆత్మాహుతి దాడుల ద్వారా వారు ఉద్యమానికి చేయబోయే సాయాన్ని అత్యంత ప్రభావవంతంగా గ్లోరిఫై చేయడాన్ పట్లా మళ్ళింది. వాళ్ళ త్యాగనిరతి ని హైలైట్ చేస్తూ, ఈ పనుల ద్వారా వారు సాధించిన సమానత్వాన్నీ, ప్రదర్శించిన నిస్స్వార్ధత నీ, ముఖ్యంగా 'స్త్రీ జీవితం' తాలూకూ బాధ్యత నీ, గుర్తు చేస్తూ వాళ్ళని ప్రభావితం చేసేలా మారింది పాలస్తీన్ ఉద్యమం.
అయితే తీవ్ర వాదంలో ఎల్.టీ.టీ.ఈ సాధించిన ఘనత ఏంటంటే, స్త్రీలని తీవ్రవాదంలోకి ఆకర్షించడం ద్వారా, చాందసవాద తమిళ శ్రీలంక సమాజంలో స్త్రీ ల పాత్రని మార్చి, తీవ్రవాదంలోనూ, బయట సమాజంలో కూడా స్త్రీల దృక్పథం మారడంలోనూ, వాళ్ళని కుల వర్గ ఆర్ధిక అంతస్తుల బేధాలు లేకుండా కలిసి పని చేసేలా చేసి, శ్రీలంక సమాజం లో మార్పు తీసుకురావడం. కొన్ని పురుషాధిక్య భావాలున్నా, సెక్సువల్ హెరాస్మెంట్ లేని, కుటుంబ వాతావరణం కల్పించడం ద్వారా, తమిళ మహిళా పులులు పూర్తి అంకిత భావంతో పని చేసేందుకు అనుగుణమైన వాతావరణాన్ని అందించడం.
ఇక్కడ పాలస్తీనా మహిళా తీవ్రవాదం లోకి వస్తే, 2000 లో 'ఆల్ అక్సా ఇంతిఫదా' తరవాత తమ బ్రతుకులు దుర్భరం అయ్యాయని వాళ్ళ కంప్లైంట్. వాళ్ళ లక్ష్యం (soft target) ఎప్పుడూ సాధారణ ప్రజలు, పౌర సమాజం, వీరి మీద ఆత్మాహుతి దాడి సులభం, ఖరీదు 150 అమెరికన్ డాలర్ల కన్నా చవుక. పైగా మహిళలకు ఒక గుర్తింపు కల్పించడానికి ఒక ఆయుధం. రెఫ్యూజీ కాంప్ లలో బ్రతుకు తిప్పలు, అష్ట కష్టాలూ పడుతూ (దీనికి ఒక సొల్యూషన్ లేదు.. బహుశా జీవితాంతమూ ఆ కేంప్ లోనే బ్రతకాలి) తమ జీవితంపై అన్ని హక్కులూ గల సోదరుల, తండ్రుల, భర్తల, కొడుకుల నిర్ణయాలపై ఆధారపడుతూ బ్రతికే బ్రతుకు కూ, తమకు కాస్తో కూస్తో సాధికారతని ఇచ్చేదీ అయిన తీవ్రవాదం వైపు వారు సులువుగానే మళ్ళారు., ఈ విలువే లేని బ్రతుకు లో చైతన్యం కోసం కొందరు ఉగ్రవాదం కోసం వస్తే, 'హమాస్', 'ఇస్లామిక్ జిహాద్' లు వారి ని తమ తమ స్వార్ధం కోసం సపోర్ట్ చేయడం, 'ఆల్ అస్కా మార్టిర్స్' సంస్థ పూర్తి లాజిస్టిక్ సపోర్ట్ ఇవ్వడమూ చేసి పూర్తి తోడ్పాటుని అందించాయి.
సాయుధ, ఆత్మాహుతి యుద్ధంలోకి స్త్రీలను ఆరాఫత్ అధికారికంగా ఆహ్వానించిన రోజు 27 జనవరి 2002 నే 'వఫా ఇద్రిస్' అనే మహిళ, రెడ్ క్రీసెంట్ ఉద్యోగి, డిపార్ట్మెంటల్ స్టోర్ లోకి తన హాండ్ బాగ్ లో బాంబ్ ని తీసుకు వెళ్ళి పేల్చడం ద్వారా, ఒకరి మృతికి, 100 మంది ఇజ్రాయిలీలకు గాయాలకీ కారణం అవుతుంది. 'ఆల్ అక్సా బ్రిగేడ్' ఈ దాడికి బాధ్యత వహించింది. కానీ దాడికి ముందు సాధారణంగా పాలస్తీనియన్ తీవ్రవాదులు విడుదల చేసే వీడియో మెసేజ్ ఏదీ ఇద్రిస్ ఇవ్వలేదు. కాబట్టి, ఆమెకు దాడి గురించి తెలియనే తెలియదనీ, ఆమెను ఒక పావులా గా వాడుకున్నారనీ ఆరోపణలు వచ్చాయి. మొన్న కాష్మీర్ లో సీ.ఆర్.పీ.ఎఫ్ పైన జరిగిన దాడిలో తీవ్రవాది విడూల చేసిన వీడియో మెసేజ్ చూసే వుంటారు. అది ఒక ప్రొఫెషనల్ హాక్. దాడి చేయడం ఎవరైనా చేస్తారు. ప్రచారం పొందడం ముఖ్యం కదూ. అసలు తీవ్రవాదం లక్షణమే, భయాందోళనలకు గురి చేయడం. [తానేదో మంచిపనినే చేస్తున్ననన్న నమ్మకంతో].
వఫా మరణాన్ని గ్లోరిఫై చేసి ఆమె శ్రద్ధాంజలి లో వఫా బలిదానం ద్వారా, పాలస్తీనా జాతీయోద్యమం లో మహిళల పాత్రకి గౌరవాన్ని తెచ్చిపెట్టినట్టు ప్రచారం జరిగింది. ఆమె మరణం ఒక అత్యత్భుతమైన హీరొఇజం ని కళ్ళెదుట నిలిపినట్టు, మహిళలు కూడా ఇలా ఆత్మ బలిదానాలు చేయడం ద్వారా జాతి విముక్తి త్వరలోనే కలుగుతుందనీ, నమ్మకం కలిపించే ప్రచారం జరిగింది.
ఇక్కడ తమిళ పులుల పోరాటంలో రేప్ బాధితులు - దాడుల ద్వారా, తమ శరీరాలు పవిత్రమైనట్టు భావించడం, వారికి వివిధ మాధ్యమాల ద్వారా దొరికిన సెన్షేషనల్ గుర్తింపూ, మీడియా రిపోర్ట్ లు అలాంటి పని చేసిన మహిళల మీద వివిధ కధనాలు ప్రచారం చేయడం ద్వారా వారికి దొరికిన పేరు, పరువూ, ఖ్యాతీ, ఈ మార్గంలోకి లాక్కొచ్చాయి. అయితే ఇంత త్యాగం చేస్తున్నా, ఇంత సాహసం చేస్తున్నా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ ఒక్క తీవ్రవాద సంస్థ లోనూ, ఉదాహరణకి Urugvayan Tupamaros Revolutionary Group, Salvadorian Farabundo Marti Front for National Liberation, Nicaraguan Sandivistas, Chinese Red Army, వగైరా ఎందులోనూ మహిళలకు తగిన రాంకులలో సమనత్వం, పై స్థాయి నాయకత్వ స్థానమూ దొరకననే లేదు. దీనిని బట్టి వాళ్ళని పూర్తిగా పని దోపిడీ కి గురి చేసారన్న సంగతి , వాడుకున్నారు అన్న విషయం తెలుస్తుంది. వీటిల్లో LTTE
నయం.
నయం.
Notes :
22/04/2009
చాక్లెట్ కత్తులు
మా హీరో ప్రోజెక్ట్ కోసం జెనీవ్ ప్రయాణం కట్టినపుడు ఒక స్నేహితుడు 'అయితే నీకు స్విస్ బాంకు అకౌంటు ఉంటుందిరొయ్ !' అని చెణికేరు. అపుడు గానీ మాకా విష్యం తట్టనే లేదు. అంతవరకూ అక్కడ ఇళ్ళు దొరకకపోవడం గురించీ, మనకు ఫ్రెంచీ, ఇటాలియనూ రాకపోవడం గురించీ చింత పడిన తరవాత, ఈ సంగతి పట్టుకుని, మేము కూడా మా హీరోని ఉబ్బేసి పంపించేశేము ! అద్వానీకి ఇపుడు ఏమీ తోచక, అమెరికన్లు ఇచ్చిన అయిడియా ఒకటి పట్టుకుని స్విస్సు బాంకుల వెంట పడటంతో ఈ విషయం మళ్ళా గుర్తొచ్చింది.
చిన్నప్పుడు నేను రేడియోలో వాతారరణ సూచనలు వినేటపుడు 'భారీ వర్షం ' అనే పదానికీ, పేపరు చదివేటపుడు 'స్విస్ బాంకు ' అనే పదానికీ అర్ధం తెలీక తికమక పడేదాన్ని. భారీ వర్షం అంటే ఇందృడి భార్య శచీ దేవి కుర్పించే వర్షం అని అర్ధం అయింది గానీ - ఈ స్విస్ బాంకు అంటే ఏమిటో తెలిసేది కాదు. ఈ లాజిక్ కి వెనుక వాళ్ళు భార్య వర్షం అనే అంటున్నారేమో గానీ అది నాకు భారీ అని వినిపిస్తోంది లే అని ఖచ్చితంగా నమ్మకం వుండేది.
నేను పోయినేడు జెనీవ్, బెర్న్ ల లో తిరిగినపుడు అక్కడక్కడా యూ బీ ఎస్ బాంకు బిల్డింగ్ ఎదురయేది. అప్పటికి పేరు తెలిసిన ఏకైక & ప్రముఖమైన బాంకు కాబట్టి గుర్తుపట్టి.. మేమిద్దరం - ఆహా ఎంత డబ్బు ఉంటుంది కదా.. మన సినిమా వాళ్ళ, రా.నా. ల, గాంగుస్టర్ల డబ్బల్లా ఇక్కడే కదా ఉండేది - అని అబ్బురపడ్డాం. ఇలాంటి సందర్భం లోనే, నా మెదడు లో చిలిపి Cells జెఫ్ఫెరీ ఆర్చర్ రాసిన Twist in the Tale కధల సంపుటి లోని ఒక కధను గుర్తు చేసేయి.
మొంబాసా అనే ఆఫ్రికన్ సామ్రాజ్యం ఒకటి ఉంటుంది. (పై పై న కధ చెప్తున్నా..) ఇక్కడ ప్రభుత్వం లో అందరూ తీవ్రంగా అవినీతిపరులు. పాపం అధ్యక్షుడు ఎంత ఆ దేశాన్ని అభివృద్ధిపదం లో కి తీస్కెళ్దామని ఎత్తులు వేసినా, ఈ అవినీతిపర అధికార యంత్రాంగం అంతకు పై ఎత్తులు వేసి, కనబడిన రూపాయినల్లా (వాళ్ళ రూపాయి) కబ్జా చేసేసేది. అధ్యక్షుడికి ఈ డబ్బంతా, స్విస్సు బాంకుల్లో మూలుగుతోందని తెలుసు - అచ్చం ఇపుడు అద్వానీ గారికి వచ్చిన అవిడియాలాంటిదే ఆయనకీ వస్తుంది. అంటే ఎవరెవరికి ఎంత సొమ్ముందో కనీసం ఆ బాంకు వాళ్ళనడిగి తెలుసుకుని, ఆయా అధికారులను దండించో, అదిరించో, బెదిరించో ఆ డబ్బుని మొంబాసా కి తెప్పించుకోవాలి. అపుడే అవినీతీ అరికట్టబడుతుంది, రూపాయలతో దేశమూ బాగుపడుతుంది - అని ఆయన ప్లాన్.
అయితే, ఆయనకి అడుగడుగునా శత్రువులే. ఈ పనిని తానై స్వయంగా చేయలేడు. కాబట్టి ఒక నమ్మకమయిన అధికారి కావాలి. అపుడు హీరో ని పట్టుకుంటాడు. ఈ నవ యువకుడు - ఇంగ్లండు లోనీ, అమెరికాలోనీ చదువుకుని, దేశాన్ని పైకి తీసుకురావాలనే తపన తో వచ్చినవాడు. ప్రభుత్వం లో చేరి, తన నిజాయితీ తో, నిష్పాక్షికత తో, ఖచ్చితత్వంతో అందరి దృష్టినీ (చివరికి అధ్యక్షుల దృష్టినీ..) ఆకర్షిస్తాడు.
ఆయన మీద అధ్యక్షుని నమ్మకం పెరుగుతుంది. ఇక రకరకాల ప్రాజెక్టులకూ, పనులకూ అతన్నే పర్యవేక్షకుని గా నియమిస్తాడు. కొన్నాళ్ళకు ఎలా అవుతుందంటే, ఈ యువకుడు చెప్తే కానీ మొంబాసా లో ఆకు కూడా కదలడానికి వీలు లేదు. దేశంలో అవినీతి తగ్గలేదు కానీ బహిరంగత్వం తగ్గింది. విచ్చలవిడి అవినీతి స్థానంలో 'ఉస్ష్ ..గప్ చుప్ అవినీతి ' బయల్దేరింది. అధ్యక్షుడికి అంతా బానే ఉంది గానీ ఈ తెర వెనుక అవినీతి నచ్చలేదు. ఆయన కి తన ప్లాను గుర్తొచ్చి ఈ కుర్రాడితో డిస్కసన్ పెడతాడు. అయ్యవారి ఆదేశాల మీదను కుర్రాడు తన తెలివితేటలన్నీ ఉపయోగించి, రక రకాల స్విస్ బాంకుల్లో అకౌంట్లున్న మొంబాసా వాసుల లిస్టు ఒకటి తయారు చేస్తాడు. ఇంక స్విజ్జర్లాండు వెళ్ళి బాంకు ల లో ఇంకొన్ని వివరాలు సేకరించడమూ, అధికారికంగా అధ్యక్షులవారి విన్నపాన్ని విన్నవించడమూనే మిగిలి వుంది.
ఇలా ఈ బాంకుల్లో డబ్బు దాచుకోవడానికి - ఈ బాంకులు పాటించే నియమావళి కారణం. అవి పీక పోయినా సరే తమ కస్టమర్ల వివరాలను బయట పెట్టము అని ప్రమాణం చేసేస్తాయి. కేవలం ఈ నియమావళి వల్లనే స్విజ్జర్లాండు లో ఆయా బాంకుల్లో ఆయా దేశాలనుంచీ పోగయ్యే ధనం ఉత్పత్తి చేసే లాభం ఆ దేశ జీ.డీ.పీ లో 12% ఉందంట ! అందుకే మరి - ఇదో విన్ - విన్ వ్యాపారం.
సరే మన వాడు అయ్యవారి అనుమతి తో, భార్యా, పిల్లలకు ఒక వారం పాటూ అమెరికా తిరిగొస్తానని చెప్పి, జెనీవా ప్రయాణం కడతాడు. (తన ప్రయాణం రహస్యం మరి !) జెనీవ్ లో దిగగానే హోటలు కెళ్ళి టిప్పు టాపు గా తయారయ్యి ఒక ప్రసిద్ధ బాంకు కు తను తయారు చేసిన లిస్టు పట్టుకుని వెళ్తాడు. మేనేజర్ ని కలుస్తానంటాడు. కారణం చెప్పడు. మేనేజరు కు తను మొంబాసా నుంచీ వచ్చిన రాయబారిననీ, అధ్యక్షుడిచ్చిన ఉత్తరం చూపించి, ఈ లిస్టూ చూపించి, ఎవరి ఖాతా లో ఎంత సొమ్ముందో చెప్పమంటాడు. సహజంగానే మేనేజరు ఒప్పుకోడు. గొడవ (వాదనలు) జరిగాకా, చైర్మెన్ ను కలుస్తారిద్దరూ. చైర్మను, ఈ అతిధి కి బ్రెమ్మాండంగా అతిధి మర్యాదలు చేస్తాడు గానీ ఈ విష్యాలు మాత్రం చెప్పనంటాడు. అది మా బాంకు పోలసీ గురూ - అని నచ్చ చెప్తాడు.
మన వాడు ఊరుకోడు. నేను రాయబారిని. మా అధ్యక్షుడి కి చెప్పి మీ దేశం తో మా దేశం చేసే బిజినెస్సునంతా (!!!!) ఆపు చేయించేస్తానంటాడు. మాకు ఫ్రాన్సు మిత్ర దేశం కాబట్టి ఫ్రాన్సు, స్విజ్జర్లాండుల మధ్య వ్యాపారం కూడా కట్టడి చేస్తానంటాడు. యూ.ఎన్.ఓ లో ఫిర్యాదు చేస్తానంటాడు.. అయినా చైర్మెన్ ఒప్పుకోడు. చివరికి తన కోటు చేబులోంచీ అకస్మాత్తుగా పిస్టలు తీసి చైర్మన్ నూ, మేనేజర్ నూ చంపేస్తానని బెదిరిస్తాడు. వాళ్ళు పాపం వొళ్ళంతా చెమటలు పట్టి, చావు భయంతో వొణికిపోతారు గానీ, ఈ రాయబారి గారి కోరిక తీర్చం అంటారు. ఏ.సే. (వేడి గది అనాలేమో) గది లో వాతావరణం అదుపు తప్పి వుంటుంది. బాంకు చైర్మను మతి పోయి వుంటుంది. మన యువకుడూ వొళ్ళెరగని కోపంలో వుంటాడు.. రెండు క్షణాలు గడుస్తాయి....
అప్పుడు మన వాడు 'ఎట్ ఈస్' లో నిల్చుని, టై వొదులు చేసి, తన తో పాటూ తీస్కొచ్చిన చెత్త సూట్కేసు తెరిచి చైర్మెను ముందు పెడతాడు. 'Well.. ఇంక నేను నిశ్ఛింతగా ఇక్కడ అకౌంటు ఓపెన్ చేస్కోవచ్చన్నమాట' అంటూ చైర్మెన్ ను చూసి అందంగా నవ్వుతాడు. ఇంతకీ ఆ సూట్కేసు (బ్రీఫ్ కేసు) లో కట్టల కొద్దీ కొన్ని కోట్ల విలువ చేసే కరెన్సీ ఉంటుంది.
ఇదీ కధ ! ఇపుడు అద్వానీ అడిగాడనో, జీ 20 లో పెద్ద వాళ్ళు తీర్మానించేరనీ - టెర్రరిస్టు లతో థ్రెట్ అనీ - ఇలా రక రకాల కారణాలకు స్విస్సు బాంకులు లొంగి తమ కస్టమర్ల గుట్టు విప్పాయనుకోండి - ఇలాంటి ట్విస్టే ఏదో ఎదురవ్వొచ్చు. వీ.డీ.ఎస్ లాంటి హాస్యస్ఫోరకమయిన అయిడియాలు, ఎలక్షన్లప్పుడు రా.నా.లు చెప్పే తమ తమ ఆదాయ వ్యయాల, ఆస్తిపాస్తుల వివరాలూ చూసి వాళ్ళ నిజాయితీ + సిగ్గులేని తనాన్ని చూసి నవ్వుకునే మనం, అప్పుడు హిందూజాల పేర్న ఇన్ని వేల కోట్లూ ఇంకా ఫలానా ఇంకోరి పేర్న ఉన్న ఇంకొన్ని కోట్ల కోట్లూ గురించి పేపర్లలో చదివి నవ్వుకుంటామో, నివ్వెరపోతామో చూడాలి. చివరికి బీ.జే.పీ ఆధ్వర్యంలో బోల్డంత కార్పొరేటైసేషను జరిగి ఇండియా వెలిగిపోయింది కాబట్టి భా.జ.పా నేతల పేర్లు కూడా బయటపడొచ్చు. అందుకే మేలో ఫలితాలు విడుదల అయ్యాకా - చాక్లెట్లకూ, కత్తులులకూ ఫేమస్ అయిన స్విజ్జర్లాండు మీద మన బడా నేతలు చాక్లెట్టు కత్తులు దూయటం తగ్గిపోతుంది. కాబట్టి ఇది ఎన్నికల స్టంటు మాత్రమే. అదీ ఇక్కడ Twist in the Tale.
చిన్నప్పుడు నేను రేడియోలో వాతారరణ సూచనలు వినేటపుడు 'భారీ వర్షం ' అనే పదానికీ, పేపరు చదివేటపుడు 'స్విస్ బాంకు ' అనే పదానికీ అర్ధం తెలీక తికమక పడేదాన్ని. భారీ వర్షం అంటే ఇందృడి భార్య శచీ దేవి కుర్పించే వర్షం అని అర్ధం అయింది గానీ - ఈ స్విస్ బాంకు అంటే ఏమిటో తెలిసేది కాదు. ఈ లాజిక్ కి వెనుక వాళ్ళు భార్య వర్షం అనే అంటున్నారేమో గానీ అది నాకు భారీ అని వినిపిస్తోంది లే అని ఖచ్చితంగా నమ్మకం వుండేది.
నేను పోయినేడు జెనీవ్, బెర్న్ ల లో తిరిగినపుడు అక్కడక్కడా యూ బీ ఎస్ బాంకు బిల్డింగ్ ఎదురయేది. అప్పటికి పేరు తెలిసిన ఏకైక & ప్రముఖమైన బాంకు కాబట్టి గుర్తుపట్టి.. మేమిద్దరం - ఆహా ఎంత డబ్బు ఉంటుంది కదా.. మన సినిమా వాళ్ళ, రా.నా. ల, గాంగుస్టర్ల డబ్బల్లా ఇక్కడే కదా ఉండేది - అని అబ్బురపడ్డాం. ఇలాంటి సందర్భం లోనే, నా మెదడు లో చిలిపి Cells జెఫ్ఫెరీ ఆర్చర్ రాసిన Twist in the Tale కధల సంపుటి లోని ఒక కధను గుర్తు చేసేయి.
మొంబాసా అనే ఆఫ్రికన్ సామ్రాజ్యం ఒకటి ఉంటుంది. (పై పై న కధ చెప్తున్నా..) ఇక్కడ ప్రభుత్వం లో అందరూ తీవ్రంగా అవినీతిపరులు. పాపం అధ్యక్షుడు ఎంత ఆ దేశాన్ని అభివృద్ధిపదం లో కి తీస్కెళ్దామని ఎత్తులు వేసినా, ఈ అవినీతిపర అధికార యంత్రాంగం అంతకు పై ఎత్తులు వేసి, కనబడిన రూపాయినల్లా (వాళ్ళ రూపాయి) కబ్జా చేసేసేది. అధ్యక్షుడికి ఈ డబ్బంతా, స్విస్సు బాంకుల్లో మూలుగుతోందని తెలుసు - అచ్చం ఇపుడు అద్వానీ గారికి వచ్చిన అవిడియాలాంటిదే ఆయనకీ వస్తుంది. అంటే ఎవరెవరికి ఎంత సొమ్ముందో కనీసం ఆ బాంకు వాళ్ళనడిగి తెలుసుకుని, ఆయా అధికారులను దండించో, అదిరించో, బెదిరించో ఆ డబ్బుని మొంబాసా కి తెప్పించుకోవాలి. అపుడే అవినీతీ అరికట్టబడుతుంది, రూపాయలతో దేశమూ బాగుపడుతుంది - అని ఆయన ప్లాన్.
అయితే, ఆయనకి అడుగడుగునా శత్రువులే. ఈ పనిని తానై స్వయంగా చేయలేడు. కాబట్టి ఒక నమ్మకమయిన అధికారి కావాలి. అపుడు హీరో ని పట్టుకుంటాడు. ఈ నవ యువకుడు - ఇంగ్లండు లోనీ, అమెరికాలోనీ చదువుకుని, దేశాన్ని పైకి తీసుకురావాలనే తపన తో వచ్చినవాడు. ప్రభుత్వం లో చేరి, తన నిజాయితీ తో, నిష్పాక్షికత తో, ఖచ్చితత్వంతో అందరి దృష్టినీ (చివరికి అధ్యక్షుల దృష్టినీ..) ఆకర్షిస్తాడు.
ఆయన మీద అధ్యక్షుని నమ్మకం పెరుగుతుంది. ఇక రకరకాల ప్రాజెక్టులకూ, పనులకూ అతన్నే పర్యవేక్షకుని గా నియమిస్తాడు. కొన్నాళ్ళకు ఎలా అవుతుందంటే, ఈ యువకుడు చెప్తే కానీ మొంబాసా లో ఆకు కూడా కదలడానికి వీలు లేదు. దేశంలో అవినీతి తగ్గలేదు కానీ బహిరంగత్వం తగ్గింది. విచ్చలవిడి అవినీతి స్థానంలో 'ఉస్ష్ ..గప్ చుప్ అవినీతి ' బయల్దేరింది. అధ్యక్షుడికి అంతా బానే ఉంది గానీ ఈ తెర వెనుక అవినీతి నచ్చలేదు. ఆయన కి తన ప్లాను గుర్తొచ్చి ఈ కుర్రాడితో డిస్కసన్ పెడతాడు. అయ్యవారి ఆదేశాల మీదను కుర్రాడు తన తెలివితేటలన్నీ ఉపయోగించి, రక రకాల స్విస్ బాంకుల్లో అకౌంట్లున్న మొంబాసా వాసుల లిస్టు ఒకటి తయారు చేస్తాడు. ఇంక స్విజ్జర్లాండు వెళ్ళి బాంకు ల లో ఇంకొన్ని వివరాలు సేకరించడమూ, అధికారికంగా అధ్యక్షులవారి విన్నపాన్ని విన్నవించడమూనే మిగిలి వుంది.
ఇలా ఈ బాంకుల్లో డబ్బు దాచుకోవడానికి - ఈ బాంకులు పాటించే నియమావళి కారణం. అవి పీక పోయినా సరే తమ కస్టమర్ల వివరాలను బయట పెట్టము అని ప్రమాణం చేసేస్తాయి. కేవలం ఈ నియమావళి వల్లనే స్విజ్జర్లాండు లో ఆయా బాంకుల్లో ఆయా దేశాలనుంచీ పోగయ్యే ధనం ఉత్పత్తి చేసే లాభం ఆ దేశ జీ.డీ.పీ లో 12% ఉందంట ! అందుకే మరి - ఇదో విన్ - విన్ వ్యాపారం.
సరే మన వాడు అయ్యవారి అనుమతి తో, భార్యా, పిల్లలకు ఒక వారం పాటూ అమెరికా తిరిగొస్తానని చెప్పి, జెనీవా ప్రయాణం కడతాడు. (తన ప్రయాణం రహస్యం మరి !) జెనీవ్ లో దిగగానే హోటలు కెళ్ళి టిప్పు టాపు గా తయారయ్యి ఒక ప్రసిద్ధ బాంకు కు తను తయారు చేసిన లిస్టు పట్టుకుని వెళ్తాడు. మేనేజర్ ని కలుస్తానంటాడు. కారణం చెప్పడు. మేనేజరు కు తను మొంబాసా నుంచీ వచ్చిన రాయబారిననీ, అధ్యక్షుడిచ్చిన ఉత్తరం చూపించి, ఈ లిస్టూ చూపించి, ఎవరి ఖాతా లో ఎంత సొమ్ముందో చెప్పమంటాడు. సహజంగానే మేనేజరు ఒప్పుకోడు. గొడవ (వాదనలు) జరిగాకా, చైర్మెన్ ను కలుస్తారిద్దరూ. చైర్మను, ఈ అతిధి కి బ్రెమ్మాండంగా అతిధి మర్యాదలు చేస్తాడు గానీ ఈ విష్యాలు మాత్రం చెప్పనంటాడు. అది మా బాంకు పోలసీ గురూ - అని నచ్చ చెప్తాడు.
మన వాడు ఊరుకోడు. నేను రాయబారిని. మా అధ్యక్షుడి కి చెప్పి మీ దేశం తో మా దేశం చేసే బిజినెస్సునంతా (!!!!) ఆపు చేయించేస్తానంటాడు. మాకు ఫ్రాన్సు మిత్ర దేశం కాబట్టి ఫ్రాన్సు, స్విజ్జర్లాండుల మధ్య వ్యాపారం కూడా కట్టడి చేస్తానంటాడు. యూ.ఎన్.ఓ లో ఫిర్యాదు చేస్తానంటాడు.. అయినా చైర్మెన్ ఒప్పుకోడు. చివరికి తన కోటు చేబులోంచీ అకస్మాత్తుగా పిస్టలు తీసి చైర్మన్ నూ, మేనేజర్ నూ చంపేస్తానని బెదిరిస్తాడు. వాళ్ళు పాపం వొళ్ళంతా చెమటలు పట్టి, చావు భయంతో వొణికిపోతారు గానీ, ఈ రాయబారి గారి కోరిక తీర్చం అంటారు. ఏ.సే. (వేడి గది అనాలేమో) గది లో వాతావరణం అదుపు తప్పి వుంటుంది. బాంకు చైర్మను మతి పోయి వుంటుంది. మన యువకుడూ వొళ్ళెరగని కోపంలో వుంటాడు.. రెండు క్షణాలు గడుస్తాయి....
అప్పుడు మన వాడు 'ఎట్ ఈస్' లో నిల్చుని, టై వొదులు చేసి, తన తో పాటూ తీస్కొచ్చిన చెత్త సూట్కేసు తెరిచి చైర్మెను ముందు పెడతాడు. 'Well.. ఇంక నేను నిశ్ఛింతగా ఇక్కడ అకౌంటు ఓపెన్ చేస్కోవచ్చన్నమాట' అంటూ చైర్మెన్ ను చూసి అందంగా నవ్వుతాడు. ఇంతకీ ఆ సూట్కేసు (బ్రీఫ్ కేసు) లో కట్టల కొద్దీ కొన్ని కోట్ల విలువ చేసే కరెన్సీ ఉంటుంది.
ఇదీ కధ ! ఇపుడు అద్వానీ అడిగాడనో, జీ 20 లో పెద్ద వాళ్ళు తీర్మానించేరనీ - టెర్రరిస్టు లతో థ్రెట్ అనీ - ఇలా రక రకాల కారణాలకు స్విస్సు బాంకులు లొంగి తమ కస్టమర్ల గుట్టు విప్పాయనుకోండి - ఇలాంటి ట్విస్టే ఏదో ఎదురవ్వొచ్చు. వీ.డీ.ఎస్ లాంటి హాస్యస్ఫోరకమయిన అయిడియాలు, ఎలక్షన్లప్పుడు రా.నా.లు చెప్పే తమ తమ ఆదాయ వ్యయాల, ఆస్తిపాస్తుల వివరాలూ చూసి వాళ్ళ నిజాయితీ + సిగ్గులేని తనాన్ని చూసి నవ్వుకునే మనం, అప్పుడు హిందూజాల పేర్న ఇన్ని వేల కోట్లూ ఇంకా ఫలానా ఇంకోరి పేర్న ఉన్న ఇంకొన్ని కోట్ల కోట్లూ గురించి పేపర్లలో చదివి నవ్వుకుంటామో, నివ్వెరపోతామో చూడాలి. చివరికి బీ.జే.పీ ఆధ్వర్యంలో బోల్డంత కార్పొరేటైసేషను జరిగి ఇండియా వెలిగిపోయింది కాబట్టి భా.జ.పా నేతల పేర్లు కూడా బయటపడొచ్చు. అందుకే మేలో ఫలితాలు విడుదల అయ్యాకా - చాక్లెట్లకూ, కత్తులులకూ ఫేమస్ అయిన స్విజ్జర్లాండు మీద మన బడా నేతలు చాక్లెట్టు కత్తులు దూయటం తగ్గిపోతుంది. కాబట్టి ఇది ఎన్నికల స్టంటు మాత్రమే. అదీ ఇక్కడ Twist in the Tale.
28/10/2008
మహిళలూ - పిల్లకాయలూ - ఉద్యోగాలూ !!
సిక్స్థ్ పే కమిషన్ రికమండేషన్స్ లో ఒక విషయం మీద నేనూ మా ఫ్రెండూ నిన్న రాత్రే వాదించుకున్నాం. వాదన అంటే పోట్లాట కాదు - ఒక విషయ విచారం అన్నమాట. అదేంటంటే మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం 6 నెల్ల జీతంతో సహా ప్రసూతి సెలవు ఇవ్వడంతో పాటూ, పూర్తి సర్వీసులో ఒక రెండేళ్ళపాటూ - పిల్లల సంరక్షణ సెలవులు తీసుకోవచ్చు. ఈ రెండేళ్ళూ, జీతం ఇస్తారు. నేను వావ్ అనుకున్నాను కానీ మా ఫ్రెండ్ కి కొన్ని అనుమానాలున్నాయి. ఆ అనుమానాలు విని నేనూ ఆశ్చర్యం లో పడ్డాను.
మా బేచ్ లో ఒక సఖి కి మొన్నీమధ్యే హీరో పుట్టేడు. అప్పుడే ఈ పే కమిషన్ ఔట్ అయింది. అరే వా.. నీకింక 6 నెల్లు సెలవు.. ఎంజాయ్! అని చెప్పేసుకున్నాం.
ఇది పర్లేదు కానీ, నా తో వాదించిన సఖి కి మాత్రం ఆ రెండేళ్ళ పెయిడ్ లీవ్ మీద కాస్త గుర్రు గా ఉంది.. ఎందుకని..? పిల్లల్ని పెంచడం కేవలం ఆడవాళ్ళ టెర్రిటరీ నా ? మగ వాళ్ళకి బాధ్యత ఉండదా ? ఈ అమ్మాయి కి కెరీర్ అక్కర్లేదా ? ఫిల్లల్ని కనడం, పెంచడమూనేనా ఆడ వాళ్ళ జీవితం ? ఈ సెలవుల్లో ఆమె ప్రమోషనూ, ఇంక్రెమెంట్లూ, బోనస్ లూ, లాంటివి మిస్ అయిపోతాయి కదా ? రెండేళ్ళ సెలవంటే ప్రమోషన్ అవకాశాలు ఖచ్చితంగా దెబ్బ తింటాయి కదా !! మగ వాళ్ళకు కూడా ఆ సెలవేదో ఒక ఏడాది ఇవ్వచ్చు కదా.. వారు కూడా పిల్లల్ని పెంచాలి కదా.. ఇలా బోల్డంత వాదించేసింది.
ఏమో.. ఈ ప్రశ్నల్లో కొన్ని పట్టున్నవే - ఆడ వాళ్ళకు ఆడ వాళ్ళే శత్రువులంటారు. (మగ వాళ్ళకి మగ వాళ్ళూ శత్రువులు కానట్టు) అయితే, ఈ వాదన వల్ల నాలో కూడా కొన్ని ప్రశ్నలు పుట్టేయి. స్త్రీ వాదానికీ, స్త్రీత్వానికీ చాలా తేడా ఉంది. అతి వాదం, స్త్రీ నే ఎందుకు పిల్లల్ని కనాలి అని ఆలోచించలా చేస్తుంది. స్త్రీ వాదం - దాన్ని ఒక చాయిస్ లా చెయ్యాలని కోరుకుంటుంది. స్త్రీత్వం దాన్ని తన అస్థిత్వం లో భాగంగా వాదిస్తుంది. మన ఆలోచనల్లో అస్పష్టత ఎదురవుతున్నప్పుడు ఇలాంటి ప్రశ్నలు పుడతాయిగా..
నా అక్కయ్య ని చూస్తే పిల్లలూ - ఉద్యోగమూ అన్న సంగతి చాలా చికాకు కలిగించింది. ఈ ఉద్యోగం కోసం తను కనీసం 3 ఏళ్ళు రాత్రీ పగలూ కష్టపడి చదివింది. పెళ్ళి కి ముందు చాలా చాలెంజింగ్ గా ప్రిలిమినరీ, మెయిన్సూ రాసాక, పెళ్ళి అవ్వగానే ఇంటర్వ్యూ - ఉద్యోగం వచ్చాయి. కొడుకు పుట్టే సమయానికి రెస్పాన్సిబుల్ ఉద్యోగం లో ఇంకా ప్రొబేషనర్. అవతల ఆఫీసు నీ నిర్లక్షం చెయ్యకూడదు, ఇక్కడ కన్న కొడుకు ని కూడా జాగ్రత్త గా చూసుకోవాలి. ఉయ్యాల్లో పిల్లాడ్ని వొదిలి ఆఫీసుకి వెళ్ళడం, పాలు తాగాడో లేదో అని బెంగ పడటం, జ్వరం తొ ఉన్న కొడుకుని తలుచుకుని బాధ పడుతూ కేంపు కో, ట్రైయినింగ్ కో వెళ్ళడం.. హోం వర్క్ చేసాడో లేదో, తిన్నాడో, మట్టి లో ఆడు కుంటున్నాడో అని మధనపడుతూ ఉద్యోగం చెయ్యడం, అక్కడ కూడా ఈ ఏకాగ్రత దెబ్బ తిని చిక్కుల్లో పడటం, ఎప్పటికప్పుడు, పిల్లాడికి జ్వరమనో, విరేచనాలనో - సెలవు పెట్టడం వల్ల, సుపీరియర్ లకు చులకన కావడం, ఇవన్నిటినీ అధిగమిస్తూ.. పిల్లాడికి త్వరగా ఒక 10 - 12 ఏళ్ళ వయసు రావాలని కోరుకోవడం తప్ప ఇంకేమీ చెయ్యలేక, ప్రస్తుతానికి ఈ సంసార రధాన్నీ, ఉద్యోగాన్నీ నెట్టుకొస్తూ ఉండటం చూస్తూ ఉండటం వల్ల - అమ్మో పిల్లలు !! అనుకున్నాను.
తను ఒంటి చేత్తో పిల్లాడ్ని పెంచుతూంది అని అనట్లేదు. కానీ పిల్ల వాడే ఆమె కు మెయిన్ ప్రయారిటీ. అందరు స్త్రీ ల లాగే తను తన కోసం కన్నా పిల్లాడి కోసమే బ్రతుకుతుంది. ఉద్యోగం చేసే మహిళలకు పిల్లకాయలు పెద్ద తంటానే. తలలో అస్తమానూ మెదిలేది వాళ్ళే. కొంచెం పెద్దయ్యే దాకా కొంచెం బెంగ, కొంచెం కన్సర్న్ ఉండనే ఉంటాయి. ఇది ... మానవ సహజం!!
కాబట్టి - నాకు ఈ రెండేళ్ళ సెలవు భలే మంచి అవకాశం గా అనిపించింది. ఇలాంటి లా బ్రిటన్ లో అమల్లో ఉంది. ఖచ్చితంగా ఇలానే కాదు - కానీ ఉంది. సో.. ఇది మనమే కొత్తగా కనిపెట్టినదేమీ కాదు.
అయితే ఇది స్త్రీ ల పట్ల ప్రభుత్వం.. స్వీట్ గా అమలు పరుస్తున్న వివక్షా లేక స్త్రీ ల మాతృత్వానికి వ్యవస్థ ఇస్తున్న ప్రాధాన్యమా ? లేక ఏ యునెస్కో నో తెచ్చిన ఒత్తిడి ఫలితమా ? ఇలాంటి అవకాశాలు ఇతర రంగాల్లో పని చేసే మహిళలకు కూడా ఇవ్వొచ్చా ? మహిళలకే ఎందుకివ్వాలి - పిల్లల్ని పెంచడం లో పురుషుల పాత్ర లేదా ? అందరికీ పిల్లని పెంచడం కోసం సెలవులిస్తూ పోతే దేశం ఏమి కావాలి ?
అసలే మహిళా ఉద్యోగులు సరిగ్గా పని (సరిగ్గా డ్రైవ్ చెయ్యరనీ.. కూడా) చెయ్యరని చెడ్డ పేరు (అన్ని నిజాలూ ఖచ్చితమైన నిజాలు కావు కదా)!! ఈ పిల్ల కాయల వల్ల పెట్టే సెలవులు ఇలా మహిళల స్థానాన్ని బలహీనపరుస్తాయా లేవా ? ఏమో !! ఏది వితండ వాదమో, ఏది సరైన ఆలోచనో అర్ధం అయ్యి చావట్లేదు. ఎవరన్నా కాస్త సాయం చేస్తారా ?
మా బేచ్ లో ఒక సఖి కి మొన్నీమధ్యే హీరో పుట్టేడు. అప్పుడే ఈ పే కమిషన్ ఔట్ అయింది. అరే వా.. నీకింక 6 నెల్లు సెలవు.. ఎంజాయ్! అని చెప్పేసుకున్నాం.
ఇది పర్లేదు కానీ, నా తో వాదించిన సఖి కి మాత్రం ఆ రెండేళ్ళ పెయిడ్ లీవ్ మీద కాస్త గుర్రు గా ఉంది.. ఎందుకని..? పిల్లల్ని పెంచడం కేవలం ఆడవాళ్ళ టెర్రిటరీ నా ? మగ వాళ్ళకి బాధ్యత ఉండదా ? ఈ అమ్మాయి కి కెరీర్ అక్కర్లేదా ? ఫిల్లల్ని కనడం, పెంచడమూనేనా ఆడ వాళ్ళ జీవితం ? ఈ సెలవుల్లో ఆమె ప్రమోషనూ, ఇంక్రెమెంట్లూ, బోనస్ లూ, లాంటివి మిస్ అయిపోతాయి కదా ? రెండేళ్ళ సెలవంటే ప్రమోషన్ అవకాశాలు ఖచ్చితంగా దెబ్బ తింటాయి కదా !! మగ వాళ్ళకు కూడా ఆ సెలవేదో ఒక ఏడాది ఇవ్వచ్చు కదా.. వారు కూడా పిల్లల్ని పెంచాలి కదా.. ఇలా బోల్డంత వాదించేసింది.
ఏమో.. ఈ ప్రశ్నల్లో కొన్ని పట్టున్నవే - ఆడ వాళ్ళకు ఆడ వాళ్ళే శత్రువులంటారు. (మగ వాళ్ళకి మగ వాళ్ళూ శత్రువులు కానట్టు) అయితే, ఈ వాదన వల్ల నాలో కూడా కొన్ని ప్రశ్నలు పుట్టేయి. స్త్రీ వాదానికీ, స్త్రీత్వానికీ చాలా తేడా ఉంది. అతి వాదం, స్త్రీ నే ఎందుకు పిల్లల్ని కనాలి అని ఆలోచించలా చేస్తుంది. స్త్రీ వాదం - దాన్ని ఒక చాయిస్ లా చెయ్యాలని కోరుకుంటుంది. స్త్రీత్వం దాన్ని తన అస్థిత్వం లో భాగంగా వాదిస్తుంది. మన ఆలోచనల్లో అస్పష్టత ఎదురవుతున్నప్పుడు ఇలాంటి ప్రశ్నలు పుడతాయిగా..
నా అక్కయ్య ని చూస్తే పిల్లలూ - ఉద్యోగమూ అన్న సంగతి చాలా చికాకు కలిగించింది. ఈ ఉద్యోగం కోసం తను కనీసం 3 ఏళ్ళు రాత్రీ పగలూ కష్టపడి చదివింది. పెళ్ళి కి ముందు చాలా చాలెంజింగ్ గా ప్రిలిమినరీ, మెయిన్సూ రాసాక, పెళ్ళి అవ్వగానే ఇంటర్వ్యూ - ఉద్యోగం వచ్చాయి. కొడుకు పుట్టే సమయానికి రెస్పాన్సిబుల్ ఉద్యోగం లో ఇంకా ప్రొబేషనర్. అవతల ఆఫీసు నీ నిర్లక్షం చెయ్యకూడదు, ఇక్కడ కన్న కొడుకు ని కూడా జాగ్రత్త గా చూసుకోవాలి. ఉయ్యాల్లో పిల్లాడ్ని వొదిలి ఆఫీసుకి వెళ్ళడం, పాలు తాగాడో లేదో అని బెంగ పడటం, జ్వరం తొ ఉన్న కొడుకుని తలుచుకుని బాధ పడుతూ కేంపు కో, ట్రైయినింగ్ కో వెళ్ళడం.. హోం వర్క్ చేసాడో లేదో, తిన్నాడో, మట్టి లో ఆడు కుంటున్నాడో అని మధనపడుతూ ఉద్యోగం చెయ్యడం, అక్కడ కూడా ఈ ఏకాగ్రత దెబ్బ తిని చిక్కుల్లో పడటం, ఎప్పటికప్పుడు, పిల్లాడికి జ్వరమనో, విరేచనాలనో - సెలవు పెట్టడం వల్ల, సుపీరియర్ లకు చులకన కావడం, ఇవన్నిటినీ అధిగమిస్తూ.. పిల్లాడికి త్వరగా ఒక 10 - 12 ఏళ్ళ వయసు రావాలని కోరుకోవడం తప్ప ఇంకేమీ చెయ్యలేక, ప్రస్తుతానికి ఈ సంసార రధాన్నీ, ఉద్యోగాన్నీ నెట్టుకొస్తూ ఉండటం చూస్తూ ఉండటం వల్ల - అమ్మో పిల్లలు !! అనుకున్నాను.
తను ఒంటి చేత్తో పిల్లాడ్ని పెంచుతూంది అని అనట్లేదు. కానీ పిల్ల వాడే ఆమె కు మెయిన్ ప్రయారిటీ. అందరు స్త్రీ ల లాగే తను తన కోసం కన్నా పిల్లాడి కోసమే బ్రతుకుతుంది. ఉద్యోగం చేసే మహిళలకు పిల్లకాయలు పెద్ద తంటానే. తలలో అస్తమానూ మెదిలేది వాళ్ళే. కొంచెం పెద్దయ్యే దాకా కొంచెం బెంగ, కొంచెం కన్సర్న్ ఉండనే ఉంటాయి. ఇది ... మానవ సహజం!!
కాబట్టి - నాకు ఈ రెండేళ్ళ సెలవు భలే మంచి అవకాశం గా అనిపించింది. ఇలాంటి లా బ్రిటన్ లో అమల్లో ఉంది. ఖచ్చితంగా ఇలానే కాదు - కానీ ఉంది. సో.. ఇది మనమే కొత్తగా కనిపెట్టినదేమీ కాదు.
అయితే ఇది స్త్రీ ల పట్ల ప్రభుత్వం.. స్వీట్ గా అమలు పరుస్తున్న వివక్షా లేక స్త్రీ ల మాతృత్వానికి వ్యవస్థ ఇస్తున్న ప్రాధాన్యమా ? లేక ఏ యునెస్కో నో తెచ్చిన ఒత్తిడి ఫలితమా ? ఇలాంటి అవకాశాలు ఇతర రంగాల్లో పని చేసే మహిళలకు కూడా ఇవ్వొచ్చా ? మహిళలకే ఎందుకివ్వాలి - పిల్లల్ని పెంచడం లో పురుషుల పాత్ర లేదా ? అందరికీ పిల్లని పెంచడం కోసం సెలవులిస్తూ పోతే దేశం ఏమి కావాలి ?
అసలే మహిళా ఉద్యోగులు సరిగ్గా పని (సరిగ్గా డ్రైవ్ చెయ్యరనీ.. కూడా) చెయ్యరని చెడ్డ పేరు (అన్ని నిజాలూ ఖచ్చితమైన నిజాలు కావు కదా)!! ఈ పిల్ల కాయల వల్ల పెట్టే సెలవులు ఇలా మహిళల స్థానాన్ని బలహీనపరుస్తాయా లేవా ? ఏమో !! ఏది వితండ వాదమో, ఏది సరైన ఆలోచనో అర్ధం అయ్యి చావట్లేదు. ఎవరన్నా కాస్త సాయం చేస్తారా ?
16/10/2008
శ్రీలంక - హా !
చాలా ముద్దొచ్చీసింది నాకీ వేళ జయలలిత స్టేట్మెంట్ చదివి. ఇప్పుడు దేశం అంతా వొళ్ళంతా చెవులు చేసుకుని సిగపట్లేసుకున్న ఇద్దరు అమ్మలిద్దరి గొడవా చూస్తూ... వింటూ ఉంటూండగా, ఇంకో పక్క ఇంకో గడ్డిపోచలమ్మ వీధి లో గొడవ పడుతూ ఉండగా, సాధారణంగా బేజారెత్తించే ఈ యమ్మి మాత్రం, మంచి తెలివైన మాట చెప్పింది.
అసలు శ్రీలంక అంతర్గత వ్యవహారాల్లో చెయ్యీ కాలూ ముక్కూ దూర్చడానికి మనమెవ్వరం ? ఒక టెర్ర్రరిస్టు / ఉగ్రవాద సంస్థ మీద ఒక దేశ ప్రభుత్వం అంత మంచి విజయం సాధించబోతూ ఉండగా, దాన్ని నిరోధించడానికి (వాళ్ళు ఎత్నిక్ గా తమిళులు కావడం వల్ల మాత్రమే) మనం ఎవరం ?
వీధుల్లో బాంబులు పేలడం, మనుషులు చావడం సాధారణం అయిపోతున్న మన దేశంలో, ఉగ్రవాదం - పచారీ కొట్లలో కూడా ఈసీ గా దొరుకుతున్నప్పుడు (మన దేశంలో తీవ్రవాదాన్ని ప్రచారం చెయ్యడం / మారణ హోమం సృష్టించడం, అతి సులభం) .. మన ముందున్న ముఖ్య శత్రువు తీవ్రవాదం. మనం తీవ్రవాదుల్ని ఏమీ చెయ్యం. ఇంకెవ్వర్నీ ఏమీ చెయ్యనివ్వం !
చేస్తే, మిత్ర పక్షాల వారికి అది ఒక సామాజిక వర్గాని టార్గెట్ చేసిన వేధింపు లా కనిపిస్తుంది. (Mulayam & Amar loves SIMI) అలా అయితే ఎలా ? శ్రీలంక లో ఇన్నాళ్ళకిన్నాళ్ళకి తీవ్రవాదానికి ప్రతిఘటన ఒక స్థాయి కి అంటూ చేరినపుడు, అందులో ప్రభుత్వ విజయ సూచనలు కనిపిస్తున్నపుడూ, ప్రభాకరన్ ఒత్తిళ్ళకు (సానుభూతితో నా ) ఈ తమిళ ముఠా అంతా, ప్రధాని మీద ఒత్తిడి తేవడం.. అన్యాయం. తెస్తే తెచ్చేరు - ఈయన ఎందుకు లొంగిపోవాలి ?
ప్రభాకరన్ ఇప్పుడు కలుగు లోంచీ బ్రతికి బయటకు వస్తే ఎలా విజృంభిస్తాడో, ఇంకెంత మందిని పొట్టనపెట్టుకుంటాడో - ఇంకెందరు తీవ్రవాదులకు సాయపడతాడో - ఈ విజయం కలిగించే పరిణామాలకు రక్షక దళాలకు ఎంత నైతిక మైన అస్థైర్యాన్ని ఇస్తుందో - ఎవరికన్నా ఆలోచన ఉందా ?
మన దేశంలో, మన వ్యవహారాల్లో ఇంకొకరు చెయ్యి దూరిస్తే మనం అందుకే చచ్చినట్టు ఊరుకుంటాం. అరుణాచల్ ప్రదేష్ మాది అని పైవారు అంటే - హీ హీ అని నవ్వుతాం. కాష్మీరు మాది అని ఇంకొకరు అంటే - చీ పో ! అని సిగ్గుపడతాం. ఇంక మనల్ని రోజుకోక చోట, పూటకొక రకంగా తీవ్రవాదం బెంబేలెత్తించకపోతే ఏమి చేస్తుంది ?
తీవ్రవాదానికి - అన్నట్టు ఇంతవరకూ బలవుతూంది సామాన్య ప్రజలే - మన దేశంలో - ఎవరన్నా పెద్దాయన, రాజకీయ నాయకుడో / స్థాయి పరంగా చూసుకుంటే, ఏ 'గాంధే'య వాదో చచ్చూరుకుంటే తప్ప, వ్యవస్థ లో చలనం ఉండదు. అప్పటివరకూ మనకి అందరూ 'బాగా' కావాల్సిన వాళ్ళే ! మా వాళ్ళ మీద చెయ్యి వేస్తే బావుండదండీ అని సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉండండి - మీ పీక నొక్కే వాడు మీ వెనకే తయారవుతాడు !
శ్రీ లంక లో వినిపిస్తున్న ఆ 'హా హా కారాలు ' ఇప్పుడు ప్రభాకరన్ నుంచీ వినిపిస్తున్నాయి. తమిళులు - చాందస వాదులూ - బుద్ధి హీనులూ - అతన్ని రక్షించాలని చూస్తూండడం చాలా అయోమయంగా వుంది. ఈ అయోమయంలో ఈ అమ్మి మాటలు విని అందుకే కొంచెం ముద్దొచ్చీసింది.
ఎవర్నీ వ్యతిరేకించడానికి అని కాదు గానీ.. ఒకరు తీవ్రవాదానికి వ్యతిరేకంగా పని చేస్తున్నప్పుడు, అది కాదండీ మాకు ప్రభాకరన్ బాగా కావల్సిన వాడు (తమిళుడు - కరుణానిధి గారి ప్రకారం) - వాడ్ని మీరు చంపకండీ అని బతిమలాడే మనం - రేప్పొద్దున్న మనల్ని పేలుచుకు చంపే తీవ్రవాదుల్ని పాకిస్తాను వాళ్ళు - ''స్వాతంత్ర పోరాట యోధులు'' అనకూడదని ఎలా డిమేండ్ చెయ్యగలం ?
అసలు శ్రీలంక అంతర్గత వ్యవహారాల్లో చెయ్యీ కాలూ ముక్కూ దూర్చడానికి మనమెవ్వరం ? ఒక టెర్ర్రరిస్టు / ఉగ్రవాద సంస్థ మీద ఒక దేశ ప్రభుత్వం అంత మంచి విజయం సాధించబోతూ ఉండగా, దాన్ని నిరోధించడానికి (వాళ్ళు ఎత్నిక్ గా తమిళులు కావడం వల్ల మాత్రమే) మనం ఎవరం ?
వీధుల్లో బాంబులు పేలడం, మనుషులు చావడం సాధారణం అయిపోతున్న మన దేశంలో, ఉగ్రవాదం - పచారీ కొట్లలో కూడా ఈసీ గా దొరుకుతున్నప్పుడు (మన దేశంలో తీవ్రవాదాన్ని ప్రచారం చెయ్యడం / మారణ హోమం సృష్టించడం, అతి సులభం) .. మన ముందున్న ముఖ్య శత్రువు తీవ్రవాదం. మనం తీవ్రవాదుల్ని ఏమీ చెయ్యం. ఇంకెవ్వర్నీ ఏమీ చెయ్యనివ్వం !
చేస్తే, మిత్ర పక్షాల వారికి అది ఒక సామాజిక వర్గాని టార్గెట్ చేసిన వేధింపు లా కనిపిస్తుంది. (Mulayam & Amar loves SIMI) అలా అయితే ఎలా ? శ్రీలంక లో ఇన్నాళ్ళకిన్నాళ్ళకి తీవ్రవాదానికి ప్రతిఘటన ఒక స్థాయి కి అంటూ చేరినపుడు, అందులో ప్రభుత్వ విజయ సూచనలు కనిపిస్తున్నపుడూ, ప్రభాకరన్ ఒత్తిళ్ళకు (సానుభూతితో నా ) ఈ తమిళ ముఠా అంతా, ప్రధాని మీద ఒత్తిడి తేవడం.. అన్యాయం. తెస్తే తెచ్చేరు - ఈయన ఎందుకు లొంగిపోవాలి ?
ప్రభాకరన్ ఇప్పుడు కలుగు లోంచీ బ్రతికి బయటకు వస్తే ఎలా విజృంభిస్తాడో, ఇంకెంత మందిని పొట్టనపెట్టుకుంటాడో - ఇంకెందరు తీవ్రవాదులకు సాయపడతాడో - ఈ విజయం కలిగించే పరిణామాలకు రక్షక దళాలకు ఎంత నైతిక మైన అస్థైర్యాన్ని ఇస్తుందో - ఎవరికన్నా ఆలోచన ఉందా ?
మన దేశంలో, మన వ్యవహారాల్లో ఇంకొకరు చెయ్యి దూరిస్తే మనం అందుకే చచ్చినట్టు ఊరుకుంటాం. అరుణాచల్ ప్రదేష్ మాది అని పైవారు అంటే - హీ హీ అని నవ్వుతాం. కాష్మీరు మాది అని ఇంకొకరు అంటే - చీ పో ! అని సిగ్గుపడతాం. ఇంక మనల్ని రోజుకోక చోట, పూటకొక రకంగా తీవ్రవాదం బెంబేలెత్తించకపోతే ఏమి చేస్తుంది ?
తీవ్రవాదానికి - అన్నట్టు ఇంతవరకూ బలవుతూంది సామాన్య ప్రజలే - మన దేశంలో - ఎవరన్నా పెద్దాయన, రాజకీయ నాయకుడో / స్థాయి పరంగా చూసుకుంటే, ఏ 'గాంధే'య వాదో చచ్చూరుకుంటే తప్ప, వ్యవస్థ లో చలనం ఉండదు. అప్పటివరకూ మనకి అందరూ 'బాగా' కావాల్సిన వాళ్ళే ! మా వాళ్ళ మీద చెయ్యి వేస్తే బావుండదండీ అని సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉండండి - మీ పీక నొక్కే వాడు మీ వెనకే తయారవుతాడు !
శ్రీ లంక లో వినిపిస్తున్న ఆ 'హా హా కారాలు ' ఇప్పుడు ప్రభాకరన్ నుంచీ వినిపిస్తున్నాయి. తమిళులు - చాందస వాదులూ - బుద్ధి హీనులూ - అతన్ని రక్షించాలని చూస్తూండడం చాలా అయోమయంగా వుంది. ఈ అయోమయంలో ఈ అమ్మి మాటలు విని అందుకే కొంచెం ముద్దొచ్చీసింది.
ఎవర్నీ వ్యతిరేకించడానికి అని కాదు గానీ.. ఒకరు తీవ్రవాదానికి వ్యతిరేకంగా పని చేస్తున్నప్పుడు, అది కాదండీ మాకు ప్రభాకరన్ బాగా కావల్సిన వాడు (తమిళుడు - కరుణానిధి గారి ప్రకారం) - వాడ్ని మీరు చంపకండీ అని బతిమలాడే మనం - రేప్పొద్దున్న మనల్ని పేలుచుకు చంపే తీవ్రవాదుల్ని పాకిస్తాను వాళ్ళు - ''స్వాతంత్ర పోరాట యోధులు'' అనకూడదని ఎలా డిమేండ్ చెయ్యగలం ?
27/07/2008
బాంబు దాడి సూచనలు
బెంగుళూరు, అహ్మెదాబాద్ లో జరిగిన బాంబు పేలుళ్ళు చాలా అన్యాయం. అహ్మెదాబాద్ లో హాస్పిటల్స్ దగ్గర పేలుళ్ళు మరీ అమానుషం. ఈ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ప్రజలు ఏమి చేస్తున్నారో, ఎలా అప్రమత్తంగా ఉండాలో పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తే బావుంటుంది. కారు పార్కింగ్ లో టికెట్లు ఇచ్చే అబ్బాయిలూ, వాచ్ మేన్లూ.. టీ దుకాణం వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండే లా ఏదయినా వర్క్ షాప్ దేశవ్యాప్తం గా నిర్వహించాలి.
ఈరోజు రేడియోలో వాతావరణ సూచనలు వింటూంటే, పనిలో పని గా.. దేశంలో ఎక్కడెక్కడ బాంబు పేలుళ్ళు జరగొచ్చో చెప్పేస్తే బావుణ్ణనిపించింది. విశాఖ లో తుఫాను హెచ్చరికల సమయంలో అప్పటికే సముద్రం లోకి వెళ్ళిన జాలర్ల సంగతి వొదిలేస్తే, రేడియో లో ఎంతో మంచి గొంతు ఒక్కటి మాత్రం - సముద్రం లోకి చేపలు పట్టడానికి వెళ్ళొద్దు నాయనలారా.. ఫలానా చోట 'అల్ప పీడన ద్రోణి ' ఉందంట బాబూ - అని చెప్పేస్తుంది. ఈ హెచ్చరికలు విన్నారా సరే ! లేదా పాపం జాలర్లు చాలా మంది ప్రతీ సారీ గల్లంతు అయిపోయే అవకాశాలుంటాయి !
అలానే, నిన్న అక్కయ్య, చెల్లెలూ, అమ్మా, నాన్నా, ఇతర బంధు గణాలూ.. ''అమ్మాయీ.. బోనాలూ బోనాలూ అంటూ వీధి లోకి వెళ్ళొద్దు తల్లీ.. హైదరాబాదు లో కూడా బాంబులు పేలొచ్చుట !'' అని హెచ్చరికలు జారీ చేసేరు.
భారత దేశం - అండర్ ఎటాక్ అంటూ టీవీ వాళ్ళూ ఫ్లాష్ వార్తలు ప్రకటిస్తున్నారు. కాబట్టి, ప్రజలారా, ఒక రెండు మూడు రోజులు జాగర్తగా ఉండండి.
.. ఈ అప్రమత్తత ఒకట్రెండు రోజులకో, ఒకరిద్దరో పాటించడం కాదు ! చెత్త ఏరుకునే పిల్లలు కూడా బాంబు అంటే ఏమిటో, ఎలా ఉంటుందో తెలుసుకుని, ప్రాణాలు రక్షించేలా అందరూ అప్రమత్తంగా ఉండాలి. తీవ్రవాదుల మీద మనమూ అప్రమత్తత పోరాటం మొదలు పెట్టాలి. నిర్లక్షం ఎంత మాత్రం వొద్దు !
ఇది ఈ యుగ ధర్మమేమో ! రోజూ వానొస్తుందా / ఎండ ఉంటుందా అని మాత్రమే కాకుండా.. బాంబు లూ, పేలుళ్ళూ కూడా మీ ఊర్లిలో లేదా మీరు రోజూ ఆఫీసుకెళ్ళే దారిలోనో ఉన్నయ్యేమో చూసుకోవాలి మరి ఇంక నుంచీ ! అందుకే మరి దీనికి 'బాంబు దాడి సూచనలు ' అంటూ ఏదో ఒక కార్యక్రమం ఉంటే బావుణ్ణు.
ఈరోజు రేడియోలో వాతావరణ సూచనలు వింటూంటే, పనిలో పని గా.. దేశంలో ఎక్కడెక్కడ బాంబు పేలుళ్ళు జరగొచ్చో చెప్పేస్తే బావుణ్ణనిపించింది. విశాఖ లో తుఫాను హెచ్చరికల సమయంలో అప్పటికే సముద్రం లోకి వెళ్ళిన జాలర్ల సంగతి వొదిలేస్తే, రేడియో లో ఎంతో మంచి గొంతు ఒక్కటి మాత్రం - సముద్రం లోకి చేపలు పట్టడానికి వెళ్ళొద్దు నాయనలారా.. ఫలానా చోట 'అల్ప పీడన ద్రోణి ' ఉందంట బాబూ - అని చెప్పేస్తుంది. ఈ హెచ్చరికలు విన్నారా సరే ! లేదా పాపం జాలర్లు చాలా మంది ప్రతీ సారీ గల్లంతు అయిపోయే అవకాశాలుంటాయి !
అలానే, నిన్న అక్కయ్య, చెల్లెలూ, అమ్మా, నాన్నా, ఇతర బంధు గణాలూ.. ''అమ్మాయీ.. బోనాలూ బోనాలూ అంటూ వీధి లోకి వెళ్ళొద్దు తల్లీ.. హైదరాబాదు లో కూడా బాంబులు పేలొచ్చుట !'' అని హెచ్చరికలు జారీ చేసేరు.
భారత దేశం - అండర్ ఎటాక్ అంటూ టీవీ వాళ్ళూ ఫ్లాష్ వార్తలు ప్రకటిస్తున్నారు. కాబట్టి, ప్రజలారా, ఒక రెండు మూడు రోజులు జాగర్తగా ఉండండి.
.. ఈ అప్రమత్తత ఒకట్రెండు రోజులకో, ఒకరిద్దరో పాటించడం కాదు ! చెత్త ఏరుకునే పిల్లలు కూడా బాంబు అంటే ఏమిటో, ఎలా ఉంటుందో తెలుసుకుని, ప్రాణాలు రక్షించేలా అందరూ అప్రమత్తంగా ఉండాలి. తీవ్రవాదుల మీద మనమూ అప్రమత్తత పోరాటం మొదలు పెట్టాలి. నిర్లక్షం ఎంత మాత్రం వొద్దు !
ఇది ఈ యుగ ధర్మమేమో ! రోజూ వానొస్తుందా / ఎండ ఉంటుందా అని మాత్రమే కాకుండా.. బాంబు లూ, పేలుళ్ళూ కూడా మీ ఊర్లిలో లేదా మీరు రోజూ ఆఫీసుకెళ్ళే దారిలోనో ఉన్నయ్యేమో చూసుకోవాలి మరి ఇంక నుంచీ ! అందుకే మరి దీనికి 'బాంబు దాడి సూచనలు ' అంటూ ఏదో ఒక కార్యక్రమం ఉంటే బావుణ్ణు.
18/07/2008
తీవ్రవాదం - IEDs-5
ఐ.ఈ.డీ ల లో వాడే రసాయనాలూ, పేలుడు పదార్ధాలు :-
ఈ బాంబులను తయారు చేయడానికి పెద్ద యెత్తున రక్షణ అవసరాలకు వాడే ఆర్.డీ.ఎస్, టీ.ఎన్.టీ వంటి పదార్ధాలను వివిధ కాంబినేషన్ ల లో వాడతారు. అంతే కాకుండా, గృహ, నిర్మాణ అవసరాలకు వాడే జెలిటెన్ స్టిక్స్, ఇళ్ళలొ తయారయ్యే మందుగుండు సామాగ్రి ఇంకా మార్కెట్ లో సులువు గా దొరికే అమ్మోనియం నైట్రేట్, సోడియం / పొటాషియం క్లోరైడ్, సల్ఫర్, అమ్మోనియం పఔడర్, షుగర్ పొటషియం / సోడియం నైట్రట్ మొదలైనవి కూడా వివిధ కాంబినేషన్ & నిష్పత్తు ల లో వాడ తారు.
నక్సలైట్లు ముఖ్యంగా కమర్షియల్ పేలుడు పదార్ధాలు వాడతారు - అవి ప్రధానంగా జిలెటన్ లేదా ఎ.ఎన్.ఎఫ్.ఒ (అమ్మొనియం నైట్రేట్ ఫ్యుఎల్ ఆయిల్) (ఫెర్టిలైసెర్ గ్రేడ్ అమ్మొనియం నైట్రేట్ మరియు డీసిల్ లేదా ఫ్యుఎల్ ఆయిల్ నుంచీ తీసిన పేలుడు పదార్ధం)
ఇప్పటి వరకు పేలిన బాంబులు లేదా దొరికిన పేలని బాంబులు (లైవ్ ఎక్స్ప్లోసివ్ లు) నుంచీ సేకరించిన సమాచారం ప్రకారం, తీవ్రవాదులు వాడే రసాయనాలు ఈ క్రింది విధంగా ఉంటాయి. (Combinations)
(1) ఆర్.డీ.ఎక్స్ & టి.ఎన్.టీ (సైక్లొటోల్)
(2) కేవలం ఆర్.డీ.ఎక్స్
(3) అమ్మోనియం నైట్రేట్ తో చేసే జిలెటెన్
(4) ఎ.ఎన్.ఎఫ్.ఓ (అమ్మొనియం నైట్రేట్ ఫ్యుఎల్ ఆయిల్)
(5) అమ్మొనియం నైట్రేట్ & అమ్మొనియం పౌడెర్
(6) పొటషియం క్లోరైడ్ & అమ్మొనియం పౌడెర్ + సల్ఫర్
మన రక్షణ కోసం మనం ఏమి చెయ్యగలం ?
ఇప్పటి వరకూ జరిగిన బాంబు దాడుల బట్టీ, తీవ్ర వాదులు ఎప్పటికప్పుడు తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ వస్తున్నారన్నది తెలుస్తున్నది.
అయితే, కేవలం సాంకేతికత మాత్రమే కాకుండా, వారి ఎక్సిక్యూషన్ కూడా కొత్త పుంతలు తొక్కుతున్నది. ఇంతకు ముందు వరకూ కేవలం కొందరు రాజకీయ నాయకులూ, దేశాధినేతలూ, పోలీసు, మిలిటరీ సిబ్బంది ని లక్ష్యంగా చేసుకుని జరిగిన పోరటం, మన వీధుల లోకీ, మన రైళ్ళ లోకీ చొచ్చుకు వచ్చింది. సాధారణ ప్రజలను, అదీ ఎక్కువ సంఖ్య లో పొట్టనపెట్టుకోవడం కొత్త లక్ష్యం గా మారింది.
ఈ ఐ.ఈ.డీ ల తయారీ, వాడకం ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ అయ్యే సోఫిస్టికేషన్ తో ఇబ్బడి ముబ్బడి గా తయారవటం మన ముందున్న ప్రధాన సమస్య.
అమెరికా లో సెప్తెంబర్ తొమ్మిది తరవాత ప్రజల్లో కలిగిన భయం.. వారి ని ప్రతీదీ అనుమానించేలా చేసి, సాధారణ జీవితాన్ని కాస్త ఇబ్బంది పెట్టిందంట. కానీ పెరిగిన సెక్యూరిటీ మీది అవగాహన, అప్పటి నుంచీ చాలా ప్రాణాలను కాపాడిందన్న సంగతి మర్చిపోకూడదు. ఒక తీవ్రవాది షూ బాంబు ద్వరా విమానాన్ని పేల్చి వెయ్యబోవడాన్ని ప్రయాణికులు అడ్డుకోవడం ఇందుకు మంచి ఉదాహరణ.
ఈ మధ్య కాలంలో కాబూల్ లో భారత రాయబార కార్యాలయం మీద జరిగిన అతి పెద్ద తీవ్రవాద దాడి కూడా ఒక సారి గుర్తు చేసుకోవాలి.
అప్పటి వరకూ అందిన ఇంటెలిజెన్స్ నివేదికల కారణంగా తీవ్ర వాద దాడి ని ఎదుర్కోవడానికి ఈ రాయబార కార్యాలయం చేపట్టిన చర్యల కారణంగా ఆ నిర్మాణానికి 100 కిలోల ఆర్.డీ.ఎక్స్ పేలుడు కు కూడా పెద్ద నష్టం జరగలేదు. పైగా, బ్రిగేడియర్, ఐ.ఎఫ్.ఎస్. అధికారి ప్రయాణిస్తున్న కారుని లోపలికి రానివ్వడానికి గేట్ ను తెరుస్తున్న సిబ్బంది, ఎలర్ట్ గా పని చెయ్యకపోతే, రాయబార కార్యాలయం మొత్తం ఈ పేలుడు కు కూలిపోయి ఉండేది. మన లో కూడా ఎలర్ట్ నెస్ ఉండాలి. ఈ ఆత్మాహుతి దాడి లో 54గురు ఆఫ్గన్లు, నలుగురు భారతీయులూ మరణించారు. కానీ తీవ్రవాదుల అసలు లక్ష్యం (సంఖ్యా పరంగా) ఇంకా చాలా ఎక్కువ.
కేవలం సమర్ధవంతమైన కట్టడి, విజిలెన్స్, ప్రజల్లో ఈ తీవ్రవాద పోకడలు, దాని వల్ల కలిగే ప్రమాదాల గురించి కాస్త సాధారణ పరిజ్ఞానం మాత్రమే మన పోరాట పద్ధతి. అనుమాస్పదమైన విషయాల్ని నిర్లక్ష్యం చెయ్యకపోవడం, నిర్లక్ష్య ధోరణి తగ్గించుకోవటం, సెక్యూరిటీ లాప్సెస్ కనిపిస్తే, అధికారులకు కంప్లైంట్ చెయ్యడం సెక్యూరిటీ చెక్ లకు సహకరించడం, సెక్యూరిటీ అంటే విసుక్కోకపోవటం, పోలీసు తో సహకరించడం మొదలయినవి మాత్రమే మన ప్రాణాలను కాపాడతాయి.
ఈ బాంబులను తయారు చేయడానికి పెద్ద యెత్తున రక్షణ అవసరాలకు వాడే ఆర్.డీ.ఎస్, టీ.ఎన్.టీ వంటి పదార్ధాలను వివిధ కాంబినేషన్ ల లో వాడతారు. అంతే కాకుండా, గృహ, నిర్మాణ అవసరాలకు వాడే జెలిటెన్ స్టిక్స్, ఇళ్ళలొ తయారయ్యే మందుగుండు సామాగ్రి ఇంకా మార్కెట్ లో సులువు గా దొరికే అమ్మోనియం నైట్రేట్, సోడియం / పొటాషియం క్లోరైడ్, సల్ఫర్, అమ్మోనియం పఔడర్, షుగర్ పొటషియం / సోడియం నైట్రట్ మొదలైనవి కూడా వివిధ కాంబినేషన్ & నిష్పత్తు ల లో వాడ తారు.
నక్సలైట్లు ముఖ్యంగా కమర్షియల్ పేలుడు పదార్ధాలు వాడతారు - అవి ప్రధానంగా జిలెటన్ లేదా ఎ.ఎన్.ఎఫ్.ఒ (అమ్మొనియం నైట్రేట్ ఫ్యుఎల్ ఆయిల్) (ఫెర్టిలైసెర్ గ్రేడ్ అమ్మొనియం నైట్రేట్ మరియు డీసిల్ లేదా ఫ్యుఎల్ ఆయిల్ నుంచీ తీసిన పేలుడు పదార్ధం)
ఇప్పటి వరకు పేలిన బాంబులు లేదా దొరికిన పేలని బాంబులు (లైవ్ ఎక్స్ప్లోసివ్ లు) నుంచీ సేకరించిన సమాచారం ప్రకారం, తీవ్రవాదులు వాడే రసాయనాలు ఈ క్రింది విధంగా ఉంటాయి. (Combinations)
(1) ఆర్.డీ.ఎక్స్ & టి.ఎన్.టీ (సైక్లొటోల్)
(2) కేవలం ఆర్.డీ.ఎక్స్
(3) అమ్మోనియం నైట్రేట్ తో చేసే జిలెటెన్
(4) ఎ.ఎన్.ఎఫ్.ఓ (అమ్మొనియం నైట్రేట్ ఫ్యుఎల్ ఆయిల్)
(5) అమ్మొనియం నైట్రేట్ & అమ్మొనియం పౌడెర్
(6) పొటషియం క్లోరైడ్ & అమ్మొనియం పౌడెర్ + సల్ఫర్
మన రక్షణ కోసం మనం ఏమి చెయ్యగలం ?
ఇప్పటి వరకూ జరిగిన బాంబు దాడుల బట్టీ, తీవ్ర వాదులు ఎప్పటికప్పుడు తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ వస్తున్నారన్నది తెలుస్తున్నది.
అయితే, కేవలం సాంకేతికత మాత్రమే కాకుండా, వారి ఎక్సిక్యూషన్ కూడా కొత్త పుంతలు తొక్కుతున్నది. ఇంతకు ముందు వరకూ కేవలం కొందరు రాజకీయ నాయకులూ, దేశాధినేతలూ, పోలీసు, మిలిటరీ సిబ్బంది ని లక్ష్యంగా చేసుకుని జరిగిన పోరటం, మన వీధుల లోకీ, మన రైళ్ళ లోకీ చొచ్చుకు వచ్చింది. సాధారణ ప్రజలను, అదీ ఎక్కువ సంఖ్య లో పొట్టనపెట్టుకోవడం కొత్త లక్ష్యం గా మారింది.
ఈ ఐ.ఈ.డీ ల తయారీ, వాడకం ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ అయ్యే సోఫిస్టికేషన్ తో ఇబ్బడి ముబ్బడి గా తయారవటం మన ముందున్న ప్రధాన సమస్య.
అమెరికా లో సెప్తెంబర్ తొమ్మిది తరవాత ప్రజల్లో కలిగిన భయం.. వారి ని ప్రతీదీ అనుమానించేలా చేసి, సాధారణ జీవితాన్ని కాస్త ఇబ్బంది పెట్టిందంట. కానీ పెరిగిన సెక్యూరిటీ మీది అవగాహన, అప్పటి నుంచీ చాలా ప్రాణాలను కాపాడిందన్న సంగతి మర్చిపోకూడదు. ఒక తీవ్రవాది షూ బాంబు ద్వరా విమానాన్ని పేల్చి వెయ్యబోవడాన్ని ప్రయాణికులు అడ్డుకోవడం ఇందుకు మంచి ఉదాహరణ.
ఈ మధ్య కాలంలో కాబూల్ లో భారత రాయబార కార్యాలయం మీద జరిగిన అతి పెద్ద తీవ్రవాద దాడి కూడా ఒక సారి గుర్తు చేసుకోవాలి.
అప్పటి వరకూ అందిన ఇంటెలిజెన్స్ నివేదికల కారణంగా తీవ్ర వాద దాడి ని ఎదుర్కోవడానికి ఈ రాయబార కార్యాలయం చేపట్టిన చర్యల కారణంగా ఆ నిర్మాణానికి 100 కిలోల ఆర్.డీ.ఎక్స్ పేలుడు కు కూడా పెద్ద నష్టం జరగలేదు. పైగా, బ్రిగేడియర్, ఐ.ఎఫ్.ఎస్. అధికారి ప్రయాణిస్తున్న కారుని లోపలికి రానివ్వడానికి గేట్ ను తెరుస్తున్న సిబ్బంది, ఎలర్ట్ గా పని చెయ్యకపోతే, రాయబార కార్యాలయం మొత్తం ఈ పేలుడు కు కూలిపోయి ఉండేది. మన లో కూడా ఎలర్ట్ నెస్ ఉండాలి. ఈ ఆత్మాహుతి దాడి లో 54గురు ఆఫ్గన్లు, నలుగురు భారతీయులూ మరణించారు. కానీ తీవ్రవాదుల అసలు లక్ష్యం (సంఖ్యా పరంగా) ఇంకా చాలా ఎక్కువ.
కేవలం సమర్ధవంతమైన కట్టడి, విజిలెన్స్, ప్రజల్లో ఈ తీవ్రవాద పోకడలు, దాని వల్ల కలిగే ప్రమాదాల గురించి కాస్త సాధారణ పరిజ్ఞానం మాత్రమే మన పోరాట పద్ధతి. అనుమాస్పదమైన విషయాల్ని నిర్లక్ష్యం చెయ్యకపోవడం, నిర్లక్ష్య ధోరణి తగ్గించుకోవటం, సెక్యూరిటీ లాప్సెస్ కనిపిస్తే, అధికారులకు కంప్లైంట్ చెయ్యడం సెక్యూరిటీ చెక్ లకు సహకరించడం, సెక్యూరిటీ అంటే విసుక్కోకపోవటం, పోలీసు తో సహకరించడం మొదలయినవి మాత్రమే మన ప్రాణాలను కాపాడతాయి.
15/07/2008
తీవ్రవాదం - IEDs - 4
అయితే, ఈ ఐ.ఈ.డీ లను ఎలా పేలుస్తారు ?
ఐ.ఈ.డీ లను తయారు చేయడంతో పాటూ, వాటి వాడకం లో కూడా సింపుల్ టెక్నాలజీ నే వాడతారు. ఈ ట్రిగ్గెరింగ్ మెకానిజం లలో కొన్ని రకాలుంటాయి.
1) టార్గెట్ చేతే ఆక్టివెట్ చెయ్యబడే బాంబులు /Anti-Handling
ప్రెషర్ రెలీస్ ట్రాప్ స్విచ్చు లను వీటిలో వాడతారు. అంటే, పోలీసులో, బాంబ్ స్క్వాడ్ వారో, బాంబు ను తెరవగానే, పెద్ద విస్ఫోటనం జరిగేలా వీటిని తయారు చేస్తారు. ఇలాంటి దాడులు జార్ఖండ్ లో జరిగాయి. పోలీసులు ఒక అనుమాస్పదమైన కేష్ బాక్స్ ను తెరవగానే, దానికున్న ట్రాప్ స్విచ్చు అందులో అమర్చిన బాంబ్ ను ఆక్టివేట్ చేసింది. అలానే, పస్చిమ బెంగాల్ లో కూడా ఒక పాల కేన్ (బాంబు, పాపం బాంబు స్క్వాడ్ సభుడు ఆ కేన్ మూత తెరవగానే పేలిపోయింది.
2) Timer mechanism
దీన్లో కూడా రకాలున్నాయి.
ప్రోగ్రాం చెయ్యగల టైమింగ్ డివైస్ లేదా ఎ.బీ.సీ.డీ టైమర్ ఒక రకం. ఇవి 1995 నుంచీ అందుబాటు లోకి వచ్చాయి. ఇవి ఎంత ఇంప్రూవ్ అయాయంటే, వీటిని దాడి కి 194 రోజుల, 11 గంటల 15 నిముషాల ముందు ఫిక్స్ చేసినా పని చేస్తాయి. (అంటే, అంత ముందే, టైం ను సెట్ చేసి, బాంబును సేఫ్ గా అమర్చి, వాడుకోవచ్చన్నమాట)
క్వార్జ్ లేదా డిజిటల్ అలార్మ్ క్లాక్ టైమెర్ ఇంకో రకం ! ఇవి బాంబు పేల వలసిన టైంకు అలార్మ్ బజర్ మోగడం ద్వారా బాంబులోని పేలుడు పదార్ధాన్ని పేల్చడానికి వాడతారు. సంఝౌతా ఎక్స్ ప్రెస్ లో ఇలాంటి టైమర్ ఉన్న ఐ.ఈ.డీ నే వాడారు.
సెల్ ఫోన్ టైమర్ : సెల్ ఫోన్ లో మోగే అలార్మ్ బజర్ ద్వారా కూడా ఐ.ఈ.డీ లోని డిటొనేటర్ ను ఆక్టివేట్ చేస్తారు. హైదరాబాద్ లోని మక్కా మసీదు, అజ్మీర్ షరీఫ్ దర్గా, హుబ్లీ కోర్టు లలో దీన్నే వాడారు.
3) రిమోట్ / రేడియో ద్వారా కంట్రోల్ చెయ్యగల మెకానిజం
నక్సలైట్ అన్నలు బాగా వాడే ఒక రకం వైర్ కంట్రోల్. లాండ్ మైన్ అమర్చిన తరవాత, లాండ్ మైన్ కు బాగా దూరంగా (సేఫ్ డిస్టెన్స్) కూర్చుని, ఒక కనిపించకుండా పాతిపెట్టిన వైర్ ద్వారా ఆ లాండ్ మైన్ కు పవర్ ను పంపించి, టార్గెట్ దాని మీదుగా పాస్ అవుతున్నపుడు పేలుస్తారు. ఈ వైరు పేల్చడానికి ఒక హెవీ డ్యూటీ కారు బేటరీ కావల్సొస్తుంది.
ఇంకో రకం వైర్ లెస్ లేదా రేడియో తరంగాల ద్వారా పేల్చడం : ఈ పద్ధతి జమ్మూ కాష్మీరు లో బాగా వాడుక లో ఉంది. వీటికి 3 DTMF కోడెడ్ రెసీవర్లూ, ఒక VHS ట్రాన్స్ మీటరూ వాడతారు. ఈ మధ్యే, సెల్ ఫోన్ల సహాయంతో ఇంకా దూరం నుంచీ ఈ లాండ్ మైన్లను వైర్ లెస్ తరంగాల ద్వారా ఆక్టివేట్ చేసి పేల్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఐ.ఈ.డీ లను తయారు చేయడంతో పాటూ, వాటి వాడకం లో కూడా సింపుల్ టెక్నాలజీ నే వాడతారు. ఈ ట్రిగ్గెరింగ్ మెకానిజం లలో కొన్ని రకాలుంటాయి.
1) టార్గెట్ చేతే ఆక్టివెట్ చెయ్యబడే బాంబులు /Anti-Handling
ప్రెషర్ రెలీస్ ట్రాప్ స్విచ్చు లను వీటిలో వాడతారు. అంటే, పోలీసులో, బాంబ్ స్క్వాడ్ వారో, బాంబు ను తెరవగానే, పెద్ద విస్ఫోటనం జరిగేలా వీటిని తయారు చేస్తారు. ఇలాంటి దాడులు జార్ఖండ్ లో జరిగాయి. పోలీసులు ఒక అనుమాస్పదమైన కేష్ బాక్స్ ను తెరవగానే, దానికున్న ట్రాప్ స్విచ్చు అందులో అమర్చిన బాంబ్ ను ఆక్టివేట్ చేసింది. అలానే, పస్చిమ బెంగాల్ లో కూడా ఒక పాల కేన్ (బాంబు, పాపం బాంబు స్క్వాడ్ సభుడు ఆ కేన్ మూత తెరవగానే పేలిపోయింది.
2) Timer mechanism
దీన్లో కూడా రకాలున్నాయి.
ప్రోగ్రాం చెయ్యగల టైమింగ్ డివైస్ లేదా ఎ.బీ.సీ.డీ టైమర్ ఒక రకం. ఇవి 1995 నుంచీ అందుబాటు లోకి వచ్చాయి. ఇవి ఎంత ఇంప్రూవ్ అయాయంటే, వీటిని దాడి కి 194 రోజుల, 11 గంటల 15 నిముషాల ముందు ఫిక్స్ చేసినా పని చేస్తాయి. (అంటే, అంత ముందే, టైం ను సెట్ చేసి, బాంబును సేఫ్ గా అమర్చి, వాడుకోవచ్చన్నమాట)
క్వార్జ్ లేదా డిజిటల్ అలార్మ్ క్లాక్ టైమెర్ ఇంకో రకం ! ఇవి బాంబు పేల వలసిన టైంకు అలార్మ్ బజర్ మోగడం ద్వారా బాంబులోని పేలుడు పదార్ధాన్ని పేల్చడానికి వాడతారు. సంఝౌతా ఎక్స్ ప్రెస్ లో ఇలాంటి టైమర్ ఉన్న ఐ.ఈ.డీ నే వాడారు.
సెల్ ఫోన్ టైమర్ : సెల్ ఫోన్ లో మోగే అలార్మ్ బజర్ ద్వారా కూడా ఐ.ఈ.డీ లోని డిటొనేటర్ ను ఆక్టివేట్ చేస్తారు. హైదరాబాద్ లోని మక్కా మసీదు, అజ్మీర్ షరీఫ్ దర్గా, హుబ్లీ కోర్టు లలో దీన్నే వాడారు.
3) రిమోట్ / రేడియో ద్వారా కంట్రోల్ చెయ్యగల మెకానిజం
నక్సలైట్ అన్నలు బాగా వాడే ఒక రకం వైర్ కంట్రోల్. లాండ్ మైన్ అమర్చిన తరవాత, లాండ్ మైన్ కు బాగా దూరంగా (సేఫ్ డిస్టెన్స్) కూర్చుని, ఒక కనిపించకుండా పాతిపెట్టిన వైర్ ద్వారా ఆ లాండ్ మైన్ కు పవర్ ను పంపించి, టార్గెట్ దాని మీదుగా పాస్ అవుతున్నపుడు పేలుస్తారు. ఈ వైరు పేల్చడానికి ఒక హెవీ డ్యూటీ కారు బేటరీ కావల్సొస్తుంది.
ఇంకో రకం వైర్ లెస్ లేదా రేడియో తరంగాల ద్వారా పేల్చడం : ఈ పద్ధతి జమ్మూ కాష్మీరు లో బాగా వాడుక లో ఉంది. వీటికి 3 DTMF కోడెడ్ రెసీవర్లూ, ఒక VHS ట్రాన్స్ మీటరూ వాడతారు. ఈ మధ్యే, సెల్ ఫోన్ల సహాయంతో ఇంకా దూరం నుంచీ ఈ లాండ్ మైన్లను వైర్ లెస్ తరంగాల ద్వారా ఆక్టివేట్ చేసి పేల్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
తీవ్ర వాదం - IEDs - 3
ఈ వాహనాలనే బాంబు లు గా వాడడం లో ఇంకో గమ్మత్తు ఉంది. (గమ్మత్తు అన్న పదం నిర్దాక్షిణ్యమే! క్షమించండి) ఈ వాహనం పేలుడు కు గురయ్యాక, దీని బాడీ ముక్కలు ముక్కలు గా చెదురుతుంది. ఈ ఇనుప ముక్కలు (Sharpnel) బాధితుల శరీరాల్లోకి చొచ్చుకుపోయి, తీవ్ర గాయం, రక్త స్రావం తద్వారా బాధితుల మృత్యువు కు దారి తీస్తాయి. పూర్వకాలం లో లాగా, బాంబు ల లో ఇనుప ముక్కలూ, మేకులూ కుక్కి, కష్టపడి తయారు చెయ్యనక్కర లేదు. తెలివి గా ఏ స్కూటర్ నో, కార్ నో, సైకిలు నో వాడితే, పేలుడు తరవాత, ఆ వాహనాల విడి ముక్కలే అధిక నష్టాన్ని కలిగిస్తాయి.
3) కంటైనెర్ ఐ.ఈ.డీలు
సినిమా హాళ్ళ లో, రద్దీ గా ఉండే మార్కెట్ లలో, టూరిస్ట్ స్పాట్ లలో, రైళ్ళ లో (public transport systems) కామన్ పీపుల్ (సామాన్య జనాన్ని) టార్గెట్ చెయ్యడానికి వాడతారు. ఈ బాంబులు సాధారణంగా ఆయా పరిసరాల్లోకి సరిపోయే విధంగా ఉండే కంటైనర్ ల (ప్రెషర్ కుక్కర్ లూ, సూట్ కేసులూ, ఏర్ బాగ్లూ లాంటివి) లో ఒక ఐరెన్ కేసింగ్ తో తీసుకుని వెళ్తారు. ఈ పద్ధతిని లక్నో లోని కోర్టు భవనం లోనూ, లాయర్ల చాంబర్ లోనూ ప్రయోగించారు. మన కళ్ళ ముందు ముంబాయి లోకల్ ట్రైన్ ల సీరియల్ దాడుల జ్ఞాపకం చెదిరిపోనేలేదు కదా ! ఈ దాడుల్లో ఈ ప్రెషర్ కుక్కర్ లనే వాడారు.
కంటైనర్ లంటే, కుక్కర్ లే కాకుండా, పాల కేన్లూ, టిఫిన్ బాక్సు లూ, కేరియర్లూ, ఘీ (నెయ్యి) డబ్బాలు, ట్రంక్ పెట్టెలు, ఆఖరికి ఎల్.పీ.జీ.సిలిండర్లు కూడా కావచ్చు.
కాబట్టి, ఎక్కడన్నా, అసాధారణంగా ఏదయినా బాగ్, బాక్స్ లేదా కనీసం టిఫిన్ బాక్స్ దొరికినా, కనిపించినా ప్రమాదమే అని తెలుసుకోవాలి.
4) మానవ బాంబు
మానవ బాంబు / ఆత్మాహుతి దాడి చాలా పోటెంట్ మెథడ్ గా పేరొందింది. పేలుడు పదార్ధాలను, (ఐ.ఈ.డీ లను) వొంటికి ధరించి, లేదా పోర్టబుల్ పేలుడు పదార్ధాలను వాహనం లో అమర్చి, ఆ వాహనాన్ని టార్గెట్ ను చేరేందుకు వాడుతూ టార్గెట్ దగ్గరకు పోయి, వాటిని పేల్చడం ద్వారా, టార్గెట్ కు ప్రాణ నష్టం కలిగించడం దీని ప్రధాన లక్షణం. వాయు మార్గం గుండా దాడి చెయ్యడం - (ఏరియల్ దాడి) కూడా ఆత్మ హత్యా సదృశ్యమే !
ఉదా : ఎల్.టీ.టీ.ఈ దాడులు
రాజీవ్ గాంధీ హత్య, బియాంత్ సింగ్ హత్య, మనకు మానవ బాంబులను పరిచయం చేసాయి. హైదరాబాదు లో ఎస్.టీ.ఎఫ్. ఆఫీసు మీద మానవ బాంబు దాడి గుర్తుందిగా. ఇలానే, మన పార్లమెంట్ మీద దాడి కూడా ఆత్మాహుతి దాడే ! ఈ దాడి లో తీవ్రవాదులు ప్రాణాలకు తెగించి పాల్గొన్నారు.
5) పార్సెల్ బాంబులు / లెటర్ బాంబులు
పార్సెల్ / లెటర్ లో టార్గెట్ కు బాంబు ను పంపాలంటే, సాధారణంగా ఐ.ఈ.డీ చాలా చిన్నదీ మరియూ శక్తి వంతమైనదీ అయి ఉండాలి. ఈ రకం బాంబులు ఐ.ఈ.డీ రకాన్ని బట్టీ నష్టాన్ని కలిగిస్తాయి. కేరళ లో 2006 లో ఇలాంటి బాంబులు కూడా పేలాయి. వీటిని సాధారణంగా లో ఇంటెన్సిటీ బాంబు దాడులు గా పరిగణిస్తారు.
3) కంటైనెర్ ఐ.ఈ.డీలు
సినిమా హాళ్ళ లో, రద్దీ గా ఉండే మార్కెట్ లలో, టూరిస్ట్ స్పాట్ లలో, రైళ్ళ లో (public transport systems) కామన్ పీపుల్ (సామాన్య జనాన్ని) టార్గెట్ చెయ్యడానికి వాడతారు. ఈ బాంబులు సాధారణంగా ఆయా పరిసరాల్లోకి సరిపోయే విధంగా ఉండే కంటైనర్ ల (ప్రెషర్ కుక్కర్ లూ, సూట్ కేసులూ, ఏర్ బాగ్లూ లాంటివి) లో ఒక ఐరెన్ కేసింగ్ తో తీసుకుని వెళ్తారు. ఈ పద్ధతిని లక్నో లోని కోర్టు భవనం లోనూ, లాయర్ల చాంబర్ లోనూ ప్రయోగించారు. మన కళ్ళ ముందు ముంబాయి లోకల్ ట్రైన్ ల సీరియల్ దాడుల జ్ఞాపకం చెదిరిపోనేలేదు కదా ! ఈ దాడుల్లో ఈ ప్రెషర్ కుక్కర్ లనే వాడారు.
కంటైనర్ లంటే, కుక్కర్ లే కాకుండా, పాల కేన్లూ, టిఫిన్ బాక్సు లూ, కేరియర్లూ, ఘీ (నెయ్యి) డబ్బాలు, ట్రంక్ పెట్టెలు, ఆఖరికి ఎల్.పీ.జీ.సిలిండర్లు కూడా కావచ్చు.
కాబట్టి, ఎక్కడన్నా, అసాధారణంగా ఏదయినా బాగ్, బాక్స్ లేదా కనీసం టిఫిన్ బాక్స్ దొరికినా, కనిపించినా ప్రమాదమే అని తెలుసుకోవాలి.
4) మానవ బాంబు
మానవ బాంబు / ఆత్మాహుతి దాడి చాలా పోటెంట్ మెథడ్ గా పేరొందింది. పేలుడు పదార్ధాలను, (ఐ.ఈ.డీ లను) వొంటికి ధరించి, లేదా పోర్టబుల్ పేలుడు పదార్ధాలను వాహనం లో అమర్చి, ఆ వాహనాన్ని టార్గెట్ ను చేరేందుకు వాడుతూ టార్గెట్ దగ్గరకు పోయి, వాటిని పేల్చడం ద్వారా, టార్గెట్ కు ప్రాణ నష్టం కలిగించడం దీని ప్రధాన లక్షణం. వాయు మార్గం గుండా దాడి చెయ్యడం - (ఏరియల్ దాడి) కూడా ఆత్మ హత్యా సదృశ్యమే !
ఉదా : ఎల్.టీ.టీ.ఈ దాడులు
రాజీవ్ గాంధీ హత్య, బియాంత్ సింగ్ హత్య, మనకు మానవ బాంబులను పరిచయం చేసాయి. హైదరాబాదు లో ఎస్.టీ.ఎఫ్. ఆఫీసు మీద మానవ బాంబు దాడి గుర్తుందిగా. ఇలానే, మన పార్లమెంట్ మీద దాడి కూడా ఆత్మాహుతి దాడే ! ఈ దాడి లో తీవ్రవాదులు ప్రాణాలకు తెగించి పాల్గొన్నారు.
5) పార్సెల్ బాంబులు / లెటర్ బాంబులు
పార్సెల్ / లెటర్ లో టార్గెట్ కు బాంబు ను పంపాలంటే, సాధారణంగా ఐ.ఈ.డీ చాలా చిన్నదీ మరియూ శక్తి వంతమైనదీ అయి ఉండాలి. ఈ రకం బాంబులు ఐ.ఈ.డీ రకాన్ని బట్టీ నష్టాన్ని కలిగిస్తాయి. కేరళ లో 2006 లో ఇలాంటి బాంబులు కూడా పేలాయి. వీటిని సాధారణంగా లో ఇంటెన్సిటీ బాంబు దాడులు గా పరిగణిస్తారు.
14/07/2008
తీవ్రవాదం - IEDs - 2
ఒక చోట బాంబు పేలుడు జరగ గానే, అది తీవ్ర వాదుల దాడి అని నిర్ధారణకు రావడం వెంటనే జరిగినా, అది ఏ తీవ్రవాద సంస్థ చేసిందో వెంటనే కనిపెట్టలేక పోవడానికి ముఖ్య కారణం - ఇమిటేషన్. ఒక సారి ఒక బాంబు దాడి సఫలం అయ్యాక, ఒక సంస్థ అదే రీతి లో (అవే బాంబులూ, పద్ధతులూ ఉపయోగిస్తూ) దాడి చెయ్యొచ్చు. కానీ చాలా కేసుల లో, ఒకే పద్ధతిని వేరే వేరే తీవ్ర వాద సంస్థలు అనుకరిస్తాయి. అందుకే, బాంబు పేలుడు మేమే చేసామని ఆయా సంస్థలు ప్రకటించే వరకూ ఫలానా సంస్థే చేసిందని పోలీసులు నిర్ధారణగా చెప్పలేరు.
ఇంకో భయంకరమైన విషయం ఏమిటంటే, పోలీసుల / దర్యాప్తు సంస్థల వద్ద, ఎప్పటి కప్పుడు మారిపోతుండే కొత్త ఐ.ఈ.డీ ల సాంకేతిక పరిజ్ఞానం గురించి ముందస్తు సమాచారం ఏమీ వుండదు. పైగా, పేలుడు జరిగాకా.. పేలుడు ఏ పదార్ధం తో జరిగిందో తెలుసుకునేసరికే తాతలు తిరిగి వస్తారు. ఇది పెద్ద టైం వేస్ట్ వ్యవహారం. కానీ ఇదే పోలీసులకు దొరికే ముఖ్యమైన నోట్స్. ఎందుకంటే, దీని ద్వారానే, తీవ్రవాదుల పేలుడు కు ఉపయోగించే పద్దతి మీద అవగాహన వస్తుంది. అంతే.
అందుకే, ఇప్పటి దాకా జరిగిన పేలుళ్ళూ, దాడుల ఆధారంగా పేలుడు కు ఉపయోగించిన పద్దతులూ, పరికరాలూ - అంటూ ఒక సామాన్య పరిజ్ఞానం అందుబాటు లో ఉంది. ముఖ్యంగా ఐ.ఈ.డీ లలో రకాలూ ఈ కింది విధంగా ఉంటాయి.
1) లాండ్ మైన్లు / భూమి లో పాతి పెట్ట బడ్డ ఐ.ఈ.డీ లు
ఈ లాండ్ మైన్లు నక్సలైట్ల హాట్ ఫేవరేట్ బాంబులు. వీటి ద్వారా, పోలీసులూ, వీ.ఐ.పీలను తుదముట్టించడం చాలా విరివిగా జరిగింది. ఇవి ప్రాధమికంగా, వైర్ లెస్ పరిజ్ఞానంతో తయారవుతాయి. కేమెరా ఫ్లాష్ ద్వారా ట్రిగ్గెర్ చెయ్యబడతాయి. వీటిని, సాధారణంగా, వాహనం లో ప్రయాణిస్తున్న వారి మీద దాడి చెయ్యడానికి వాడతారు. సెమీ-మెటల్ రోడ్లు, కచ్చా రోడ్లు, కల్వర్టులు, రైల్ రోడ్ క్రాసింగ్లూ, నదీ తీరాలు, రోడ్డు మలుపులు లాంటి, ఎక్కడ వాహనం వేగం బాగా తగ్గించి నడపాలో అక్కడ, అమర్చుతారు. వాహనం వేగం తక్కువ గా ఉన్నప్పుడు, ఖచ్చితంగా పేలుడు జరపొచ్చు, ఎక్కువ ప్రాణ నష్టం కలిగించ వచ్చు. అయితే, ఈ పద్ధతి లో, ఇలా, దాడి చెయ్యడానికి ఎంచుకునే ప్రదేశానికి ఒక ఫీచర్ ఉండి, కొంత లో కొంత అయినా మనం అప్రమత్తం అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే, జనార్ధన రెడ్డి, చంద్రబాబు నాయుడు లాంటి అదృష్టవంతులు, వెంట్రుక వాశిలో మృత్యువు ను మోసం చేసేసారు.
అయితే, అందరూ అదృష్టవంతులు కాలేరు గా. అందుకే, చాలా మంది పోలీసు అధికారులూ, వారితో పాటూ ప్రయాణిస్తున్న సివిలియన్లు (పౌరులు) కూడా ఎన్నో సార్లు మృత్యువాత పడ్డారు. ఉదా : చత్తీస్ గడ్ లోని దంతేవాడా లో 100 కిలోల పేలుడు పదార్ధాలు అమర్చి, పేల్చిన లాండ్ మైన్, (2005 లో) పోలీసులు ప్రయాణిస్తున్న వాహనాన్ని తునాతునకలు చేసింది. ఈ దాడిలో వాహనం లో ఉన్న 27 మంది లో 24గురు అక్కడి కక్కడే చనిపోయారు.
2) వాహనం లేదా సైకిలుకు అమర్చిన ఐ.ఈ.డీ లు.
వాహనాలను బాంబులనూ, పేలుడు పదార్ధాలను ఒక ప్రదేశాన్నించీ, వేరొక ప్రదేశానికి రవాణా చెయ్యడానికి వాడటం ముందు నుంచీ ఉన్నదే. కానీ ఈ వాహనాలనే, పేలుడు కు ఉపయోగించడం, ఇంకొక పద్ధతి. బొంబాయి పేలుళ్ళు వీటికి ఉదాహరణ. అసలు ఈ ట్రెండ్ 1920 లో ఒక ఇటాలియన్ తీవ్రవాది న్యూయార్క్ లో వాల్ స్ట్రీట్ లో జె.పీ. మోర్గన్ వాళ్ళ ఆఫీసు దగ్గరకి ఒక పేలుడు పదార్ధాలు నింపిన గుర్రపు బగ్గీ ని తోలుకు వచ్చి, పేల్చెయ్యడం తో మొదలయ్యింది. ఈ దాడి లో, 40 మంది మరణించారు.
ఇరాక్, ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్ లలో కూడా ఈ పద్ధతి చాలా వాడబడుతుంది. రక్షక బలగాల కాన్వాయ్ కి దగ్గరగా ఒక బాంబ్ లు నింపిన వాహనాన్ని పార్క్ చేసి, కాన్వాయ్ సమీపిస్తుండగా పేల్చడం (రోడ్ సైడ్ పార్క్ చేసిన కారు బాంబులు), తద్వారా, సైనికులకు ఎక్కువ హాని కలిగించడం, దీని ముఖ్య ఉద్దేశ్యం.
వీటిల్లో, మన దేశంలో, ఎంతమాత్రం అనుమానం కలిగించని వాహనం సైకిలు. ఈ సైకిలు కే, బాంబులను ఏ బాగ్ లోనో ఉంచి, అమర్చి, రద్దీ గా ఉండే మార్కెట్ ఏరియాల్లో, గుళ్ళలో, ప్రార్ధనా స్థలాల దగ్గరా పార్క్ చేసి ఉంచడం; అదను చూసుకుని పేల్చడం కూడా ఈ మధ్య చాలా సక్సెస్ ఫుల్ గా తేలింది.
ఈ పద్ధతి / సైకిళ్ళ లో అమర్చ గల ఐ.ఈ.డీ లనే, ఈ మధ్య లక్నో, ఫైసాబాద్, వారణాసి ల సీరియల్ దాడులలో వాడారు. ఇలానే, గోరక్ పూర్ లో బాంబు దాడి కూడా నిర్వహించారు. 2008 లో జైపూర్ దాడుల లో వాడినవి కూడా, సైకిలు ఐ.ఈ.డీ లే.
ఇంకో భయంకరమైన విషయం ఏమిటంటే, పోలీసుల / దర్యాప్తు సంస్థల వద్ద, ఎప్పటి కప్పుడు మారిపోతుండే కొత్త ఐ.ఈ.డీ ల సాంకేతిక పరిజ్ఞానం గురించి ముందస్తు సమాచారం ఏమీ వుండదు. పైగా, పేలుడు జరిగాకా.. పేలుడు ఏ పదార్ధం తో జరిగిందో తెలుసుకునేసరికే తాతలు తిరిగి వస్తారు. ఇది పెద్ద టైం వేస్ట్ వ్యవహారం. కానీ ఇదే పోలీసులకు దొరికే ముఖ్యమైన నోట్స్. ఎందుకంటే, దీని ద్వారానే, తీవ్రవాదుల పేలుడు కు ఉపయోగించే పద్దతి మీద అవగాహన వస్తుంది. అంతే.
అందుకే, ఇప్పటి దాకా జరిగిన పేలుళ్ళూ, దాడుల ఆధారంగా పేలుడు కు ఉపయోగించిన పద్దతులూ, పరికరాలూ - అంటూ ఒక సామాన్య పరిజ్ఞానం అందుబాటు లో ఉంది. ముఖ్యంగా ఐ.ఈ.డీ లలో రకాలూ ఈ కింది విధంగా ఉంటాయి.
1) లాండ్ మైన్లు / భూమి లో పాతి పెట్ట బడ్డ ఐ.ఈ.డీ లు
ఈ లాండ్ మైన్లు నక్సలైట్ల హాట్ ఫేవరేట్ బాంబులు. వీటి ద్వారా, పోలీసులూ, వీ.ఐ.పీలను తుదముట్టించడం చాలా విరివిగా జరిగింది. ఇవి ప్రాధమికంగా, వైర్ లెస్ పరిజ్ఞానంతో తయారవుతాయి. కేమెరా ఫ్లాష్ ద్వారా ట్రిగ్గెర్ చెయ్యబడతాయి. వీటిని, సాధారణంగా, వాహనం లో ప్రయాణిస్తున్న వారి మీద దాడి చెయ్యడానికి వాడతారు. సెమీ-మెటల్ రోడ్లు, కచ్చా రోడ్లు, కల్వర్టులు, రైల్ రోడ్ క్రాసింగ్లూ, నదీ తీరాలు, రోడ్డు మలుపులు లాంటి, ఎక్కడ వాహనం వేగం బాగా తగ్గించి నడపాలో అక్కడ, అమర్చుతారు. వాహనం వేగం తక్కువ గా ఉన్నప్పుడు, ఖచ్చితంగా పేలుడు జరపొచ్చు, ఎక్కువ ప్రాణ నష్టం కలిగించ వచ్చు. అయితే, ఈ పద్ధతి లో, ఇలా, దాడి చెయ్యడానికి ఎంచుకునే ప్రదేశానికి ఒక ఫీచర్ ఉండి, కొంత లో కొంత అయినా మనం అప్రమత్తం అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే, జనార్ధన రెడ్డి, చంద్రబాబు నాయుడు లాంటి అదృష్టవంతులు, వెంట్రుక వాశిలో మృత్యువు ను మోసం చేసేసారు.
అయితే, అందరూ అదృష్టవంతులు కాలేరు గా. అందుకే, చాలా మంది పోలీసు అధికారులూ, వారితో పాటూ ప్రయాణిస్తున్న సివిలియన్లు (పౌరులు) కూడా ఎన్నో సార్లు మృత్యువాత పడ్డారు. ఉదా : చత్తీస్ గడ్ లోని దంతేవాడా లో 100 కిలోల పేలుడు పదార్ధాలు అమర్చి, పేల్చిన లాండ్ మైన్, (2005 లో) పోలీసులు ప్రయాణిస్తున్న వాహనాన్ని తునాతునకలు చేసింది. ఈ దాడిలో వాహనం లో ఉన్న 27 మంది లో 24గురు అక్కడి కక్కడే చనిపోయారు.
2) వాహనం లేదా సైకిలుకు అమర్చిన ఐ.ఈ.డీ లు.
వాహనాలను బాంబులనూ, పేలుడు పదార్ధాలను ఒక ప్రదేశాన్నించీ, వేరొక ప్రదేశానికి రవాణా చెయ్యడానికి వాడటం ముందు నుంచీ ఉన్నదే. కానీ ఈ వాహనాలనే, పేలుడు కు ఉపయోగించడం, ఇంకొక పద్ధతి. బొంబాయి పేలుళ్ళు వీటికి ఉదాహరణ. అసలు ఈ ట్రెండ్ 1920 లో ఒక ఇటాలియన్ తీవ్రవాది న్యూయార్క్ లో వాల్ స్ట్రీట్ లో జె.పీ. మోర్గన్ వాళ్ళ ఆఫీసు దగ్గరకి ఒక పేలుడు పదార్ధాలు నింపిన గుర్రపు బగ్గీ ని తోలుకు వచ్చి, పేల్చెయ్యడం తో మొదలయ్యింది. ఈ దాడి లో, 40 మంది మరణించారు.
ఇరాక్, ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్ లలో కూడా ఈ పద్ధతి చాలా వాడబడుతుంది. రక్షక బలగాల కాన్వాయ్ కి దగ్గరగా ఒక బాంబ్ లు నింపిన వాహనాన్ని పార్క్ చేసి, కాన్వాయ్ సమీపిస్తుండగా పేల్చడం (రోడ్ సైడ్ పార్క్ చేసిన కారు బాంబులు), తద్వారా, సైనికులకు ఎక్కువ హాని కలిగించడం, దీని ముఖ్య ఉద్దేశ్యం.
వీటిల్లో, మన దేశంలో, ఎంతమాత్రం అనుమానం కలిగించని వాహనం సైకిలు. ఈ సైకిలు కే, బాంబులను ఏ బాగ్ లోనో ఉంచి, అమర్చి, రద్దీ గా ఉండే మార్కెట్ ఏరియాల్లో, గుళ్ళలో, ప్రార్ధనా స్థలాల దగ్గరా పార్క్ చేసి ఉంచడం; అదను చూసుకుని పేల్చడం కూడా ఈ మధ్య చాలా సక్సెస్ ఫుల్ గా తేలింది.
ఈ పద్ధతి / సైకిళ్ళ లో అమర్చ గల ఐ.ఈ.డీ లనే, ఈ మధ్య లక్నో, ఫైసాబాద్, వారణాసి ల సీరియల్ దాడులలో వాడారు. ఇలానే, గోరక్ పూర్ లో బాంబు దాడి కూడా నిర్వహించారు. 2008 లో జైపూర్ దాడుల లో వాడినవి కూడా, సైకిలు ఐ.ఈ.డీ లే.
తీవ్ర వాదం - IEDs - 1
చాలా రోజులయింది ఏమైనా రాసి. అయితే ఈ సారి ఏదయినా కొత్త విషయం రాద్దామని అనిపించింది. తీవ్ర వాదం గురించి రాస్తే ఎలా ఉంటుంది అనిపించింది. మనకి మన ఏరియాలొ ఎక్కడన్నా బాంబు పేలి ఒక పది పదిహేనుగురు చనిపోతే గానీ.. ఈ టాపిక్ అంటే ఇష్టం ఉండదు. ఒక సారి బాంబు పేలి, ఎంతో ప్రాణ నష్టం కలిగాక.. మీడియా కెమెరాల మధ్య ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తూనే, మరుసటి రోజు, అదే పరిసరాల్లో, మన రొటీన్ జీవితం లోకి మెల్లగా జారిపోతాం.
మరి తీవ్ర వాదం అంటే ఏమిటి ? దీన్ని నిలువరించడానికి ఏమి చెయ్యాలి ? మనం మన ప్రశాంత మైన జీవితం లో మునిగి ఉండగా.. ఏదో ఒక దురదృష్టకరమైన క్షణం లో ముంచు కొచ్చే మృత్యువు తీవ్రవాదం ! ముఖ్యంగా మనలని భయోత్పాతానికి గురి చెయ్యడానికి దారుణ మారణ హేల ని రచించే ఉన్మాదమే తీవ్ర వాదం.
దీన్ని నిలువరించడానికి, ఈ సైద్ధాంతిక వైపరీత్యాన్ని తట్టుకోవడానికి, అసలు మన రక్షణ బలగాలకు దీని లోని లేటెస్ట్ పోకడ లు (ట్రెండ్ లు) తెలియాలి. సైద్దాంతిక వైరుధ్యాలని వెంటనే సరిదిద్దలేము. కానీ మన శత్రువుల (తీవ్ర వాదుల) బలా బలాలేమిటో, వారు అనుసరించే విధానాలేమిటో తెలుసుకుంటేనే కదా మనం వారిని ఎదుర్కోగలం !
రిపబ్లిక్ డే, స్వాతంత్ర్య దినోత్సవం లాంటి జాతీయ పర్వ దినాలు దగ్గర పడుతూండగా, డిల్లీ లో ప్రభుత్వ యంత్రాంగం ఎంత హడావుడి చేస్తుందో తెలుసా ? వార్తా పత్రికలలో, రోడ్ ల మైకు ల లోనూ.. అనుమానాస్పదమెదైనా, వ్యక్తి అయినా, బాగ్ అయినా వెంటనే పోలిసుల దృష్టి లోకి తీసుకు రమ్మని విజ్ఞప్తులూ, ఇంటికి అద్దెకి వచ్చే యువకుల, ఇంట్లోకి పనికి పెట్టుకునే వ్యక్తుల మీదా పోలీసు వెరిఫికెషన్ చేయించండంటూ ప్రకటనలూ, వెల్లువెత్తుతాయి. రైల్ స్తెషన్ లోనూ, రోడ్ ల మీదా అదనపు బలగాలు మోహరించి ఉంటాయి. హఠాత్తుగా ఇండియా గేట్ చుట్టూ రక్షణ వలయాలు ఏర్పడిపోతాయి. ఏదో సాయంత్రం ఐస్క్రీం తినడాంకి వెల్టే, నల్ల పిల్లి కమాండోలు జీప్ లో కూర్చుని పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ కనిపిస్తారు. ఇవన్నీ మనల్ని కాపాడడానికి ప్రభుత్వం చేసే ప్రయత్నాలు.
ఈ భయం దేనికి ? ఎవరి నుంచీ.. లాంటివన్నీ మనల్ని తీవ్రవాదాన్ని గురించి ఆలోచింప చేస్తాయి. తద్వారా, వారి సైద్ధంతిక వాదాల్ని బహిర్గతం చేస్తాయి. తీవ్రవాదం మామూలుగా మనల్ని భయపెట్టకపోను. కానీ బాంబులూ, ఐ.ఈ.డీ (Improvised Explosive Devices) లు లేకపోయి ఉంటే, మనం తీవ్రవాదాన్ని పెద్ద లెక్క చేసే వాళ్ళం కాదు. తీవ్రవాదం అంటే పోలీసులూ, తీవ్రవాదులకూ మధ్య ఏదో యుద్దం లే అనుకుని ఉండేవాళ్ళం. అందుకే, ఈ ఐ.ఈ.డీ లు ఇప్పటి తీవ్రవాదులకు మురిపెమైన ఆయుధాలు.
ఇప్పటి తీవ్రవాదులంతా, తెలివైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లూ.. రక రకాల సాంకేతిక రంగాలలో అత్భుత ప్రతిభ కలవాళ్ళూ కావడం ఈ ఐ.ఈ.డీ ల సృష్టి కీ, విస్తృత వాడకానికీ దారితీసింది. చవగ్గా, తేలికగా దొరికే రశాయనాలు, విడి భాగాలతో సులభంగా తయారయ్యే ఐ.ఈ.డీ లూ / బాంబులు అందుకే ఇప్పటి ఫేవరెట్ ట్రెండ్.
పైగా, ఈ కొత్త బాంబులతో నిక్కచ్చి గా దొరికే అత్భుత ఫలితాలు (ఎక్కువ సంఖ్య లో ప్రాణ నష్టం) రక్షణ బలగాలను తీవ్ర నిరాశ లోకి నెట్టేస్తాయి. (మొరేల్ దెబ్బ తీయడానికి బాగా ఉపయోగ పడుతుంది) వేరే వేరే తీవ్రవాద సంస్థలు ఈ విభాగంలో తమ తమ పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటాయి. (Like.. you have one Idea and I have one Idea, when we share them, we both will have two ideas each!)
ఇలా ఎప్పటికప్పుడు మంచి పరిజ్ఞానం తో ఐ.ఈ.డీలు విజృంభిస్తున్నాయి. అందుకే, వీటిలో కొన్ని రకాల గురించి నాకు తెలిసిన కాస్త జ్ఞానాన్ని పంచుదామని ఈ ప్రయత్నం.
మరి తీవ్ర వాదం అంటే ఏమిటి ? దీన్ని నిలువరించడానికి ఏమి చెయ్యాలి ? మనం మన ప్రశాంత మైన జీవితం లో మునిగి ఉండగా.. ఏదో ఒక దురదృష్టకరమైన క్షణం లో ముంచు కొచ్చే మృత్యువు తీవ్రవాదం ! ముఖ్యంగా మనలని భయోత్పాతానికి గురి చెయ్యడానికి దారుణ మారణ హేల ని రచించే ఉన్మాదమే తీవ్ర వాదం.
దీన్ని నిలువరించడానికి, ఈ సైద్ధాంతిక వైపరీత్యాన్ని తట్టుకోవడానికి, అసలు మన రక్షణ బలగాలకు దీని లోని లేటెస్ట్ పోకడ లు (ట్రెండ్ లు) తెలియాలి. సైద్దాంతిక వైరుధ్యాలని వెంటనే సరిదిద్దలేము. కానీ మన శత్రువుల (తీవ్ర వాదుల) బలా బలాలేమిటో, వారు అనుసరించే విధానాలేమిటో తెలుసుకుంటేనే కదా మనం వారిని ఎదుర్కోగలం !
రిపబ్లిక్ డే, స్వాతంత్ర్య దినోత్సవం లాంటి జాతీయ పర్వ దినాలు దగ్గర పడుతూండగా, డిల్లీ లో ప్రభుత్వ యంత్రాంగం ఎంత హడావుడి చేస్తుందో తెలుసా ? వార్తా పత్రికలలో, రోడ్ ల మైకు ల లోనూ.. అనుమానాస్పదమెదైనా, వ్యక్తి అయినా, బాగ్ అయినా వెంటనే పోలిసుల దృష్టి లోకి తీసుకు రమ్మని విజ్ఞప్తులూ, ఇంటికి అద్దెకి వచ్చే యువకుల, ఇంట్లోకి పనికి పెట్టుకునే వ్యక్తుల మీదా పోలీసు వెరిఫికెషన్ చేయించండంటూ ప్రకటనలూ, వెల్లువెత్తుతాయి. రైల్ స్తెషన్ లోనూ, రోడ్ ల మీదా అదనపు బలగాలు మోహరించి ఉంటాయి. హఠాత్తుగా ఇండియా గేట్ చుట్టూ రక్షణ వలయాలు ఏర్పడిపోతాయి. ఏదో సాయంత్రం ఐస్క్రీం తినడాంకి వెల్టే, నల్ల పిల్లి కమాండోలు జీప్ లో కూర్చుని పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ కనిపిస్తారు. ఇవన్నీ మనల్ని కాపాడడానికి ప్రభుత్వం చేసే ప్రయత్నాలు.
ఈ భయం దేనికి ? ఎవరి నుంచీ.. లాంటివన్నీ మనల్ని తీవ్రవాదాన్ని గురించి ఆలోచింప చేస్తాయి. తద్వారా, వారి సైద్ధంతిక వాదాల్ని బహిర్గతం చేస్తాయి. తీవ్రవాదం మామూలుగా మనల్ని భయపెట్టకపోను. కానీ బాంబులూ, ఐ.ఈ.డీ (Improvised Explosive Devices) లు లేకపోయి ఉంటే, మనం తీవ్రవాదాన్ని పెద్ద లెక్క చేసే వాళ్ళం కాదు. తీవ్రవాదం అంటే పోలీసులూ, తీవ్రవాదులకూ మధ్య ఏదో యుద్దం లే అనుకుని ఉండేవాళ్ళం. అందుకే, ఈ ఐ.ఈ.డీ లు ఇప్పటి తీవ్రవాదులకు మురిపెమైన ఆయుధాలు.
ఇప్పటి తీవ్రవాదులంతా, తెలివైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లూ.. రక రకాల సాంకేతిక రంగాలలో అత్భుత ప్రతిభ కలవాళ్ళూ కావడం ఈ ఐ.ఈ.డీ ల సృష్టి కీ, విస్తృత వాడకానికీ దారితీసింది. చవగ్గా, తేలికగా దొరికే రశాయనాలు, విడి భాగాలతో సులభంగా తయారయ్యే ఐ.ఈ.డీ లూ / బాంబులు అందుకే ఇప్పటి ఫేవరెట్ ట్రెండ్.
పైగా, ఈ కొత్త బాంబులతో నిక్కచ్చి గా దొరికే అత్భుత ఫలితాలు (ఎక్కువ సంఖ్య లో ప్రాణ నష్టం) రక్షణ బలగాలను తీవ్ర నిరాశ లోకి నెట్టేస్తాయి. (మొరేల్ దెబ్బ తీయడానికి బాగా ఉపయోగ పడుతుంది) వేరే వేరే తీవ్రవాద సంస్థలు ఈ విభాగంలో తమ తమ పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటాయి. (Like.. you have one Idea and I have one Idea, when we share them, we both will have two ideas each!)
ఇలా ఎప్పటికప్పుడు మంచి పరిజ్ఞానం తో ఐ.ఈ.డీలు విజృంభిస్తున్నాయి. అందుకే, వీటిలో కొన్ని రకాల గురించి నాకు తెలిసిన కాస్త జ్ఞానాన్ని పంచుదామని ఈ ప్రయత్నం.
12/07/2008
అణు ఒప్పందం - చిన్న వ్యాసం
అణు ఒప్పందం గురించి .. ఈనాడు లో ఒక చిన్న వ్యాసం. ఇంటరెస్ట్ ఉన్న వాళ్ళు, మిస్ అయిన వాళ్ళు, చదవొచ్చు.
04/07/2008
అంతర్జాతీయం - కొలంబియా లో అద్భుతం
రాంబో సినిమా మా టైం లో సూపర్ డూపర్ హిట్। అలాంటి సినిమా ఇంకోటి రాలేదు। ఈ రోజు న్యూస్ లో అలాంటి వొళ్ళు గగుర్పొడిచే వార్త ఉంది। కొలంబియా లో గత ఏడు సంవత్సరాలుగా గెరిల్లా ల (ఫార్క్ - రివల్యూషనరీ అర్మెడ్ ఫోర్సెస్ ఆఫ్ కొలంబియా ) బందీ గా ఉన్న నలభయ్యారెళ్ళ ఇంగ్రిడ్ బెంటాకోర్ట్ అనే ఆవిణ్ణి మరో పధ్నాలుగురు ముఖ్యమైన బందీల తో సహా ఆర్మీ విడిపించింది। ఈ ఆపరేషన్ లొ ఒక్క తుపాకీ గుండు పేలలేదు. ఒక్క రక్తపు బొట్టు చిందలేదు. ఇంగ్రిడ్ కొలంబియా అధ్యక్ష పదవికి పోటీ చేస్తుండగా ఆవిడని ఫిబ్రవరి 2002 లో ఫార్క్ కిడ్నాప్ చేసేసింది। అప్పణ్ణించీ బందీ గానే ఉన్న ఆమెను ఇతర బందీలు (అమెరికన్ కాంట్రాక్టర్లూ, కొలంబియా సైనికులూ, పోలీసులూ॥ )తొ సహా ఒక హెలికాప్టెర్ లో సినిమా లొ లాగా తీసుకుని వచ్చేసారుట। కొలంబియా అడవుల్లో ఈ బందీలందర్నీ ఎప్పటికప్పుడు షిఫ్ట్ చేస్తూ ఉండేవారు। ఇలా ఈ రోజు కూడా షిఫ్ట్ చేసే నెపంతో ఒక హెలికాప్టెర్ లో వచ్చిన కొందరు గొరిల్లాలు॥ (గొరిల్లాల వేషం లో ఉన్న యూ. ఎస్. సైనికులు) బందీలందర్నీ జనారణ్యం లోకి తీసుకు వచ్చేసారు. కొన్ని సంవత్సరాల పాటూ॥ తీవ్రవాదులలొ కలిసిపొయి, వారి కదలికలను కనిపెడుతూ।, సరైన ప్రణాళిక తో, సరైన సమయం లో సరైన నిర్ణయాలు తీసుకుంటూ॥ ప్రాణాలకు తెగించి చేసిన ఈ ఆపరేషన్ లో కొన్ని వందల మంది సైనికులూ, పోలీసులూ పాల్గొన్నారు। తీవ్రవాదులను మోసం చేసి, తీవ్రవాదుల వేషాల్లో ఉన్న సైనికులు తెలివి తేటల తో ఈ ఆపరేషన్ ను నిర్వహించారు.
ఇంగ్రిడ్ కిడ్నాప్ చాలా సంచలనం సృష్టించింది। వెనిజుయెలన్ ప్రెసిడెంట్ ఆమె విడుదల కై చాలా ప్రయత్నాలు చెస్తూండే వాడు। ఆయన చొరవ కారణంగా గత ఆరు నేలలలో ఫార్క్ ముఖ్యమైన కొందరు బందీలను విడుదల చేసింది। ఇంగ్రిడ్ మాత్రం విడుదల కాలేదు. ఇంగ్రిడ్ ను బలమైన పావుగా ఇన్నాళ్ళూ వాడుకున్న ఫార్క్ కు నడుము విరిగినట్టయింది. నిర్దాక్షిణ్యమైన కిడ్నాపులూ, హత్యలూ చేసే ఫార్క్ కు అచ్చం సినిమాల్లొ లాగా దెబ్బ తగిలింది.
హెలికాప్టెర్ లోకి బందీలు ఎక్కగా నేల మీద మిగిలిపొయిన నలభయి మంది తీవ్రవాదులను మాత్రం వొదిలేసారు. హెలికాప్టెర్ లో బందీలతో పాటూ ప్రయాణించిన ఇద్దరు గొరిల్లాలను కోర్టు ముందు ప్రవేశ పెడతారు. ప్రభుత్వం, అధ్యక్షుడు యురైబ్, సమర్ధవంతమైన అధికారులూ కలిసి అత్భుతంగా నిర్వహించిన ఈ ఆపరేషన్ చరిత్ర లో మిగిలిపోతుంది. తీవ్రవాదం తో నలిగిపోతున్న దేశం ఇలాంటి అహింసాత్మకమైన దాడి నిర్వహించడం, ఇప్పటి చరిత్రకు చెందని కరుణ చూపించడం ; గొరిల్లలను గొరిల్లా వ్యూహలతోనే ఎదుర్కోగలగడం, ఈ విజయానికున్న గొప్ప విషయాలు। క్షేమంగా బందీలను విడిపించడం తో పాటు, ఈ అత్భుతాన్ని సాధించాకా, నలభై ఏళ్ళ చరిత్ర గల ఫార్క్ కు అంత గట్టి దెబ్బ (బ్లో) ఇచ్చి, బలహీన పరిచి, ప్రభుత్వం వారిని చర్చలకు రమ్మంటుంది। మోత్తానికి ఏదో హాలీవుడ్ సినిమా చూసినట్టు అనిపించిందా ? కొలంబియా లో శాంతి అంత అకస్మాత్తుగా రాకపోవచ్చు! కానీ హింసకు హింసే సమాధానం అనుకునే ప్రపంచం దీన్నుంచీ కొంచెం ఏదైనా నేర్చుకుంటే బావుంటుంది.
న్యుక్లియర్ డీల్ కు పట్టిన గ్రహణం
ఈ రోజు వార్తల్లో ఒక విశేషం ఉంది. కారత్ అండ్ పార్టీ ''యాంటీ అమెరికనిజం'' తో చేతులూ కాళ్ళూ అడ్డు పెట్టిన న్యూక్లియర్ డీల్ ని ఎలా అయినా పుష్ చెయ్యాలని ప్రధాని + సోనియా .. ఇలా అందరు ప్రయత్నాలు చేస్తున్నారంట. ఈ రోజుకి ఇన్ ఫ్లేషన్ పన్నెండు శాతం ఉంది. ప్రపంచం అంతా చమురు సంక్షోభం లో చిక్కుకు పోయింది. కొందామన్నా పెట్రోల్ దొరకని రోజులు వచ్చాయి. పెట్రోల్ బారెల్ $ 150 కూడా దాటేస్తూంది. ఇలాంటి కష్ట కాలం లో బంగారు పళ్ళెం లాంటి ఈ న్యూక్లియర్ ఒప్పందం భారత దేశానికి మేలే చేస్తుంది. ఇంధనావసరాలలో కొన్నిటికైనా ఈ డీల్ వల్ల ఒక ప్రత్నామ్యాయం దొరుకుతుంది.
అదృష్టవశాత్తూ సమాజ్ వాదీ పార్టీ సహాయం తొ, ఒక వేళ కారత్ తిక్క వేషాలు వేసి ప్రభుత్వానికి మద్దతు ఉపసం హరించుకుంటే తట్టుకుని నిలబడి, ఈ డీల్ అసలు అమలు లోకి వచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని విని, చెవుల్లో అమృతం పోసినట్టనిపించింది. నిజంగా.. రాజకీయ నాయకులు దేశానికోసం, దేశ ప్రయోజనాల కోసం ఇలా కూటములు ఏర్పాటు చెసె అసలు ఆలోచనంటూ చెసారంటేనే, ఏదో.. దివ్యానుభూతి కలిగినట్టయింది. ఇది ఎంతవరకూ పోతుందో తెలియదు గానీ.. అసలు కారత్ కి నోరు మూయించే ఆయుధం మన్మోహన్ కు దొరకడం.. మన అదృష్టం. ఒకవేళ ఈ రోజు ప్రభుత్వం పడిపోతే, ఈ ఖరీదు రోజుల్లో, ఇంకో సాధారణ ఎన్నికల డ్రామా కి జనం తట్టుకోగలరా ?
ఆలోచించగలిగే శక్తి ఉన్న ప్రతీ వారూ.. ప్రత్నామ్యాయ ఇంధన వనరుల ప్రయోజనాన్ని గుర్తిస్తున్నప్పుడు, భా.జ.పా.కూడా ఈ డీల్ కు వ్యతిరేకం కానప్పుడూ.. ఎవరో తిక్క పార్టీలు తప్ప దీన్ని అందరూ సమర్ధిస్తున్నప్పుడూ.. ఎందుకు ఈ వ్యతిరేకత ? మన ఖర్మ కాక పొతే !
అబ్దుల్ కలాం కూడా ఈ deal దేశ ప్రయోజనాలకు అవసరం అని చెప్పినా.. తలకెక్కని ఈ లెఫ్టిస్టు రాహు కేతువుల ఆట ఎప్పటికైనా కట్టి, న్యూక్లియర్ డీల్ ఒక గట్టున పడాలని ఆ శత కోటి దేవతలకు మొక్కుకుంటూ. .
అదృష్టవశాత్తూ సమాజ్ వాదీ పార్టీ సహాయం తొ, ఒక వేళ కారత్ తిక్క వేషాలు వేసి ప్రభుత్వానికి మద్దతు ఉపసం హరించుకుంటే తట్టుకుని నిలబడి, ఈ డీల్ అసలు అమలు లోకి వచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని విని, చెవుల్లో అమృతం పోసినట్టనిపించింది. నిజంగా.. రాజకీయ నాయకులు దేశానికోసం, దేశ ప్రయోజనాల కోసం ఇలా కూటములు ఏర్పాటు చెసె అసలు ఆలోచనంటూ చెసారంటేనే, ఏదో.. దివ్యానుభూతి కలిగినట్టయింది. ఇది ఎంతవరకూ పోతుందో తెలియదు గానీ.. అసలు కారత్ కి నోరు మూయించే ఆయుధం మన్మోహన్ కు దొరకడం.. మన అదృష్టం. ఒకవేళ ఈ రోజు ప్రభుత్వం పడిపోతే, ఈ ఖరీదు రోజుల్లో, ఇంకో సాధారణ ఎన్నికల డ్రామా కి జనం తట్టుకోగలరా ?
ఆలోచించగలిగే శక్తి ఉన్న ప్రతీ వారూ.. ప్రత్నామ్యాయ ఇంధన వనరుల ప్రయోజనాన్ని గుర్తిస్తున్నప్పుడు, భా.జ.పా.కూడా ఈ డీల్ కు వ్యతిరేకం కానప్పుడూ.. ఎవరో తిక్క పార్టీలు తప్ప దీన్ని అందరూ సమర్ధిస్తున్నప్పుడూ.. ఎందుకు ఈ వ్యతిరేకత ? మన ఖర్మ కాక పొతే !
అబ్దుల్ కలాం కూడా ఈ deal దేశ ప్రయోజనాలకు అవసరం అని చెప్పినా.. తలకెక్కని ఈ లెఫ్టిస్టు రాహు కేతువుల ఆట ఎప్పటికైనా కట్టి, న్యూక్లియర్ డీల్ ఒక గట్టున పడాలని ఆ శత కోటి దేవతలకు మొక్కుకుంటూ. .
06/04/2008
Rahul Gandhi
I tried to use lekhini today, to post this content but I couldnt do it.. I have experienced some trouble in opening lekhini.org. And since I am technically challenged, I couldnt find an immediate solution / alternative to type my content in Telugu. So please bear with me.
I am amused to read the recent stories about Rahul Gandhi... that he rejects to be a minister in the current cabinet reshuffle. I also read that Rahul stated that 'since he is born into a rich family, he doesnt know what poverty is like.. and that he wants the experience it first hand'!!
Alas.. he tried to stay with a dalit family in Amethi during one of his campaigns. But his staff had ofcourse arranged all kinds of mosquito repellants at his servise.. and made his stay a pleasant one.
I suppose he didnt have much to see and experience during his trials and tribulations to experience poverty. Had he spent one open night with mosquitos, he would have experienced what it would like to be poor and uncatered for.
Unfortunately, the young leader doesnt even seem to have a vision for himself. Or Does He ? I have no idea.
I am amused to read the recent stories about Rahul Gandhi... that he rejects to be a minister in the current cabinet reshuffle. I also read that Rahul stated that 'since he is born into a rich family, he doesnt know what poverty is like.. and that he wants the experience it first hand'!!
Alas.. he tried to stay with a dalit family in Amethi during one of his campaigns. But his staff had ofcourse arranged all kinds of mosquito repellants at his servise.. and made his stay a pleasant one.
I suppose he didnt have much to see and experience during his trials and tribulations to experience poverty. Had he spent one open night with mosquitos, he would have experienced what it would like to be poor and uncatered for.
Unfortunately, the young leader doesnt even seem to have a vision for himself. Or Does He ? I have no idea.
Subscribe to:
Comments (Atom)


